MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • బుల్డోజర్‌ను అందరూ నడపలేరు.. అలాంటి పాలనకు గుండె ధైర్యం కావాలి : యోగి

బుల్డోజర్‌ను అందరూ నడపలేరు.. అలాంటి పాలనకు గుండె ధైర్యం కావాలి : యోగి

బుల్డోజర్ నడిపే సామర్థ్యం, ధృడనిశ్చయం ఉన్నవారే బుల్డోజర్ నడపగలరు, అల్లరిమూకల ముందు వంగే వాళ్ళు బుల్డోజర్ ముందు సరిపోరు అని కూడా చెప్పారు.  

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 04 2024, 02:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం ప్రతిపక్ష నాయకులపై ఎటువంటి పేరు ప్రస్తావించకుండా ఘాటు విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్‌ను ఉద్దేశించి ఆయన "బుల్డోజర్ నడిపేందుకు ప్రతిఒక్కరి చేతులు సరిపోవు. ఇందుకు గుండె, మెదడు రెండూ కావాలి," అన్నారు. బుల్డోజర్ నడిపే సామర్థ్యం, ధృడనిశ్చయం ఉన్నవారే బుల్డోజర్ నడపగలరు, అల్లరిమూకల ముందు వంగే వాళ్ళు బుల్డోజర్ ముందు సరిపోరు అని కూడా చెప్పారు. 
 

24

లక్నోలో నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందులో సీఎం యోగి  1334 మంది జూనియర్ ఇంజనీర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఫోర్‌మెన్‌లకు ఉత్తర ప్రదేశ్ సబ్ ఆర్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ కమిషన్ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా, సీఎం యోగి, "నేడు నియామక పత్రాలు పొందుతున్న వారిలో ప్రతి జిల్లా ప్రాతినిధ్యం వున్నది. ఇక్కడ కులం, ప్రాంతం అనే తేడా లేదు. ప్రతిభను మాత్రమే ప్రామాణికంగా తీసుకుని నియామక పత్రాలు అందిస్తున్నాం" అన్నారు. 

ఇతర విషయాలపై మాట్లాడుతూ, యోగి ఆదిత్యనాథ్ 2017 ముందు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో, ఇప్పుడది ఎలా మారిందో వివరిస్తూ, "ఆసమయంలో రాష్ట్రంలో దోపిడీ నడిచింది. ఇప్పుడు, వారికి కొత్త ఆశలు చిగురించాయి. . ఇప్పుడు మళ్ళీ రంగులు మార్చుకుని కొత్త రూపంలో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు," అని పేర్కొన్నారు.

34

 

సామర్థ్యం ఉన్న వారికే అవకాశాలు
"2017 ముందు దోపిడీ చేసిన వారు, ఇప్పుడు మళ్ళీ టిప్పు సుల్తాన్‌గా మారడానికి ప్రయత్నిస్తున్నారు. అది సాధ్యపడదు. ప్రజలు ఒకసారి మోసపోయినా, ఇప్పుడు మళ్ళీ మోసపోవటానికి సిద్ధంగా లేరు," అంటూ యోగి ఎద్దేవా చేశారు. "నిజమైన సామర్థ్యాలున్న వారు సెలక్షన్ అయ్యేలా చూస్తాం. అడ్డంకులు రాకుండా చర్యలు తీసుకుంటాం. బైసికల్ రూల్ కంటే బుల్డోజర్ రూల్ మంచిది," అంటూ ఘాటుగా విమర్శించారు.
 

44

ఆర్థిక విజయం
యోగి మాట్లాడుతూ, "ఉత్తర ప్రదేశ్‌లో గత ఏడు సంవత్సరాల్లో ప్రభుత్వ నియామకాలు పూర్తిగా పారదర్శకంగా జరిగాయి. ఇక వచ్చే మూడు, నాలుగు సంవత్సరాల్లో ఉత్తర ప్రదేశ్ అగ్రస్థానంలో నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అంతేకాదు, రాష్ట్రాన్ని ఇకపై నంబర్ వన్ ఎకానమీగా మార్చేందుకు ప్రయత్నిస్తాం," అన్నారు. "ముందు వేతనాలు చెల్లించడానికి సైతం డబ్బు లేని రాష్ట్రం, ఇప్పుడు రెవెన్యూ సర్ప్లస్ రాష్ట్రంగా మారిపోయింది," అని తెలిపారు.
 

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి, "ముందు రాష్ట్రములో ఎవరికి పనివ్వాలని నిర్ణయించేవారు, ఇప్పుడు ప్రజల సంక్షేమం కోసం ఎలా పనిచేయాలో చూసే రోజులు వచ్చాయి. ప్రతి ఒక్కరి అభ్యున్నతికి కృషి చేయాలి. భవిష్యత్తులో ఉత్తర ప్రదేశ్, దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని ఆశిద్దాం," అంటూ ముగించారు.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
రాహుల్ గాంధీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Moon Earth : థర్డ్ వరల్డ్ వార్ కాదు.. అంతకంటే పెద్ద ముప్పు భూమికి రాబోతోంది
Recommended image2
Now Playing
PM Modi in Bodo Cultural Programme: బోడో సాంస్కృతిక కార్యక్రమంలో ప్రధాని మోదీ| Asianet News Telugu
Recommended image3
Liquor sales: మందుబాబుల‌కు షాకింగ్ న్యూస్‌.. 28 రోజుల పాటు వైన్స్ షాపులు బంద్‌. కార‌ణం ఏంటంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved