MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • 77 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా బ్రిటిష్ నియంత్రణలో ఉన్న రైల్వే మార్గం.. ఇండియాలో ఎక్కడో తెలుసా?

77 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా బ్రిటిష్ నియంత్రణలో ఉన్న రైల్వే మార్గం.. ఇండియాలో ఎక్కడో తెలుసా?

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 సంవత్సరాలు గడిచినా, ఇప్పటికీ ఒక రైల్వే మార్గం బ్రిటిష్ కంపెనీ నియంత్రణలోనే ఉంది. భారతీయ రైల్వే ఈ మార్గాన్ని కొనుగోలు చేయడానికి చాలా ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు.

2 Min read
Galam Venkata Rao
Published : Aug 22 2024, 11:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
బ్రిటిష్ యాజమాన్యంలోని రైల్వే మార్గం

బ్రిటిష్ యాజమాన్యంలోని రైల్వే మార్గం

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తయ్యాయి. అయినప్పటికీ, మహారాష్ట్రలోని ఒక రైల్వే మార్గాన్ని ఇప్పటికీ ఒక బ్రిటిష్ కంపెనీ నిర్వహిస్తోంది. ఈ రైల్వే మార్గాన్ని కొనుగోలు చేయడానికి భారతీయ రైల్వే అనేక ప్రయత్నాలు చేసినా అవి విజయవంతం కాలేదు. సెంట్రల్ ప్రావిన్స్ రైల్వే కంపెనీ బ్రిటిష్ కంపెనీ అయిన ‘కిల్లిక్ నిక్సన్ & కో’ కంపెనీయే ఇంకా నిర్వహిస్తోంది.

27
భారతీయ రైల్వేలు

భారతీయ రైల్వేలు

ఈ కంపెనీ మహారాష్ట్రలోని అమరావతి నుంచి ముర్తాజాపూర్ వరకు ఉన్న 190 కిలోమీటర్ల రైలు మార్గంలో శకుంతల ఎక్స్‌ప్రెస్‌ను నడిచేది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వారు భారతదేశం నుంచి వెళ్లిపోయారు. అయినా, ఈ మార్గంపై బ్రిటిష్ ప్రైవేట్ కంపెనీ అధికారం కొనసాగుతోంది. ఆ కంపెనీకి భారతీయ రైల్వే రూ.1.20 కోట్ల రాయల్టీ చెల్లిస్తోందని నివేదికలు చెబుతున్నాయి.

37
శకుంతల రైలు మార్గం

శకుంతల రైలు మార్గం

అమరావతి నుంచి ముర్తాజాపూర్ వరకు ఉన్న 190 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రైల్వే మార్గాన్ని స్వాధీనం చేసుకోవడానికి భారతీయ రైల్వే అనేక ప్రయత్నాలు చేసింది. అయితే, అవి విజయవంతం కాలేదు. ఈ రైలు మార్గంలో శకుంతల ప్యాసింజర్ అనే ఒకే ఒక ప్రయాణికుల రైలు నడిచేది. దీంతో ఈ మార్గాన్ని శకుంతల రైలు మార్గం అని పిలుస్తారు. శకుంతల ఎక్స్‌ప్రెస్ అచల్‌పూర్, యావత్మల్ మధ్య 17 స్టేషన్లలో ఆగేది. దాదాపు 70 సంవత్సరాలు ఈ రైలు ఆవిరి ఇంజిన్‌తో నడిచింది.

47
భారతీయ రైల్వేల గురించి ఆసక్తికరమైన విషయాలు

భారతీయ రైల్వేల గురించి ఆసక్తికరమైన విషయాలు

శకుంతల ప్యాసింజర్ రైలుకి 1994లో డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు. ఆ తర్వాత అనుకోని కారణాలతో రైలును నిలిపివేశారు. దీనిని తిరిగి ప్రారంభించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 5 బోగీలున్న ఈ రైలు ప్రతిరోజూ 800 నుండి 1,000 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేది. భారతీయ రైల్వే 1951లో జాతీయం అయింది. ఈ రైలు మార్గం మాత్రం భారత ప్రభుత్వ అధికార పరిధిలోకి రాలేదు.

57
శకుంతల రైల్వే మార్గం

శకుంతల రైల్వే మార్గం

అమరావతి- ముర్తాజాపూర్ రైలు మార్గాన్ని ఉపయోగించుకున్నందుకు ఇంగ్లండ్ కంపెనీకి రూ.1.20 కోట్ల రాయల్టీని ఇండియన్ రైల్వే చెల్లించేది. అయితే, ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పుడు రాయల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.

67
రైల్వేలు

రైల్వేలు

మహారాష్ట్రలోని అమరావతిలో పత్తిని పండిస్తారు. పత్తిని అమరావతి నుంచి ముంబయి ఓడరేవుకు తరలించడానికి బ్రిటిష్ వారు ఈ రైలు మార్గాన్ని నిర్మించారు. సెంట్రల్ ప్రావిన్సెస్ రైల్వే కంపెనీ (CPRC) ఈ రైల్వేను నిర్మించడానికి బ్రిటన్‌కు చెందిన కిల్లిక్ నిక్సన్ & కోని స్థాపించింది.

77
శకుంతల ఎక్స్‌ప్రెస్

శకుంతల ఎక్స్‌ప్రెస్

ఈ రైలు మార్గం నిర్మాణం 1903లో ప్రారంభమై.. 1916లో పూర్తయింది. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు భారతీయ రైల్వే ఈ కంపెనీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అందువల్ల, ఈ మార్గాన్ని ఉపయోగించుకున్నందుకు ప్రతి సంవత్సరం కంపెనీకి రాయల్టీ చెల్లించాల్సి వచ్చేది.

About the Author

GV
Galam Venkata Rao
వెంకట్ 8 సంవత్సరాలకు పైగా ప్రింట్, టెలివిజన్, డిజిటల్ మీడియా రంగాల్లో అనుభవం కలిగిన జర్నలిస్ట్. ఈనాడులో జర్నలిజం ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో వీడియో - సోషల్ మీడియా విభాగాలను పర్యవేక్షిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved