డాన్సులు చేస్తూ లాల్ చౌక్ లో ఘనంగా గణతంత్ర వేడుకలు
76th Republic Day of India: ఒకప్పుడు అశాంతిని ఎదుర్కొన్న కాశ్మీర్లోని లాల్ చౌక్ ఇప్పుడు రెపరెపలాడే త్రివర్ణ పతాకం, మిరుమిట్లు గొలుపే లైట్లతో మెరిసిపోతోంది. ఇక్కడ డాన్సులు చేస్తూ రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది.

Lal Chowk, Republic Day, Srinagar,
76th Republic Day of India: భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా రోడ్లు, మార్కెట్లను త్రివర్ణ పతాకాలతో అలంకరించారు. దేశరాజధాని కర్తవ్య పథ్ లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశనలుమూలల్లో భారత రిపబ్లిక్ డే సంబరాలు అంబరాన్నంటాయి.
ఇదే క్రమంలో ఇండియా గేట్ వంటి అనేక చారిత్రక కట్టడాలు కూడా త్రివర్ణ కాంతులతో వెలిగిపోయాయి. కాశ్మీర్లోని శ్రీనగర్లో ఉన్న లాల్ చౌక్ రిపబ్లిక్ డే వేడుకలలో మెరిసే త్రివర్ణ పతాకంతో అలంకరించారు. ఇప్పుడు ఇక్కడ ప్రజలు రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Lal Chowk, Republic Day, Srinagar,
లాల్ చౌక్లో డాన్సులు చేస్తూ రిపబ్లిక్ డే సంబరాలు
కాశ్మీర్లోని శ్రీనగర్లోని లాల్ చౌక్లో నిర్మించిన క్లాక్ టవర్ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు ఉగ్రవాదులు, గ్రెనేడ్ల బారిన పడిన ఈ ప్రాంతం.. ఇప్పుడు ప్రతి జాతీయ దినోత్సవంలో త్రివర్ణ పతాకాల వెలుగులతో మెరిసిపోతోంది. భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా లాల్ చౌక్ ముందు కొంతమంది యువత దేశభక్తి గీతాలకు నృత్యం చేయడం కనిపించింది. సంబంధిత వీడియోలో నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఒకవైపు క్లాక్ టవర్ త్రివర్ణ పతాకం వెలుగులో తడిసి ముద్దవుతుంటే మరోవైపు కొంత మంది సంబరాలు చేసుకుంటూ దాని ముందు డ్యాన్స్ చేస్తూ 'ధర్తి సున్హరి అంబర్ నీలా...' అంటూ పాట సాగింది.
#WATCH | Jammu and Kashmir: People dance and celebrate at Lal Chowk in Srinagar on the occasion of 76th #RepublicDay🇮🇳 pic.twitter.com/tVppfAhHnd
— ANI (@ANI) January 26, 2025
Lal Chowk, Republic Day, Srinagar,
గతంలో లాల్ చౌక్ అశాంతికి కేంద్రంగా..
లాల్ చౌక్ శ్రీనగర్ ప్రధాన సామాజిక-రాజకీయ కేంద్రంగా ఉంటుంది. గతంలో ఈ ప్రదేశం కూడా చాలా అశాంతిని ఎదుర్కొంది. ఉగ్రవాదులు ఈ స్థలాన్ని టార్గెట్ చేశారు. ఇక్కడ నుండి అనేక గ్రెనేడ్లు పేలినట్లు కూడా నివేదికలు వచ్చాయి. ఉగ్రదాడి కాలంలో ఈ ప్రదేశంలో అనేక బాంబు పేలుళ్లు జరిగాయి. 1992లో బీజేపీ నాయకుడు మురళీ మనోహర్ జోషి జనవరి 26న ఇక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఆ సమయంలో ఆయనతో పాటు ప్రధాని మోదీ కూడా ఇక్కడికి వచ్చారు.
Lal Chowk, Republic Day, Srinagar,
ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా లాల్ చౌక్ మారింది
కశ్మీర్లో ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత, శ్రీనగర్లోని స్మార్ట్ సిటీ ప్లాన్ కింద లాల్ చౌక్లోని క్లాక్ టవర్ను పునరుద్ధరించారు. ఇక్కడ కొత్త గడియారం ఇన్స్టాల్ చేశారు. అలాగే, కాశ్మీర్ను సందర్శించే పర్యాటకులకు ఇది ప్రధాన ఆకర్షణ కేంద్రంగా ఉంది
ఇక్కడ చేసిన సెల్ఫీ పాయింట్ చాలా మందిని ఆకర్షిస్తోంది. ఇది మాత్రమే కాదు, త్రివర్ణ పతాకం ఇప్పుడు క్లాక్ టవర్పై రెపరెపలాడుతోంది, ఇది ఉగ్రవాదాన్ని ఎదుర్కొన్నప్పటికీ ఎల్లప్పుడూ గర్వంగా నిలబడాలనే సందేశాన్ని ఇస్తుంది.
ఢిల్లీలో ఘనంగా గణంతంత్ర వేడుకలు
లాల్ చౌక్ శ్రీనగర్ లో డాన్సులతో రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతుండగా, మరోవైపు గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో 'హై అలర్ట్' ఉంది. నగరవ్యాప్తంగా 70 కంపెనీలకు పైగా పారామిలటరీ బలగాలు, 70,000 మంది పోలీసులను మోహరించారు. ఒక్క ఢిల్లీ జిల్లాలోనే 15,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించి ఆరు అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు.
డేటా ఆధారంగా ఫేషియల్ రికగ్నిషన్, 'వీడియో అనలిటిక్స్' సౌకర్యాలతో కూడిన 2,500 కంటే ఎక్కువ CCTV కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. గగనతలంలో ముప్పులను గుర్తించి తటస్థీకరించేందుకు నాలుగు కిలోమీటర్ల పరిధిలో యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. స్నిపర్లను పైకప్పులపై మోహరించారు. పరేడ్ మార్గంలో 200 కంటే ఎక్కువ భవనాలు సీలు చేయబడ్డాయి. అంతే కాకుండా పరేడ్ రూట్కి ఎదురుగా ఉన్న నివాస భవనాల కిటికీల వద్ద కూడా భద్రతా ఏర్పాట్లు చేశారు. డ్యూటీ పాత్లోని ప్రధాన కార్యాచరణ ప్రాంతంలో సుమారు 15,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.