MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • కొత్త పేమెంట్ వ్యవస్థను ప్రారంభించిన ప్రధాని మోడి.. ఎలా పనిచేస్తుందో ప్రతిదీ తెలుసుకోండి..

కొత్త పేమెంట్ వ్యవస్థను ప్రారంభించిన ప్రధాని మోడి.. ఎలా పనిచేస్తుందో ప్రతిదీ తెలుసుకోండి..

ఇ -రూపి అనేది డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫాం, దినీని పూర్తిగా నగదు రహిత, కాంటాక్ట్‌లెస్‌గా రూపొందించారు. ఈ డిజిటల్ ప్లాట్‌ఫాం లావాదేవీ పూర్తయిన తర్వాత మాత్రమే సర్వీస్ ప్రొవైడర్‌కు చెల్లింపుని నిర్ధారిస్తుంది. ఇ -రూపి  అంటే ఏమిటి, అది ఎలా పని చేస్తుంది, ఎక్కడ ఉపయోగించవచ్చో దాని గురించి పూర్తిగా తెలుసుకోండి. 

3 Min read
Ashok Kumar | Asianet News
Published : Aug 02 2021, 06:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఇ -రూపి  అంటే ఏమిటి, అది ఎలా పని చేస్తుంది, ఎక్కడ ఉపయోగించవచ్చో దాని గురించి పూర్తిగా తెలుసుకోండి. అయితే దీనికి ముందు ప్రధాన మంత్రి  నరేంద్ర మోడి ప్రసంగంలోని ముఖ్యమైన విషయాలు ఏంటంటే... 

 నేడు ప్రధాని నరేంద్ర మోడీ డిజిటల్ గవర్నెన్స్‌కు కొత్త కోణాన్ని ఇస్తున్నట్లు అన్నారు. దేశంలో డిజిటల్ లావాదేవీలలో డిబిటిని మరింత ప్రభావవంతంగా మార్చడంలో ఇ -రూపి వోచర్లు పెద్ద పాత్ర పోషించబోతున్నాయి. 

ప్రభుత్వం మాత్రమే కాదు, ఏదైనా సాధారణ సంస్థ లేదా సంస్థ ఎవరికైనా చికిత్సలో సహాయం చేయడం కోసం, వారి చదువు కోసం లేదా మరేదైనా సహాయం చేయాలనుకుంటే వారు నగదుకు బదులుగా ఇ -రూపిని ఇవ్వవచ్చు. వారు ఇచ్చిన డబ్బు ఆ పనికి మాత్రమే ఉపయోగించబడుతుందని నిర్ధారిస్తుంది.

ఇ -రూపి ఒక విధంగా చెప్పాలంటే  వ్యక్తి అలాగే నిర్దిష్ట ఉద్దేశం అని పిఎం చెప్పారు. ఏదైనా సాయం లేదా ఏదైనా ప్రయోజనం కోసం చేస్తున్నారో ఆ ప్రయోజనం కోసం మాత్రమే ఇ -రూపి ఉపయోగించబడుతుంది, అలాగే ఇ-రూపిని దీనిని నిర్ధారిస్తుంది. నేడు దేశం ఆలోచన భిన్నంగా ఉంది, ఇంకా చాలా కొత్తది. నేడు మనం టెక్నాలజీని ప్రగతి సాధనంగా, పేదలకు సహాయం చేయడానికి చూస్తున్నాం.


ప్రధాని నరేంద్ర మోదీ మన దేశంలో ఇంతకు ముందు టెక్నాలజి కొంతమంది ధనవంతులకు మాత్రమే అని చెప్పేవారు అని అన్నారు. భారతదేశం పేద దేశం, కాబట్టి భారతదేశానికి టెక్నాలజి ఉపయోగం ఏమిటి ? టెక్నాలజీని మిషన్‌గా మార్చడం గురించి మా ప్రభుత్వం మాట్లాడేటప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు, కొందరు నిపుణులు దీనిని ప్రశ్నించేవారు.
 

25

ఇన్నోవేషన్ విషయానికి వస్తే సర్వీస్ డెలివరీలో టెక్నాలజీని ఉపయోగించడం, ప్రపంచంలోని అతిపెద్ద దేశాల సహకారంతో గ్లోబల్ లీడర్‌షిప్ అందించే సత్తా భారతదేశానికి ఉంది.

