MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • ఆసియా కప్ హాకీ 2025: హర్మన్‌ప్రీత్ సింగ్ హ్యాట్రిక్.. ఉత్కంఠ పోరులో చైనాపై భారత్‌ గెలుపు

ఆసియా కప్ హాకీ 2025: హర్మన్‌ప్రీత్ సింగ్ హ్యాట్రిక్.. ఉత్కంఠ పోరులో చైనాపై భారత్‌ గెలుపు

Asia Cup Hockey 2025: హర్మన్‌ప్రీత్ సింగ్ హ్యాట్రిక్, జుగ్రాజ్ సింగ్ గోల్‌తో భారత్ ఆసియా కప్ 2025 తొలి మ్యాచ్‌లో చైనాపై 4-3 తేడాతో విజయం సాధించింది. చివరి వరకు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది.

2 Min read
Mahesh Rajamoni
Published : Aug 30 2025, 08:49 AM IST| Updated : Aug 30 2025, 09:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రాజ్‌గిర్‌లో ఉత్కంఠభరిత ఆరంభంతో ఆసియా కప్ హాకీ 2025
Image Credit : Getty

రాజ్‌గిర్‌లో ఉత్కంఠభరిత ఆరంభంతో ఆసియా కప్ హాకీ 2025

ఆసియా కప్ హాకీ 2025 శుక్రవారం బీహార్‌లోని రాజ్‌గిర్ హాకీ స్టేడియంలో ప్రారంభమైంది. టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో భారత్ 4-3 తేడాతో చైనాపై విజయం సాధించింది. మొత్తం ఏడు గోల్స్‌ అన్ని పెనాల్టీ కార్నర్స్ ద్వారానే రావడం ఈ మ్యాచ్ ప్రత్యేకతగా నిలిచింది. 

ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉన్న భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ హ్యాట్రిక్ సాధించగా, జుగ్రాజ్ సింగ్ ఒక గోల్ చేశారు. మరోవైపు, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 23వ స్థానంలో ఉన్న చైనా తరఫున షిహావో డు, బెన్‌హై చెన్, జియెషెంగ్ గావో తలా ఒక గోల్ సాధించారు.

DID YOU
KNOW
?
ఆసియా కప్ హాకీలో భారత్
భారత్ హాకీ జట్టు ఇప్పటివరకు 3 సార్లు ఆసియా కప్ గెలిచింది. 2003లో పాకిస్తాన్‌పై, 2007లో కొరియాపై, 2017లో మలేషియాపై విజయం సాధించింది.
26
తొలి క్వార్టర్‌లో చైనా ఆధిక్యం
Image Credit : Getty

తొలి క్వార్టర్‌లో చైనా ఆధిక్యం

మ్యాచ్ ప్రారంభం నుంచే భారత్ దూకుడుగా ఆడింది. ప్రారంభ దాడులను చైనా డిఫెన్స్ తట్టుకుని, 12వ నిమిషంలో షిహావో డు పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మార్చి చైనాకు ఆధిక్యం అందించాడు. భారత్ కౌంటర్ అటాక్ ప్రయత్నించినా తొలి క్వార్టర్ ముగిసే సరికి స్కోరు 1-0తో చైనా ఆధిక్యంలో నిలిచింది.

Related Articles

Related image1
తెలుగు టైటాన్స్ vs తమిళ్ తళైవాస్‌: ఉత్కంఠగా పీకేఎల్ సీజన్ 12 తొలి మ్యాచ్
Related image2
గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా సంపాదన ఎంతో తెలుసా?
36
రెండో క్వార్టర్‌లో భారత్ పుంజుకుంది
Image Credit : X/India_AllSports

రెండో క్వార్టర్‌లో భారత్ పుంజుకుంది

రెండో క్వార్టర్‌లో భారత్ మూడో నిమిషంలోనే పెనాల్టీ కార్నర్ సాధించింది. జుగ్రాజ్ సింగ్ శక్తివంతమైన డ్రాగ్ ఫ్లిక్‌తో స్కోరు 1-1గా సమం చేశారు. రెండు నిమిషాలకే మరో పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్‌గా మార్చి భారత్‌ను 2-1 ఆధిక్యంలోకి తీసుకెళ్లారు. ఈ ఆధిక్యాన్ని భారత్ కాపాడుకుంటూ హాఫ్‌టైమ్‌కు 2-1 స్కోరుతో ముందంజలో నిలిచింది.

