- Home
- National
- ప్రియురాలితో ఏకాంతంగా గడిపిన వీడియోను.. ఆమె భర్తకు పంపి బ్లాక్ మెయిల్.. తట్టుకోలేక ఆ యువతి చేసిన పని...
ప్రియురాలితో ఏకాంతంగా గడిపిన వీడియోను.. ఆమె భర్తకు పంపి బ్లాక్ మెయిల్.. తట్టుకోలేక ఆ యువతి చేసిన పని...
వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి.. తామిద్దరు ఏకాంతంగా గడిపిన వీడియోను భర్తకు పంపడంతో మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.

తమిళనాడు : వివాహేతర సంబంధాలు అనేక నేరాలకు దారితీస్తున్న ఘటనలు ఎన్ని చూస్తున్నా కూడా.. సమాజంలో మార్పు రావడం లేదు. క్షణికావేశంలో వివాహేతర సంబంధాలు పెట్టుకుని.. తమ జీవితాలతో పాటు తమన నమ్ముకున్న వారి జీవితాలను కూడా కష్టాల మయం చేస్తున్నారు. అలాంటి ఓ ఘటనే తమిళనాడులోని తిరువొత్తియూరులో వెలుగు చూసింది.
వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో పోలీసులు ఆమె ప్రేమికుడిని అరెస్టు చేశారు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెడితే.. బీహార్ కు చెందిన బిక్కు కుమార్, బీరెత్తి కుమారి దంపతులు. వీరు రెండేళ్ల క్రితం కోవై జిల్లా అన్ననూరు సమీపంలోని కెంపనాయకన్ పాళయంకు వచ్చారు. ఇక్కడ కూలీ పనులు చేసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే బీరెత్తి కుమారికి ఆ ప్రాంతంలోనే నివసించే తేని జిల్లాకు చెందిన పాండీ మురుగన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాలక్రమేనా వివాహేతర సంబంధంగా మారింది. అయితే, పాండిమురుగన్ బీరెత్తి కుమారికి వెన్నుపోటు పొడిచాడు. ఆమెతో.. శారీరక సంబంధం పెట్టుకుని.. తామిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో అది మొత్తాన్ని వీడియో తీశాడు. ఆ వీడియోను బీరెత్తి కుమారి భర్తకు పంపి బ్లాక్ మెయిల్ చేశాడు.
దీంతో బిక్కు కుమార్ భార్యను నిలదీశాడు. భార్యాభర్తలిద్దరూ కలిసి ఈనెల 17వ తేదీన జిల్లాలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి నివాసాన్ని మార్చి కోవై గణేషన్ పురంలో కాపురం పెట్టారు. అయినా కూడా పాండిమురుగన్ వదలలేదు. మరోసారి ఆ వీడియో పంపి బ్లాక్ మెయిల్ చేశాడు.
దీంతో బీరెత్తి కుమారి తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన సమాచారం అందడంతో అన్ననూరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.