అలాగే మా ప్రభుత్వం పి‌ఎం స్వనిధి యోజనను ప్రారంభించిందని అన్నారు. నేడు, దేశంలోని చిన్న, పెద్ద నగరాల్లో 23 లక్షల మందికి పైగా స్ట్రీట్ వెండర్స్, వెండర్స్  ఈ పథకం కింద సహాయం పొందారు. ఈ కరోనా కాలంలో వారికి దాదాపు రూ .2300 కోట్లు అందించారు.

దేశంలో డిజిటల్ మౌలిక సదుపాయాలు, డిజిటల్ లావాదేవీల కోసం గత 6-7 సంవత్సరాలలో చేసిన కృషిని  ప్రపంచం అంగీకరిస్తోంది. ముఖ్యంగా భారతదేశంలో ఫిన్‌టెక్  భారీ పునాది సృష్టించింది. పెద్ద దేశాలలో కూడా ఇది జరగదు.

ఇ-రూపి అంటే ఏమిటి?
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) ఆర్థిక సేవల విభాగం, ఆరోగ్య అండ్ కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, నేషనల్ హెల్త్ అథారిటీ సహకారంతో ఇ-రూపిని యుపిఐ ప్లాట్‌ఫామ్‌లో అభివృద్ధి చేసింది. ఇంకా ఇ-రూపి పూర్తిగా నగదు రహిత, కాంటాక్ట్‌లెస్ డిజిటల్ చెల్లింపుల సాధనం. 
 

35
ఇ-రూపి ప్రయోజనాలు ఏమిటి?

ఇ-రూపి ప్రయోజనాలు ఏమిటి?

సిస్టమ్ యూజర్లు కార్డు, డిజిటల్ పేమెంట్ యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ చేయకుండానే  సర్వీస్ ప్రొవైడర్ కేంద్రంలో వోచర్ మొత్తాన్ని స్వీకరించవచ్చు.

ఇ-రూపి సర్వీస్ స్పాన్సర్స్  లబ్ధిదారులతో ఇంకా సర్వీస్ ప్రొవైడర్స్ తో డిజిటల్ పద్ధతిలో ఎలాంటి ఫిజికల్ ఇంటర్‌ఫేస్ లేకుండా కనెక్ట్ చేస్తుంది

లావాదేవీ పూర్తయిన తర్వాత మాత్రమే సర్వీస్ ప్రొవైడర్‌కు చెల్లింపు చేయబడినట్లు కూడా నిర్ధారిస్తుంది.

ప్రీ-పెయిడ్ అయినందున ఏ మధ్యవర్తి జోక్యం లేకుండా సర్వీస్ ప్రొవైడర్‌కు సకాలంలో పేమెంట్ చేయడం సాధ్యపడుతుంది.

ఈ డిజిటల్ పేమెంట్ సొల్యూషన్ అవినీతి రహిత సంక్షేమ సేవలను అందించే దిశగా ఒక విప్లవాత్మక కార్యక్రమం. 

45
ఇ-రూపిని ఎక్కడ ఉపయోగించవచ్చు?

ఇ-రూపిని ఎక్కడ ఉపయోగించవచ్చు?

మాతా శిశు సంక్షేమ పథకాలు, టిబి నిర్మూలన కార్యక్రమాలు, ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన, ఎరువుల సబ్సిడీ మొదలైన పథకాల కింద మందులు, పోషకాహార సహాయం అందించడం వంటి పథకాల కింద సేవలను అందించడానికి దీనిని ఉపయోగించవచ్చు. ప్రైవేట్ రంగం కూడా ఉద్యోగుల సంక్షేమం, కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాల కింద ఈ డిజిటల్ వోచర్‌లను ఉపయోగించవచ్చు.  
 

55
ఎలా పని చేస్తుంది ?

ఎలా పని చేస్తుంది ?

ఇ-రూపి అనేది ప్రీపెయిడ్ ఇ-వోచర్. క్యూ‌ఆర్ కోడ్ లేదా ఎస్‌ఎం‌ఎస్ స్ట్రింగ్ ఆధారంగా ఇ-వోచర్‌ పనిచేస్తుంది. వినియోగదారులు కార్డులు, డిజిటల్ చెల్లింపు యాప్‌లు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ ఉపయోగించకుండా వోచర్‌లను రీడీమ్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ-రూపి సర్వీస్ స్పాన్సర్‌లను లబ్ధిదారులతో ఇంకా సర్వీస్ ప్రొవైడర్స్  డిజిటల్ పద్ధతిలో ఎలాంటి ఫిజికల్ ఇంటర్‌ఫేస్ లేకుండా కనెక్ట్ చేస్తుంది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved