- Home
- Telangana
- కులగణనలో మీ వివరాలు ఇవ్వలేకపోయారా? ఏం పర్లేదు ఈ నెంబర్కి కాల్ చేస్తే అధికారులే మీ ఇంటికొస్తారు
కులగణనలో మీ వివరాలు ఇవ్వలేకపోయారా? ఏం పర్లేదు ఈ నెంబర్కి కాల్ చేస్తే అధికారులే మీ ఇంటికొస్తారు
తెలంగాణ ప్రభుత్వం కులగణన సర్వేను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అధికారులు నేరుగా ఇంటికి వచ్చి కుటుంబ సభ్యుల వివరాలును అడిగి తెలుసుకున్నారు. అయితే కొందరు ఊర్లలో లేకపోవడం, ఇతర కారణాలతో వివరాలు ఇవ్వలేకపోయారు. ఇలాంటి వారి కోసమే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెకండ్ ఫేజ్ సర్వేను ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
- FB
- TW
- Linkdin
Follow Us
)
Telangana govt
కులగణన వివరాలు అందించలేకపోయిన వారి కోసం తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ఇందులో భాగంగానే ఆదివారం నుంచి రెండో ఫేజ్ను ప్రారంభించింది. తొలి ఫేజ్లో సర్వేలో పాల్గొనని సుమారు 3,56,323 కుటుంబాలకు మరో అవకాశం ఇచ్చింది. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఈ అవకాశం కల్పించారు. ఎవరైతే తమ వివరాలు అందించలేరో నేరుగా ఎంపీడీవో కార్యాలయం, వార్డు ఆఫీసులకు వెళ్లి కూడా వివరాలు అందించవచ్చని అధికారులు తెలిపారు. ఇందుకోసం ఈ వెబ్సైట్ నుంచి సర్వేఫామ్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఈ ఫామ్ను ఫిల్ చేసి సంబంధిత అధికారులు అందిస్తే సరిపోతుంది.
Caste Census Report
అయితే ఇలా వెళ్లలేని వారి కోసం కూడా ప్రభుత్వం ఓ వెసులుబాటును కల్పించారు. టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే చాలు నేరుగా అధికారులే ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కాల్ సెంటర్ పనిచేస్తుంది. 040-211 11111 నెంబర్కు కాల్ చేయాలి తర్వాత ఆధార్ నంబర్, మొబైల్ నెంబర్, అడ్రస్తో పాటుగా పోస్టల్ పిన్ కోడ్ వంటి వివరాలు తెలియజేసి, మీ ఇంటి అడ్రస్ను చెబితే ఎన్యుమరేటర్లు నేరుగా మీ ఇంటికి వచ్చి వివరాలను సేకరిస్తారు.
సర్వేలో ఎంత మంది పాల్గొన్నారు.?
రాష్ట్రంలో తొలి విడతలో భాగంగా నిర్వహించిన కుల గణన సర్వేలో మొత్తం 1,15,71,457 కుటుంబాలకుగాను 1,12,15,134 కుటుంబాలు పాల్గొన్నారు. అంటే సుమారు 96.9 శాతం మంది తమ వివరాలను అందించారు. అయితే మిగిలి 3.1 శాతం మంది కుటుంబాలు సర్వేలో పాల్గొనలేదని ప్రభుత్వం చెబుతోంది. దీంతో 100 శాతం కుటుంబాలను సర్వేలో పాల్గొనేలా చేయాలనే లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం మరో 13 రోజుల పాటు సర్వే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
అసలు ఎందుకీ కులగణన?
రాష్ట్రం లేదా దేశంలో ఎంత జనాభా ఉన్నారంటే సమాధానం వస్తుంది. కానీ ఏ సామాజిక వర్గానికి చెందిన వారు ఎంత మంది ఉన్నారని చెప్పడం మాత్రం అసాధ్యం. ఇదిగో దీన్ని దృష్టిలో పెట్టుకొనే తెలంగాణ ప్రభుత్వం ఈ కులగణన చేపట్టింది. సామాజికవర్గాలవారిగా జనాభా లెక్కలు తేలుస్తామని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈ సర్వే చేపట్టారు. ఈ సర్వే ప్రకారం తెలంగాణలో పురుషులు 1,79,21,183, మహిళలు 1,75,42,597 ఉన్నారు. ఇక థర్డ్ జెండర్ వారు 13,774 ఉన్నారు.
ఇక సామాజిక వర్గాల విషయానికొస్తే.. మొత్తం జనాభాలో బీసీలు 1,64,09,179 (46.25 శాతం) మంది ఉన్నారు. ముస్లింలలో మరో 35,76,588 (10.8 శాతం) మంది బిసిలు వున్నారు. మొత్తంగా చూసుకుంటే రాష్ట్రంలో బిసి జనాభా శాతం 56 శాతానికి పైగానే వుంది. అలాగే ఎస్సీలు 61,84,319 (17.43 శాతం), ఎస్టీలు 37,05,929 (10.45 శాతం), ఓసీలు 47,21,115 (13 శాతం) ఉన్నారు. ముస్లింలలో ఓసి సామాజికవర్గానికి చెందినవారు 8,80,424 (2.48 శాతం) ఉన్నారు. మొత్తంగా జనరల్ వర్గానికి చెందిన ముస్లింలను కూడా కలిపితే ఓసి జనాభా 15% పైగా ఉంది.