46
మూడో క్వార్టర్‌లో ఉత్కంఠ
Image Credit : PTI

మూడో క్వార్టర్‌లో ఉత్కంఠ

హాఫ్‌టైమ్ తర్వాత భారత్ దూకుడు కొనసాగించింది. 33వ నిమిషంలో మరోసారి హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మార్చి స్కోరును 3-1 చేశారు. కానీ చైనా వెనక్కి తగ్గలేదు. 35వ నిమిషంలో బెన్‌హై చెన్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మార్చి స్కోరును 3-2 చేశారు. 

ఆపై చైనా దాడులు మరింత ఉధృతం అయ్యాయి. 41వ నిమిషంలో జియెషెంగ్ గావో మరో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా చేసి స్కోరును 3-3 సమం చేశారు. మూడో క్వార్టర్ ముగిసే సమయానికి రెండు జట్లు సమాన స్థాయిలో నిలిచాయి.

56
చివరి క్వార్టర్‌లో హర్మన్‌ప్రీత్ హ్యాట్రిక్
Image Credit : Getty

చివరి క్వార్టర్‌లో హర్మన్‌ప్రీత్ హ్యాట్రిక్

నాలుగో క్వార్టర్ ప్రారంభంలో భారత్ వరుసగా పెనాల్టీ కార్నర్లు సాధించింది. 47వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ అద్భుతమైన డ్రాగ్ ఫ్లిక్‌తో తన హ్యాట్రిక్ పూర్తి చేసి భారత్‌కు 4-3 ఆధిక్యం ఇచ్చారు. ఆపై భారత్ బాల్ పాజెషన్‌ను కంట్రోల్ చేస్తూ, చైనాపై ప్రెజర్ కొనసాగించింది.

 జర్మన్‌ప్రీత్ సింగ్ ఐదు నిమిషాలపాటు యెల్లో కార్డ్ కారణంగా బయటకు వెళ్ళినా, భారత్ తన దూకుడుతో బలంగా నిలిచింది. చైనాకు గోల్ చేసే అవకాశం ఇవ్వలేదు. చివరి నిమిషాల వరకు ఉత్కంఠ కొనసాగినా భారత్ 4-3 ఆధిక్యాన్ని నిలబెట్టుకుని విజయం సాధించింది.

66
భారత్ vs చైనా : మ్యాచ్ ముఖ్యాంశాలు
Image Credit : Getty

భారత్ vs చైనా : మ్యాచ్ ముఖ్యాంశాలు

• భారత్ గోల్స్: హర్మన్‌ప్రీత్ సింగ్ (20’, 33’, 47’), జుగ్రాజ్ సింగ్ (18’)

• చైనా గోల్స్: షిహావో డు (12’), బెన్‌హై చెన్ (35’), జియెషెంగ్ గావో (41’)

• మొత్తం 7 గోల్స్‌ అన్నీ పెనాల్టీ కార్నర్స్ ద్వారానే వచ్చాయి.

• హర్మన్‌ప్రీత్ సింగ్ ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ నమోదు చేశారు.

• మ్యాచ్ జరిగిన స్థలం: రాజ్‌గిర్ హాకీ స్టేడియం, బీహార్

జపాన్ తో తర్వాతి మ్యాచ్ ఆడనున్న భారత్ 

ఈ విజయంతో భారత్ ఆసియా కప్ 2025లో విజయవంతమైన ఆరంభం చేసింది. పూల్-ఏ లో భాగంగా భారత్ తమ రెండో మ్యాచ్‌ను జపాన్ తో ఆడనుంది. ప్రతి గ్రూప్‌లో టాప్ 2 జట్లు సూపర్ 4 దశకు అర్హత సాధిస్తాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
ఆసియా కప్ 2025

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved