MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • National
  • Rekha Gupta: ఢిల్లీ కొత్త సీఎం.. ఎవరీ రేఖా గుప్తా?

Rekha Gupta: ఢిల్లీ కొత్త సీఎం.. ఎవరీ రేఖా గుప్తా?

Delhi CM Rekha Gupta: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025లో విజయం సాధించిన బీజేపీ బుధవారం దేశ రాజధానికి కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను ప్ర‌క‌టించింది. షాలిమార్ బాగ్ నుంచి తొలిసారి బీజేపీ టికెట్‌పై గెలిచారు రేఖ గుప్తా.  

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Feb 19 2025, 09:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
BJP leader Rekha Gupta named as the Chief Minister of Delhi (Photo/ANI)

BJP leader Rekha Gupta named as the Chief Minister of Delhi (Photo/ANI)

Delhi CM Rekha Gupta: ఢిల్లీ అసెంబ్లీలో ఎన్నిక‌ల్లో మొద‌టిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అభ్య‌ర్థిని బీజేపీ ముఖ్య‌మంత్రిని చేసింది. ఆమె రేఖా గుప్తా. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో ఎన్నిక‌ల్లో  మెజారిటీ సాధించిన బీజేపీ బుధ‌వారం సాయంత్రం ఢిల్లీ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిని ప్ర‌క‌టించింది. శాసనసభా పక్ష సమావేశం తర్వాత బీజేపీ త‌మ‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేఖ గుప్తాను ప్ర‌క‌టించింది. పర్వేశ్ వర్మను డిప్యూటీ సీఎంగా ప్రకటించారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తాను ఎందుకు సీఎం చేశారు? అస‌లు ఎవ‌రీ రేఖా గుప్తా? 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఎవ‌రీ రేఖా గుప్తా?

ఢిల్లీ రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన రేఖ గుప్తా ఎమ్మెల్యే అయిన తొలిసారే ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారు. అంత ఈజీగా ఆమెకు సీఎం ప‌ద‌వి ద‌క్క‌లేదు. రేఖా గుప్తా తన రాజకీయ జీవితాన్ని సామాజిక కార్యకలాపాలతో ముందుకు సాగి రాజకీయాల్లో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఆమె ముఖ్యంగా మహిళా సాధికారత కోసం చేస్తున్న కృషి, పార్టీకి సంబంధించిన వివిధ కార్యక్రమాల్లో త‌న‌దైన ముద్ర వేస్తూ బీజేపీ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు. అందుకే ఇప్పుడు ఆమె ఢిల్లీ సీఎం పీఠంపై కూర్చుంటున్నారు.

ప్ర‌స్తుతం షాలిమార్ బాగ్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రిగా బీజేపీ నుంచి రెండో మ‌హిళాగా నిలిచారు. అంత‌కుముందు దివంగత నేత‌, మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఒకప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప‌నిచేశారు.

రేఖా గుప్తా 1974లో జింద్ జిల్లాలోని జులానాలోని నంద్‌గఢ్ గ్రామంలో జన్మించారు. ఆమెకు రెండేళ్ల వయసులో ఆమె తండ్రికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్‌గా ఉద్యోగం పొందారు. దీంతో 1976 లో మొత్తం కుటుంబం ఢిల్లీకి మకాం మార్చింది. రేఖ గుప్తా తన మొత్తం విద్యను ఢిల్లీలో పూర్తి చేసింది. ఈ సమయంలోనే ఆమె ఏబీవీపీ (అఖిల భారతీయ విద్యార్థి పరిషత్)లో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 

34
Rekha Gupta, Delhi Chief Minister

Rekha Gupta, Delhi Chief Minister

ఏబీవీపీతో మొద‌లైన‌ రాజకీయ ప్రయాణం

రేఖాగుప్తా త‌న రాజ‌కీయ జీవితాన్ని ఏబీవీపీతో ప్రారంభించారు. ఎమ్మెల్యే కావడానికి ముందు ఆమె కౌన్సిలర్, మాజీ ప్రధాన కార్యదర్శిగా ప‌నిచేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, బీజేపీ పార్టీ ఢిల్లీ రాష్ట్ర యూనిట్ ప్రధాన కార్యదర్శిగా ప‌నిచేశారు. ఆ స‌మ‌యంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సాధించారు. 

పితంపుర, షాలీమార్ బాగ్ ప్రాంతాల అభివృద్ధి కోసం కృషిచేశారు. ఢిల్లీ మేయర్‌గా కూడా పనిచేశారు. ఢిల్లీ పీఠంపురా నుంచి కౌన్సిలర్‌గా, తర్వాత మేయర్‌గా పనిచేశారు. బీజేపీ ఢిల్లీ శాఖ ప్రధాన కార్యదర్శిగా కూడా సేవలందించారు.

ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్న రేఖా గుప్తా గతంలో షాలీమార్ బాగ్ నియోజకవర్గం నుంచి 2015, 2020 ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేశారు కానీ, విజయం సాధించలేకపోయారు. అయితే, 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో షాలీమార్ బాగ్ నుంచి విజయం సాధించారు. 

రేఖ గుప్తా ఢిల్లీ విశ్వవిద్యాలయ కార్యదర్శి, ప్రిన్సిపాల్‌గా కూడా పనిచేశారు. 2022లో చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం గ్రాడ్యూయేష‌న్ పూర్తి చేశారు. IMIRC కాలేజ్ ఆఫ్ లా భైనా ఘజియాబాద్ లో LLB పూర్తి చేసి న్యాయ‌వాదిగా కూడా కొన‌సాగారు.

44

రేఖా గుప్తా కుటుంబం

వివాహం తర్వాత కూడా రేఖా గుప్తా రాజకీయాలకు దూరంగా ఉండలేదు.రేఖ గుప్తా భర్త మనీష్ గుప్తా వృత్తిరీత్యా విడిభాగాల వ్యాపారవేత్త. ఆయన ఎల్లప్పుడూ తన భార్యకు మద్దతుగా నిలిచారు. వీరి వివాహం 28 జూన్ 1998 జరిగింది. రేఖ గుప్తాకు ఇద్దరు పిల్లలున్నారు. కుమారుడు నికుంజ్ గుప్, కుమార్తె హర్షిత గుప్తా. కుమార్తె తన తండ్రి లాగే వ్యాపారంలో కొనసాగుతోంది.  కొడుకు నికుంజ్ గుప్తా ప్రస్తుతం చదువుతున్నాడు.
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారతీయ జనతా పార్టీ
నరేంద్ర మోదీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ముంబై, బెంగళూరు కాదు బాసు.. ఇండియాలో ఇప్పుడు జాబ్స్ ఎక్కువగా ఇస్తున్న టాప్ 10 నగరాల ఇవే
Recommended image2
Air Pollution: గాలి కాలుష్యంతో సూసైడ్ ఆలోచనలు.. రీసెర్చ్‌ లో మైండ్ బ్లాకింగ్ విషయాలు
Recommended image3
Indian Railways Free Travel: నవంబర్ 1 నుంచి రైల్వే కొత్త రూల్.. వారికి ఉచితంగా ఏసీ ట్రావెల్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved