MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • టెస్టులు అయిపాయే.! వన్డేలపై టీమిండియా ఫోకస్.. పగ తీర్చుకుంటుందా మరి.?

టెస్టులు అయిపాయే.! వన్డేలపై టీమిండియా ఫోకస్.. పగ తీర్చుకుంటుందా మరి.?

Team India: టెస్టుల్లో ఓటమి తర్వాత భారత్, సౌతాఫ్రికా వన్డే సిరీస్‌కు సిద్దమవుతున్నాయి. శుభ్‌మాన్ గిల్, శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రోహిత్, కోహ్లీ కీలకంగా మారనున్నారు. 

2 Min read
Author : Pavithra D
Published : Nov 28 2025, 07:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టెస్టుల్లో బోల్తా.. ఇప్పుడు వన్డేలు..
Image Credit : Instagram\BCCI

టెస్టుల్లో బోల్తా.. ఇప్పుడు వన్డేలు..

టెస్టుల్లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. చివరికి సౌతాఫ్రికా వ్యూహాల ముందు నిలవలేకపోయింది. టెస్టులను టెస్టుల్లా కాకుండా వైట్ బాల్ ఫార్మాట్‌లా ఆడటానికి ప్రయత్నించి చిత్తుగా ఓడిపోయింది. రెండు టెస్టుల సిరీస్‌లో కనీసం ఫైట్ కూడా ఇవ్వలేక పాతికేళ్ల తర్వాత స్వదేశంలో సౌతాఫ్రికాకు సిరీస్‌ను కోల్పోయింది. ఇప్పుడు వన్డే సిరీస్‌లో టెస్ట్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అనేది క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆ మాజీ కెప్టెన్లు కీలకం..
Image Credit : X/BCCI

ఆ మాజీ కెప్టెన్లు కీలకం..

టెస్టులతో పోల్చితే వన్డేల్లో టీమిండియా బలంగా కనిపిస్తోంది. మూడు వన్డేల సిరీస్‌లో మాజీ కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించనున్నారు. ఇద్దరూ ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసి రానుంది. అయితే, రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ కోల్‌కతా టెస్టులో గాయపడటంతో వన్డే సిరీస్‌కు అందుబాటులో లేడు. ప్రస్తుతం అతడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. దీంతో వన్డేల్లో టీమిండియాకు కేఎల్ రాహుల్ సారధ్యం వహించనున్నాడు.  

Related Articles

Related image1
తమ్ముడు విరాట్.! టెస్ట్ రిటైర్‌మెంట్ వెనక్కి తీసుకో.. టీమిండియా పిలుస్తోంది
Related image2
అరె చిచ్చా.! ఇది హిట్‌మ్యాన్ ఇలాకా.. మళ్లీ బాహుబలి రేంజులో టాప్‌లోకి వచ్చేశాడుగా
35
రెగ్యులర్ వైస్ కెప్టెన్ కూడా దూరం..
Image Credit : X/BCCI

రెగ్యులర్ వైస్ కెప్టెన్ కూడా దూరం..

రెగ్యులర్ వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సైతం వన్డే సిరీస్‌కు అందుబాటులో లేడు. సిడ్నీ వన్డేలో గాయపడిన తర్వాత అయ్యర్ ఆటకి దూరమయ్యాడు. అతను బరిలో దిగడానికి ఇంకా రెండు, మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ఓపెనర్‌గా గిల్ స్థానంలో ఎవరు దిగుతారు. శ్రేయస్ అయ్యర్ బదులుగా నాలుగో స్థానంలో ఎవరు ఆడతారన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

45
రో-కోపైనే భారం..
Image Credit : ANI

రో-కోపైనే భారం..

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో ఒక ఓపెనర్‌గా రోహిత్ శర్మ బరిలో దిగుతాడు. మరో ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్ ఆడే అవకాశం ఉంది. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కూడా అడ్వాంటేజ్ అవుతుందనే ఆలోచనలో టీమ్ మేనేజ్‌మెంట్ ఉంది. అయితే ఓపెనర్ స్లాట్ కోసం రుతురాజ్ గైక్వాడ్ కూడా పోటీలో ఉన్నాడు. ఇటీవల ఇండియా ఏ జట్టు తరఫున మెరుగ్గా రాణించాడు. మూడో స్థానంలో కోహ్లీ మీద భారీ అంచనాలే ఉండబోతున్నాయి. నాలుగో స్థానంలో తిలక్ వర్మను ఆడిస్తే బాగుంటుందనే చర్చ జరుగుతోంది. గ్యాప్ తర్వాత జట్టులోకి పంత్ వచ్చాడు. పైగా వైస్ కెప్టెన్‌గానూ ఉన్నాడు. దీంతో తుది జట్టులో పంత్ ఉండటం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. ధృవ్ జురేల్ బెంచ్‌కే పరిమితం కావచ్చంటున్నారు.

55
వన్డే సిరీస్‌పై అభిమానుల్లో ఆసక్తి..
Image Credit : ANI

వన్డే సిరీస్‌పై అభిమానుల్లో ఆసక్తి..

వన్డే టీమ్‌లో అక్షర్ పటేల్‌కు ఛాన్స్ దొరకలేదు. తుది జట్టులో స్పిన్ ఆల్ రౌండర్లుగా వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా బరిలో దిగడం ఖాయమనే అంచనాలున్నాయి. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ ఒక్కడే ఉన్నాడు. జట్టులో చోటు కోసం పేస్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి సైతం ఎదురు చూస్తున్నాడు. వన్డే సిరీస్ నుంచి బుమ్రాకు రెస్ట్ ఇచ్చారు. దీంతో పేస్ విభాగాన్ని అర్షదీప్ సింగ్ లీడ్ చేసే అవకాశం ఉంది. మరో పేసర్‌గా హర్షిత్ రాణా బరిలో దిగే ఛాన్స్ కనిపిస్తోంది. రేస్‌లో ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఉన్నాడు. అయితే, టెస్ట్ సిరీస్ ఓటమిని మరిచిపోయి భారత్ సమిష్టిగా రాణించాలని నిపుణులు సూచిస్తున్నారు. హోమ్ అడ్వాంటేజ్‌ను వినియోగించుకొని చెలరేగాలంటున్నారు. మొత్తంగా భారత్, సౌత్ ఆఫ్రికా మధ్య జరగబోయే వన్డే సిరీస్ ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
విరాట్ కోహ్లీ
రోహిత్ శర్మ

Latest Videos
Recommended Stories
Recommended image1
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Recommended image2
Shafali Verma: 22 ఏళ్లకే హిస్టరీ క్రియేట్ చేసిన షఫాలీ వర్మ.. పాక్ మ్యాచ్‌లో దెబ్బకు రికార్డులన్నీ బద్దలు
Recommended image3
Sree Charani: పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న తెలుగమ్మాయి.. శ్రీచరణి దెబ్బకు రికార్డులు బద్దలు
Related Stories
Recommended image1
తమ్ముడు విరాట్.! టెస్ట్ రిటైర్‌మెంట్ వెనక్కి తీసుకో.. టీమిండియా పిలుస్తోంది
Recommended image2
అరె చిచ్చా.! ఇది హిట్‌మ్యాన్ ఇలాకా.. మళ్లీ బాహుబలి రేంజులో టాప్‌లోకి వచ్చేశాడుగా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved