T20 World Cup 2026 : బుమ్రా గురించి మాటలు అనవసరం.. అదే మంచిది..: ధోని సంచలన కామెంట్స్
MS Dhoni : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘’బుమ్రా గురించి మాటలు అనవసరం'' అన్నారు… ఇలా ఎందుకన్నారో తెలుసా?

గంభీర్, బుమ్రా పై ధోని కామెంట్స్ వైరల్..
ICC Men's T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026 విజేత భారత్ కు సోషల్ మీడియాలో జట్టుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ ప్రముఖుల నుంచి మాజీ ఆటగాళ్లు, సాధారణ ప్రజల వరకు ప్రతీ ఒక్కరూ ఆటగాళ్లను అభినందిస్తున్నారు. ఈ క్రమంలో కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆయన గౌతమ్ గంభీర్ నవ్వును మెచ్చుకుంటూ, బుమ్రా గురించి ఏమీ రాయొద్దంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ధోనీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టీమిండియా విజయంపై ధోని పోస్ట్..
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న (మార్చి 8, ఆదివారం) ఇండియా, న్యూజిలాండ్ మధ్య టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా హాజరయ్యారు. భారత జట్టు న్యూజిలాండ్ పై 96 పరుగుల తేడాతో చారిత్రక విజయం సాధించి, మూడోసారి టీ20 వరల్డ్ కప్ అందుకోడాన్ని ఆయన ప్రత్యక్షంగా చూశారు. ఈ క్రమంలోనే అద్భుత విజయం గురించి ధోనీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.
గంభీర్ నవ్వుపై ధోని...
'అహ్మదాబాద్లో చరిత్ర సృష్టించారు. టీ20 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియా ఆటగాళ్లు, సహాయక సిబ్బందికే కాదు ఈ విజయం కాంక్షించిన క్రికెట్ అభిమానులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఇలాంటి అద్భుతమైన ఆటను చూడటం చాలా ఆనందంగా ఉంది' అని ఇన్స్టాలో రాసుకొచ్చారు.
ఇక టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ గురించి కూడా ధోని ప్రస్తావించారు. ఎప్పుడూ సీరియస్ గా ఉండే గంభీర్ టీ20 విజయం తర్వాత కాస్త నవ్వుతూ కనిపించారు. దీంతో ''మీ ముఖంలో నవ్వు చూడటానికి చాలా అందంగా ఉంది. ఉత్సాహంతో కూడిన ఆ చిరునవ్వు అద్భుతం'' అంటూ గంభీర్ నవ్వు గురించి కామెంట్స్ చేశారు. ‘’చాలా బాగా ఆడారు... ఎంజాయ్ గయ్స్'' అంటూ టీమిండియా ప్లేయర్స్ ను అభినందించారు.
బుమ్రా గురించి ఏమీ రాయను...: ధోని
టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గురించి కూడా ధోని రియాక్ట్ అయ్యారు. 'బుమ్రా గురించి ఏమీ రాయకపోవడమే మంచిది, అతను ఛాంపియన్ బౌలర్' అంటూ తన పోస్ట్ ముగించారు. సోషల్ మీడియాలో ధోనీ పెట్టిన ఈ పోస్ట్ వెంటనే వైరల్ అయ్యింది. దీనికి 1.5 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి.
2 ఏళ్ల తర్వాత ధోని పోస్ట్
ఎంఎస్ ధోనీ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఉండరన్న విషయం తెలిసిందే. ఆయన చివరిసారిగా 2024 జులై 14న అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి సందర్భంగా ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్కు 14 మిలియన్ల మంది లైక్ కొట్టారు. అంతకు ముందు 2024 టీ20 వరల్డ్ కప్ విజయంపై పోస్ట్ పెట్టారు. ఇన్స్టాగ్రామ్లో ఎంఎస్ ధోనీకి సుమారు 50 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

