మోదీ కాళ్లు,చేతులు కట్టేసిన ట్రంప్ ... ఈ కార్టూనే వికటన్ కొంప ముంచిందా
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బంధించినట్లుగా అభ్యంతకర కార్టూన్ ను ప్రచురించింది ఓ తమిళ మీడియా సంస్థ. మోదీ కాళ్లు, చేతులను బంధించినట్లుగా చిత్రించిన ఆ కార్టూను ఎంతపని చేసిందో తెలుసా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
vikatan Website Blocked
Vikatan : ప్రముఖ తమిళ మీడియా సంస్థ వికటన్ పై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ సంస్థకు చెందిన వెబ్ సైట్ ను బ్లాక్ చేసారు... దీంతో గత శనివారం నుండి ఈ వెబ్ సైట్ ఓపెన్ కావడంలేదు. అలాగే ఫోన్లలో కూడా వికటన్ యాప్ పనిచేయడంలేదు. ఈ విషయాన్ని స్వయంగా వికటన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ బి. శ్రీనివాసన్ ప్రకటించారు.
తమకు ముందస్తుగా ఎలాంటి నోటిసులుగానీ, సమాచారంగానీ ఇవ్వకుండానే వికటన్ వెబ్ సైట్ ను బ్లాక్ చేసారని శ్రీనివాసన్ తెలిపారు. ఇప్పటికే దీనికి సంబంధించి సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు ఈమెయిల్ చేసామని... వికటన్ ప్లస్ మ్యాగజైన్ లో ప్రచురించిన ప్రధాని మోదీ, ట్రంప్ కార్టూన్ పై వివరణ ఇచ్చామని తెలిపారు. అయినా ఇప్పటివరకు తమ వెబ్ సైట్ ను బ్లాక్ చేయడంపై ఎలాంటి సమాచారం లేదన్నారు శ్రీనివాసన్.
తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేసే స్వేచ్చను హరించేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని వికటన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆరోపించారు. దీనిపై న్యాయపరంగా పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. తమకు మద్దతుగా నిలిచిన వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు, సామాన్య ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
vikatan Website Blocked
వికటన్ పై చర్యలకు కారణం ఈ కార్డూనే...
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సమయంలో వికటన్ మ్యాగజైన్ లో చాలా వ్యంగ్యంగా ఓ కార్టూన్ ప్రచురించారు. అమెరికాలో అక్రమంగా నివాసముంటున్న ఇతర దేశాలవారిపై కొత్తగా ఏర్పాటయిన ట్రంప్ సర్కార్ చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. కాళ్లు, చేతులు బంధించి మరీ ఆర్మీ విమానాల్లో వారివారి దేశాలకు తరలిస్తున్నారు... ఇలా భారతీయులను కూడా తరలించారు.
ఇలా భారత అక్రమ వలసదారుల తరలింపును సూచిస్తూ ట్రంప్ ప్రధాని మోదీ చేతులు, కాళ్లు గొలుసులతో బంధించినట్లు కార్టూన్ ప్రచురించింది వికటన్. ఇది బిజెపి నాయకులు, మోదీ అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యింది.
తమిళనాడు బిజెపి అధ్యక్షులు అన్నామలై కేంద్రానికి ఫిర్యాదుచేసారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎల్.మురుగన్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు రంజనా ప్రకాశ్ దేశాయ్ కు చేసిన ఫిర్యాదులో వెంటనే వికటన్ సంస్థపై చర్యలు తీసకోవాలని కోరారు.
వికటన్ ప్రచురించిన కార్టూన్ ను కేంద్రం దృష్టికి తీసుకెళ్లానని ... వెంటనే చర్యలు తీసుకోవాలని కోరినట్లు అన్నామలై ఎక్స్ వేదికన ప్రకటించారు. ఆయన శనివారం మధ్యాహ్నం ఈ ట్వీట్ చేయగా అదేరోజు రాత్రి నుండి వికటన్ వెబ్ సైట్, యాప్ పనిచేయడం లేదు.