MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • WTC 2025-27 : ఓడింది సౌతాఫ్రికా చేతిలోనే.. కానీ పరువుపోయింది పాక్ ముందు..!

WTC 2025-27 : ఓడింది సౌతాఫ్రికా చేతిలోనే.. కానీ పరువుపోయింది పాక్ ముందు..!

World Test Championship 2025-27 : సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్ లోనూ టీమిండియా ఓటమిపాలయ్యింది. దీంతో రెండు టెస్టుల సీరిస్ ను ఓడిపోవడమే కాదు పాకిస్థాన్ ముందు పరువు తీసుకుంది ఇండియన్ టీం. 

2 Min read
Author : Arun Kumar P
Published : Nov 26 2025, 02:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అసలిది ఇండియన్ టీమేనా..!
Image Credit : X

అసలిది ఇండియన్ టీమేనా..!

WTC 2025-27 : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2025-27లో టీమిండియా మరో ఘోర పరాభవాన్ని చవిచూసింది. గౌహతి టెస్ట్ లో దక్షిణాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిపోయింది. స్వదేశంలో జరిగిన రెండు టెస్టుల సీరిస్ లో భారత ఆటగాళ్లు ఘోరంగా విపలమయ్యారు... సౌతాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. ఈ టెస్ట్ సీరిస్ ఓటమే ఇండియన్ అభిమానులను ఎంతగానో బాధపెడుతోంది... ఈ సమయంలో WTC 2025-27 పాయింట్ టేబుల్ బాధను మరింత పెంచింది. ఈ ఓటమితో భారత్ స్థానం పాకిస్థాన్ కంటే దిగజారడం అభిమానులకి పుండుమీద కారం చల్లినట్లుగా ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
WTC 2025-27 పాయింట్స్ టేబుల్
Image Credit : Getty

WTC 2025-27 పాయింట్స్ టేబుల్

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2025-27 లో భాగంగా టీమిండియా ఇప్పటివరకు ఇంగ్లాండ్, వెస్టిండిస్, సౌతాఫ్రికా దేశాలతో 9 టెస్ట్ మ్యాచులు ఆడింది. ఇందులో నాలుగు విజయాలు, నాలుగు ఓటములు ఉండగా ఓ మ్యాచ్ డ్రా అయ్యింది. దీంతో WTC పాయింట్స్ టేబుల్లో టీమిండియా ఐదో స్థానానికి పరిమితం అయ్యింది... విజయశాతం 48.15, పాయింట్స్ 52 కు చేరాయి.

ఇండియా కంటే మెరుగైన స్థానంలో పాకిస్థాన్ ఉంది. WTC లో కేవలం రెండుమ్యాచులే ఆడిన పాక్ ఒకదాంట్లో ఓడి, మరోటి గెలిచింది. కానీ పాక్ విజయశాతం 50 గా ఉండటంతో పాయింట్ టేబుల్లో టాప్ 4కి చేరింది… పాయింట్స్ మాత్రం కేవలం పన్నెండే. 

Related Articles

Related image1
IND vs SA 2nd Test : చేతులెత్తేసిన టీమిండియా.. సౌతాఫ్రికా ఘనవిజయం
Related image2
31 బంతుల్లో సెంచరీ.. 11 ఫోర్లు, 8 సిక్సర్లతో ధోని శిష్యుడి ఊచకోత.. ఇంతకీ ప్లేయర్ ఎవరంటే.?
35
భారత్ పై విజయంతో టాప్ 2 సౌతాఫ్రికా
Image Credit : ANI

భారత్ పై విజయంతో టాప్ 2 సౌతాఫ్రికా

WTC 2025-27 పాయింట్స్ టేబుల్లో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలిచింది. ఈ జట్టు ఇప్పటివరకు నాలుగు మ్యాచులు ఆడి అన్నింటా గెలిచింది. 100 శాతం విజయాలతో ఆసిస్ మొదటిస్థానంలో నిలిచింది.

టీమిండియాతో 2 టెస్టుల సీరిస్ ను క్లీన్ స్వీప్ చేసింది సౌతాఫ్రికా. అంతకుముందు పాకిస్థాన్ తో జరిగిన 2 టెస్టుల సీరిస్ లో 1 విజయం, 1 పరాజయం ఎదురయ్యింది. ఇలా WTC లో మొత్తం 4 టెస్టులు ఆడిన సపారీలు 3 విజయాలు సాధించారు.. 75 శాతం విజయాలతో పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానానికి చేరుకున్నారు.

శ్రీలంక 66 శాతం విజయాలతో WTC పాయింట్స్ టేబుల్ లో 3వ స్థానంలో నిలిచింది. ఈ జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో 2 మ్యాచులు ఆడగా ఒకటి గెలిచి మరోటి డ్రా చేసుకుంది. బంగ్లాదేశ్ తో ఈ టెస్ట్ సీరిస్ ఆడింది శ్రీలంక.

45
గౌహతి టెస్ట్ లో టీమిండియా పరాజయం
Image Credit : ANI

గౌహతి టెస్ట్ లో టీమిండియా పరాజయం

WTC 2025-27 లో భాగంగా టీమిండియా-సౌతాఫ్రికాల మధ్య రెండు టెస్టుల సీరిస్ జరిగింది. స్వదేశంలో జరిగిన ఈ టెస్ట్ సీరిస్ లో టీమిండియా ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. కోల్ కతా టెస్టులో ఓడిన భారత జట్టు తాజాగా గౌహతి టెస్టులో అంతకంటే ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఏకంగా 408 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించింది సౌతాఫ్రికా. దీంతో బావుమా కెప్టెన్సీలో ఆఫ్రికా జట్టు 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.

55
జడేజా ఒంటరి పోరాటం...
Image Credit : Insta/indiancricketteam

జడేజా ఒంటరి పోరాటం...

రిషబ్ పంత్ కెప్టెన్సీలోని భారత్ జట్టు అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 201 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 140 పరుగులకే కుప్పకూలింది. రవీంద్ర జడేజా 54 పరుగులు చేసినా జట్టు పరువును కాపాడలేకపోయాడు. మిగతా టీమిండియా ఆటగాళ్లలో ఒక్కరు కూడా కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయారు. యశస్వి జైస్వాల్ (13), కేఎల్ రాహుల్ (6), సాయి సుదర్శన్ (14), ధ్రువ్ జురెల్ (2), రిషబ్ పంత్ (13), వాషింగ్టన్ సుందర్ (16), నితీష్ కుమార్ రెడ్డి (0), జస్ప్రీత్ బుమ్రా (1), మహ్మద్ సిరాజ్ (0) పరుగులు చేశారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Recommended image2
Shafali Verma: 22 ఏళ్లకే హిస్టరీ క్రియేట్ చేసిన షఫాలీ వర్మ.. పాక్ మ్యాచ్‌లో దెబ్బకు రికార్డులన్నీ బద్దలు
Recommended image3
Sree Charani: పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న తెలుగమ్మాయి.. శ్రీచరణి దెబ్బకు రికార్డులు బద్దలు
Related Stories
Recommended image1
IND vs SA 2nd Test : చేతులెత్తేసిన టీమిండియా.. సౌతాఫ్రికా ఘనవిజయం
Recommended image2
31 బంతుల్లో సెంచరీ.. 11 ఫోర్లు, 8 సిక్సర్లతో ధోని శిష్యుడి ఊచకోత.. ఇంతకీ ప్లేయర్ ఎవరంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved