MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Spiritual
  • శివరాత్రి రోజు జాగరణ చేయడం వల్ల ఏం జరుగుతుందో మీకు తెలుసా?

శివరాత్రి రోజు జాగరణ చేయడం వల్ల ఏం జరుగుతుందో మీకు తెలుసా?

ప్రతి ఏడాది హిందువులు ఘనంగా జరుపుకునే పండుగలలో మహా శివరాత్రి కూడా చాలా ముఖ్యమైనది. మహా శివరాత్రి శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు.  

2 Min read
Author : Navya G
Published : Mar 01 2022, 04:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈ శివరాత్రి రోజు శివ భక్తులంతా శివుడికి అభిషేకాలు, పూజలు చేస్తుంటారు. అంతేకాకుండా ఉపవాసాలు కూడా ఉంటారు. ఇక రాత్రి వేళల్లో నిద్రాహారాలు మాని శివనామస్మరణతో జాగరణ చేస్తూ ఉంటారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అలా శివరాత్రి రోజు శివుడి ధ్యానలో మునిగి శివుడికి పూజలు చేయటం వల్ల అంత మంచే జరుగుతుంది. ఇక ఈ శివరాత్రిని ఎందుకు జరుపుకుంటారు.. అసలు ఆరోజు ఉపవాసాలు, జాగరణ ఎందుకు చేస్తారు. అలా చేయడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఏడాది మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రిని శివరాత్రిగా భావిస్తారు. శాస్త్రం ప్రకారం అమావాస్య ముందు వచ్చే కృష్ణ పక్ష చతుర్దశి రోజు శివరాత్రి జరుపుకుంటారు.
 

37

ఇక ఈ పండుగను అర్ధరాత్రి జరుపుకుంటారు. అర్ధరాత్రి 12 గంటలకు శివుడు లింగ రూపంలో దర్శనమిస్తారని  శాస్త్రాలు తెలుపుతున్నాయి. ఇక ఆ శివరాత్రి రోజు శివ భక్తులు పగలంతా ఉపవాసాలు ఉండి రాత్రి సమయంలో నిద్రాహారాలు మాని శివ భజనలు చేస్తూ ఉంటారు. నిజానికి ఈ పర్వదినాన శివుడికి చేయాల్సిన ముఖ్యమైన మూడు నియమాలు ఏంటంటే.. ఉపవాసం ఉండటం, రాత్రి జాగరణ చేయడం, శివనామస్మరణతో  అభిషేకాలు చేయడం.
 

47

కాబట్టి ఎవరైతే ఈ మూడు నియమాలను భక్తి శ్రద్ధలతో చేస్తారో.. వాళ్లు గతంలో చేసిన పాపాలు తొలగిపోవడమే కాకుండా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉంటారు. ఇక ఈ రోజున శివుడు లింగోద్భవమూర్తి గా అవతరించడానికి ఒక కథ కూడా ఉంది. చాలా వరకు ఈ కథ ఎవరికి తెలియక పోగా.. అందులో మాత్రం నిజాయితీ అనేది కనిపిస్తుంది.
 

57

ఇంతకు ఆ కథ ఏమిటంటే.. ఒకరోజు బ్రహ్మ, విష్ణువుల మధ్య ఇద్దరిలో ఎవరు గొప్ప అనే మాటల యుద్ధం జరుగుతుంది. దీంతో వారిద్దరిలో ఎవరు గొప్ప అని తేల్చుకోవడానికి సిద్ధ పడుతుంటారు. వీరి మధ్య జరుగుతున్న వాదనను శివుడు గమనించి.. వారికి తన శక్తి ఏంటో చూపించాలి అని మాఘ మాస చతుర్దశి తిథి రోజు వారిద్దరి మధ్య జ్యోతిర్లింగం రూపంలో దర్శనమిస్తాడు.
 

67

దీంతో ఆ బ్రహ్మ, విష్ణువులు జ్యోతిర్లింగ రూపంలో ఉన్న శివుడి ఆది, అంతం తెలుసుకోవడానికి వెతుకుతూ ఉంటారు. కానీ వారికి ఆది, అంతం తెలియక పోవటంతో అలసిపోతారు. అలా చివరికి శివుని వద్దకు చేరుకొని మీ శక్తిని తేల్చుకోలేకపోతున్నాము అంటూ కుంగిపోతారు. దీంతో శివుడు ఇదంతా మీలో ఉన్న పోటీని తగ్గించడానికి ఈ లింగ రూపాన్ని ధరించాల్సి వచ్చిందని అంటాడు.
 

77

దీంతో ఆ రోజే శివలింగం అవతారం ఏర్పడిందని.. అందుకే ఆ రోజునే మహాశివరాత్రి అయిందని శాస్త్రాలు తెలిపాయి. ఇక అప్పటి నుంచి ఆ లింగవతారంలో ఉన్న శివుడికి భక్తులు భక్తిశ్రద్ధలతో అభిషేకాలు, పూజలు చేస్తూ వస్తున్నారు.

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Life Lessons : దశావతారాల నుంచి Gen-Z నేర్చుకోవాల్సిన 10 జీవిత పాఠాలు
Recommended image2
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image3
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved