MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Opinion
  • బద్వేలు ఉప ఎన్నిక: పవన్ కల్యాణ్ నిర్ణయంపై బిజెపి నేతల గుర్రు

బద్వేలు ఉప ఎన్నిక: పవన్ కల్యాణ్ నిర్ణయంపై బిజెపి నేతల గుర్రు

బద్వేల్ ఉపఎన్నిక సందర్భంగా జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయం బిజెపిని ఇరకాటంలో పెట్టింది. దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణి, వైసిపి అభ్యర్థి దాసరి సుధకు మద్దతుగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు పవన్ ప్రకటనపై బిజెపి నాయకులు గుర్రుగా వున్నారు. 

2 Min read
Arun Kumar P | Asianet News
Published : Oct 03 2021, 08:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బద్వేలు శానససభ ఉప ఎన్నిక (Badvel bypoll) విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ బిజెపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా బిజెపి బద్వేలు సీటును జనసేనకు కేటాయించింది. ఈ విషయంపై ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు కూడా జరిగాయి. జనసేన (jana Sena) నాయకులు పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ బిజెపి రాష్ట్రాద్యక్షుడు సోము వీర్రాజుతో ఇటీవల చర్చలు జరిపారు.

26

అయితే, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బద్వేలు ఉప ఎన్నికలో అభ్యర్థిని పోటీకి దించడంపై అనూహ్యమైన సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాము బద్వేలులో పోటీ చేయడం లేదని చెప్పారు. దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణి దాసరి సుధకు మద్దతుగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయమే బిజెపి నేతలకు మింగుడు పడడం లేదు.

36

పవన్ కల్యాణ్ నిర్ణయంపై బిజెపి (BJP) నేతలు పార్టీపరంగా చర్చించాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ జనసేన అభ్యర్థిని పోటీకి దించకూడదని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థిని రంగంలోకి దింపాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.

46

ఇదిలావుంటే, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి పవన్ కల్యాణ్ ఓ సూచన కూడా చేశారు. దాసరి సుధ ఎన్నికను ఏకగ్రీవం చేసుకోవడానికి ప్రయత్నించాలని ఆయన వైసీపీ నేతలకు సూచించారు. దాసరి సుధ వైసీపీ నుంచి పోటీ చేస్తుండగా, టీడీపీ తరఫున ఓబుళాపురం రాజశేఖర్ పోటీ చేయనున్నారు. ఓబుళాపురం రాజశేఖర్ పోటీ నుంచి తప్పుకుంటే దాదాపుగా దాసరి సుధ ఎన్నిక ఏకగ్రీవం కావచ్చు.   

56

బద్వేలు శాసనసభ ఉప ఎన్నిక అక్టోబర్ 30వ తేదీన జరుగుతుంది. వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణంతో బద్వేలు శానససభ సీటుకు ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఓవైపు వైఎస్ జగన్ ప్రభుత్వంపై, వైసీపీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూనే పవన్ కల్యాణ్ బద్వేలు బరి నుంచి తప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మరణించిన ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య సతీమణి దాసరి సుధకు ఆయన మద్దతు ప్రకటించారు. 

66

కాగా, గతంలో తిరుపతి లోకసభ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన ఉత్సుకత ప్రదర్శించింది. తిరుపతి (Tirupathi) లోకసభ సీటును తమకు కేటాయించాలని పవన్ కల్యాణ్ బిజెపి నేతలను కోరారు. తిరుపతి లోకసభ ఓటర్ల సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఆ సీటును ఆశించారు. అయితే, బిజెపి తన తన అభ్యర్థినే పోటీకి దించింది. ఈ కారణంగానే బద్వేలు సీటు నుంచి తాము బరిలోంచి తప్పుకుంటున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారా అనే సందేహం కలుగుతోంది. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved