MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • WPL 2026 ఆక్షన్‌కు ముందే ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు.. ఆర్సీబీ రిటెన్షన్ ప్లేయర్లు వీరే

WPL 2026 ఆక్షన్‌కు ముందే ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు.. ఆర్సీబీ రిటెన్షన్ ప్లేయర్లు వీరే

WPL 2026 RCB retention list: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మహిళా జట్టు డబ్ల్యూపీఎల్ 2026 కోసం స్మృతి మంధాన, రిచా ఘోష్ లతో పాటు ప్రత్యర్థి జట్లకు దడపుట్టించే ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Mahesh Rajamoni
Published : Nov 06 2025, 10:27 PM IST| Updated : Nov 06 2025, 10:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మరో ట్రోఫీ కోసం ఆర్సీబీ సిద్ధం.. రిటెన్షన్ ప్లేయర్లు ఎవరంటే?
Image Credit : X/@wplt20

మరో ట్రోఫీ కోసం ఆర్సీబీ సిద్ధం.. రిటెన్షన్ ప్లేయర్లు ఎవరంటే?

2024లో మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ట్రోఫీని గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి బలమైన బృందంతో 2026 మెగా ఆక్షన్‌కు సిద్ధమైంది. జట్టు మేనేజ్‌మెంట్ ఛాంపియన్ జట్టును నిలబెట్టే దిశగా నలుగురు కీలక ఆటగాళ్లను కొనసాగించాలని నిర్ణయించింది. వీరిలో కెప్టెన్ స్మృతి మంధానతో పాటు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ఎల్లీస్ పెర్రీ, వికెట్‌కీపర్ బ్యాటర్ రిచా ఘోష్, యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ ఉన్నారు.

ఈ నలుగురి కొనసాగింపుతో జట్టు ₹8.85 కోట్లు ఖర్చు చేసింది. మిగిలిన ₹6.15 కోట్లు పర్స్‌లో ఉంచుకుని బెంగళూరు నవంబర్ 27న ఢిల్లీలో జరగనున్న మెగా ఆక్షన్‌లో పాల్గొననుంది.

25
స్మృతి మంధానతో బలమైన బ్యాటింగ్ తో ఆర్సీబీ
Image Credit : Getty

స్మృతి మంధానతో బలమైన బ్యాటింగ్ తో ఆర్సీబీ

భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన డబ్ల్యూపీఎల్ చరిత్రలో అత్యధిక పారితోషికం పొందిన మహిళా ఆటగాళ్లలో ఒకరు. ₹3.50 కోట్లకు ఆర్‌సీబీ ఆమెను కొనసాగించింది. ఆమె 2024లో జట్టుకు మొదటి టైటిల్ అందించడమే కాకుండా, 2025 మహిళా వన్డే వరల్డ్ కప్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిందన ప్లేయర్ గా నిలిచింది.

స్మృతి మంధాన నాయకత్వంలో ఆర్‌సీబీకి ఆత్మవిశ్వాసం పెరిగింది. మంధాన బ్యాటింగ్‌ మాత్రమే కాదు.. వ్యూహాత్మక నిర్ణయాలు కూడా జట్టును విజయపథంలో నడిపించాయి.

Related Articles

Related image1
శ్రీ చరణికి షాక్.. ఢిల్లీ క్యాపిటల్స్ రిటెన్షన్ జాబితా ఇదే
Related image2
రిటెన్షన్ తోనే దడపుట్టిస్తున్న ముంబై ఇండియన్స్
35
ఎల్లీస్ పెర్రీ, రిచా ఘోష్ ను రిటైన్ చేసుకున్న ఆర్సీబీ
Image Credit : Instagram /ellyseperry

ఎల్లీస్ పెర్రీ, రిచా ఘోష్ ను రిటైన్ చేసుకున్న ఆర్సీబీ

ఆస్ట్రేలియన్ స్టార్ ఎల్లీస్ పెర్రీ ని ₹2 కోట్లతో ఆర్సీబీ జట్టు రిటైన్ చేసుకుంది. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకరైన పెర్రీ, బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ కీలక పాత్ర పోషించారు.

మరోవైపు యువ వికెట్‌కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ ₹2.75 కోట్లకు ఆర్సీబీకి సైన్ చేశారు. ఆమె అద్భుతమైన ఫినిషింగ్ స్కిల్స్, పవర్ హిట్టింగ్ కారణంగా ఆర్సీబీ మేనేజ్‌మెంట్ ఆమెపై నమ్మకం ఉంచింది. రిచా ఘోష్ ప్రదర్శన జట్టు బ్యాటింగ్‌ను మరింత సమతుల్యంగా చేసింది.

45
శ్రేయాంక పాటిల్.. యంగ్ స్పిన్నర్ పై ఆర్సీబీ బలమైన నమ్మకం
Image Credit : Asianet News

శ్రేయాంక పాటిల్.. యంగ్ స్పిన్నర్ పై ఆర్సీబీ బలమైన నమ్మకం

యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ ను ఆర్సీబీ ₹60 లక్షలతో మళ్లీ రిటైన్ చేసుకుంది. 2024లో ఆమె 8 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలుచుకుంది. గాయాల కారణంగా 2025 సీజన్‌కు దూరమైనా, ఈసారి ఆమె పూర్తి స్థాయిలో తిరిగి రానుంది. ఆర్సీబీకి ఆమె స్పిన్ బౌలింగ్‌లో కీలక ఆయుధం కానుంది.

55
ఆర్సీబీ విడుదల చేసిన ప్లేయర్లు ఎవరు?
Image Credit : X/RCBTweets

ఆర్సీబీ విడుదల చేసిన ప్లేయర్లు ఎవరు?

ఆర్‌సీబీ ఈసారి పెద్ద ఎత్తున మార్పులు చేసింది. సబ్బినేని మేఘనా, స్నేహ రాణా, కనికా ఆహుజా, ఆశా సోభనా, బిష్ట్, రేణుకా సింగ్, అలాగే విదేశీ ఆటగాళ్లు డానీ వైట్-హాడ్జ్, సోఫీ డివైన్, కిమ్ గార్త్, సోఫీ మోలినెక్స్, హీతర్ గ్రాహమ్, జార్జియా వార్‌హామ్, కేట్ క్రాస్ తదితరులను విడుదల చేసింది.

జట్టుకు ఇంకా ఒక రైట్ టు మ్యాచ్ (RTM) కార్డ్ ఉంది. దాంతో ఇప్పుడు వదులుకున్న ఒక ప్లేయర్ ను తిరిగి కొనుగోలు చేసే అవకాశం ఆర్సీబీకి లభిస్తుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
మహిళల క్రికెట్
బెంగళూరు
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved