విజయ్ దివస్: అమర జవాన్లకు కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ నివాళి
1971 యుద్దంలో పాకిస్తాన్ పై భారత్ పైచేయి సాధించింది. ఈ యుద్ధంలో భారత జవాన్లు ప్రాణత్యాగం చేశారు. విజయ్ దివస్ సందర్భంగా ఆ అమర జవాన్లకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వార్ మెమోరియల్ వద్ద నివాళి అర్పించారు.
union minister rajeev chandrasekhar
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విజయ్ దివస్ సందర్భంగా అమర జవాన్లకు నివాళి అర్పించారు. ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద ఆయన నివాళి అర్పించారు. 1971లో పాకిస్తాన్ పై జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించింది. భారత విజయానికి సైనికులు తమ ప్రాణాలు ఒడ్డారు. ఈ యుద్ధంలో మరణించిన అమరవీరులను ఈ రోజు దేశం స్మరించుకుంటున్నది. వారికి నివాళులు అర్పిస్తున్నది.
union minister rajeev chandrasekhar
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జదీప్ ధన్కర్, సీజేఐ డీవై చంద్రచూడ్, ప్రధాని మోడీ, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు ప్రముఖులు 1971 అమర జవాన్లకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంలోనే కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా వార్ మెమోరియల్ వెళ్లి అమర వీరులకు పుష్ఫగుచ్ఛంతో నివాళులు అర్పించారు.
union minister rajeev chandrasekhar
1971 యుద్ధంలో పాకిస్తాన్పై సాధించిన చారిత్రాత్మక విజయాన్ని గుర్తుచేసుకోవడానికి భారతదేశం ప్రతి సంవత్సరం డిసెంబర్ 16ని విజయ్ దివస్గా జరుపుకుంటుంది.
union minister rajeev chandrasekhar
సుమారు 93,000 మంది పాకిస్తాన్ సైనికులు ఇదే రోజున భారత సైన్యం ముందు లొంగిపోయారు. ఇది బంగ్లాదేశ్ ఆవిర్భావానికి మార్గం సుగమం చేసింది.
union minister rajeev chandrasekhar
విజయ్ దివస్ నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే గురువారం ‘ఎట్ హోమ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ తదితరులు హాజరయ్యారు.
union minister rajeev chandrasekhar
విజయ్ దివస్ నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే గురువారం ‘ఎట్ హోమ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ తదితరులు హాజరయ్యారు.