MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • బ్రిస్బేన్‌ లో దెబ్బకొట్టిన వర్షం.. ఆస్ట్రేలియాపై సిరీస్ గెలిచిన భారత్

బ్రిస్బేన్‌ లో దెబ్బకొట్టిన వర్షం.. ఆస్ట్రేలియాపై సిరీస్ గెలిచిన భారత్

India vs Australia : బ్రిస్బేన్‌లోని గబ్బాలో వర్షం కారణంగా ఐదో టీ20 మ్యాచ్ రద్దయింది. దీంతో భారత్ 2-1 తేడాతో ఆస్ట్రేలియాపై సిరీస్ గెలిచింది. అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 08 2025, 05:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సిరీస్ సొంతం చేసుకున్న భారత్
Image Credit : X/@BCCI

సిరీస్ సొంతం చేసుకున్న భారత్

బ్రిస్బేన్‌లో మ్యాచ్ ను వర్షం దెబ్బకొట్టింది. భారత్, ఆస్ట్రేలియా ఐదో మ్యాచ్ రద్దు అయింది. దీంతో భారత్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో గెలిచింది. గబ్బా స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్ కేవలం 4.5 ఓవర్లు మాత్రమే సాగింది. ఆ సమయంలో భారత్ వికెట్ కోల్పోకుండా 52 పరుగులు చేసింది.

ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత్ తరఫున ఓపెనర్లు అభిషేక్ శర్మ (23 నాటౌట్), శుభ్‌మన్ గిల్ (29 నాటౌట్) దూకుడుగా ఆరంభించారు. ఐదవ ఓవర్‌లో మెరుపులు, తర్వాత భారీ వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. వర్షం తగ్గేలా కనిపించకపోవడంతో అధికారికంగా మ్యాచ్ ను రద్దు చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అభిషేక్ శర్మ ప్రపంచ రికార్డు
Image Credit : X/BCCI

అభిషేక్ శర్మ ప్రపంచ రికార్డు

ఈ మ్యాచ్‌లో కేవలం 11 బంతుల్లో 23 పరుగులు చేసిన అభిషేక్ శర్మ కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆయన 528 బంతుల్లోనే టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 1000 పరుగులు పూర్తి చేశాడు. ఇంతకుముందు సూర్యకుమార్ యాదవ్ 573 బంతుల్లో ఆ రికార్డు సృష్టించారు.

అభిషేక్ శర్మ భారత ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ (27 ఇన్నింగ్స్) తర్వాత తక్కువ ఇన్నింగ్స్‌లలో (28) 1000 టీ20 పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.

Related Articles

Related image1
తెలుగు ప్లేయర్ కు గంభీర్ షాక్.. తిలక్ వర్మ ఎందుకు ఆడటం లేదు?
Related image2
బుమ్రా కాదు.. టీ20 వరల్డ్ కప్ లో భారత్‌కు అసలైన ఆయుధాలు వీరే
36
సిరీస్‌లో అభిషేక్ శర్మ అద్భుత ప్రదర్శన
Image Credit : X/BCCI

సిరీస్‌లో అభిషేక్ శర్మ అద్భుత ప్రదర్శన

అభిషేక్ శర్మ సిరీస్ మొత్తం 163 పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. ఆయన స్ట్రైక్ రేట్ 160 కాగా, సగటు 40.75. మొత్తం 18 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు.

మెల్‌బోర్న్‌లోని రెండో టీ20లో భారత్ ఓడినా, అభిషేక్ 37 బంతుల్లో 68 పరుగులతో హాఫ్ సెంచరీ కొట్టాడు. సిరీస్‌లో గిల్ 132 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు, టిమ్ డేవిడ్ 89 పరుగులతో మూడవ స్థానంలో నిలిచాడు.

46
గబ్బా మ్యాచ్ పై వర్షం
Image Credit : ANI

గబ్బా మ్యాచ్ పై వర్షం

గబ్బాలో జరిగిన చివరి టీ20లో ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కానీ బ్యాడ్ వెదర్ కారణంగా వారికి నిరాశ ఎదురైంది. వర్షం ప్రారంభమయ్యే వరకు గిల్ మంచి టచ్ లో కనిపించాడు. బెన్ డ్వార్ష్యూస్ బౌలింగ్‌లో వరుస బౌండరీలు కొట్టాడు. అభిషేక్‌కి ప్రారంభంలో టైమింగ్ సమస్యలు ఎదురైనా, తర్వాత వేగం అందుకున్న సమయంలో వర్షం మళ్లీ మొదలైంది.

56
13 ఏళ్ల జైత్ర యాత్ర కొనసాగుతోంది
Image Credit : X/BCCI

13 ఏళ్ల జైత్ర యాత్ర కొనసాగుతోంది

భారత్ 2012 నుండి ఆస్ట్రేలియాలో ఏ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ను కోల్పోలేదు. ఈసారి కూడా ఆ రికార్డు కొనసాగించింది. 2016లో 3-0, 2020లో 2-1 విజయాల తర్వాత, ఇప్పుడు 2025లో కూడా 2-1తో విజేతగా నిలిచింది.

ఇది భారత్‌కు వరుసగా ఏడో ద్వైపాక్షిక టీ20 సిరీస్ విజయం. గతంలో ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే, శ్రీలంక, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లపై విజయాలు సాధించింది. 2023లో వెస్టిండీస్‌పై ఓటమి తర్వాత భారత్ ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు.

66
తర్వాతి సిరీస్ దక్షిణాఫ్రికాతో..
Image Credit : Getty

తర్వాతి సిరీస్ దక్షిణాఫ్రికాతో..

భారత జట్టు తన తర్వాతి సిరీస్ లో సౌతాఫ్రికాతో పోటీ పడనుంది. ఈ టీ20 సిరీస్ డిసెంబర్ 9 నుండి 19 వరకు జరగనుంది. కటక్, ముల్లాన్పూర్, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్‌లలో ఐదు మ్యాచ్‌లు జరుగుతాయి. యంగ్ ప్లేయర్లతో కూడిన భారత జట్టు సూర్యకుమార్ నాయకత్వంలో ప్రోటిస్ పై కూడా ఇదే జోరును కొనసాగించాలని చూస్తోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Recommended image2
Kohli Anushka: విరాట్-అనుష్క లండన్ ఎందుకు వెళ్లారో తెలుసా? సీక్రెట్ బయటపెట్టిన మాధురీ దీక్షిత్ భర్త!
Recommended image3
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Related Stories
Recommended image1
తెలుగు ప్లేయర్ కు గంభీర్ షాక్.. తిలక్ వర్మ ఎందుకు ఆడటం లేదు?
Recommended image2
బుమ్రా కాదు.. టీ20 వరల్డ్ కప్ లో భారత్‌కు అసలైన ఆయుధాలు వీరే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved