MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • National
  • జో బైడెన్ కు స్వచ్చమైన వెండి రైలును బహూకరించిన ప్రధాని మోదీ : బైడెన్ భార్యకు ఏమిచ్చారో తెలుసా?

జో బైడెన్ కు స్వచ్చమైన వెండి రైలును బహూకరించిన ప్రధాని మోదీ : బైడెన్ భార్యకు ఏమిచ్చారో తెలుసా?

భారత ప్రధాని నరేంద్ర మోదీ  అమెరికా పర్యటనలో ఆసక్తికర సన్నివేశం దర్శనమిచ్చింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో పాటు ఆయన భార్య జిల్ బైడెన్ కు అధ్భుత కానుకను అందించారు. ఆ కానుకలేంటో తెలుసా? 

3 Min read
Author : Arun Kumar P
| Updated : Sep 23 2024, 01:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Narendra Modi

Narendra Modi

Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి భారతీయుల నుండి ప్రశంసలు అందుకుంటున్నారు. 'ఏ దేశమేగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా... పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము' అన్న ఓ కవి మాటలను మోదీ విదేశీ పర్యటన గుర్తుచేస్తున్నాయి. ఏ దేశ పర్యటనకు వెళ్లినా భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, కళలను ప్రోత్సహించి వాటికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువస్తున్నారు ప్రధాని. ఇంకా చెప్పాలంటే దేశానికి ఓ బ్రాండ్ అంబాసిడర్ లా మోదీ వ్యవహరిస్తున్నారు. 
 
తాజాగా అమెరికా పర్యటనలోనూ భారతీయ కళలను ప్రమోట్ చేసే ప్రయత్నం చేసారు ప్రధాని మోదీ. అమెరికా అధ్యక్ష నివాసాన్నే అందుకు వేదికగా వాడుకున్నారు. ఓవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను గౌరవిస్తూనే మరోవైపు అంతర్జాతీయ సమాజానికి భారత సత్తాను చాటిచెప్పడం, కళలను పరిచయం చేసే ప్రయత్నం చేసారు. ఆయన చొరవ యావత్ భారతీయులు అభినందించేలా వుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Narendra Modi

Narendra Modi

యూఎస్ ప్రెసిడెంట్ కు మోదీ గిప్ట్ : 

మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా గత శనివారం (సెప్టెంబర్ 21) శనివారం తెల్లవారుజామున న్యూడిల్లీ నుండి అమెరికాకు బయలుదేరి వెళ్లారు. ఇలా అగ్రరాజ్యానికి వెళ్లిన భారత ప్రధానికి అపూర్వ స్వాగతం, అద్భుత గౌరవం దక్కింది. స్వయంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విల్మింగ్టన్ లోని వ్యక్తిగత నివాసంలో మోదీకి ఆతిథ్యం ఇచ్చారు. 

ఈ సందర్భంగా తనకు ఆతిథ్యం ఇచ్చిన బైడెన్ దంపతులకు భారతీయ కళాకారులు రూపొందించిన అరుదైన వస్తువులను ప్రధాని మోదీ అందించారు. ఇలా అగ్రరాజ్యాధినేతకు మోదీ బహూకరించిన వస్తువులు సరికొత్తగా వుండటంతో ఆ కళ గురించి చర్చ జరుగుతోంది... ఏమిటీ కళ? ఎలా తయారుచేస్తారు? అనేది  తెలుసుకునేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నాయి.  

అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కు ప్రధాని మోదీ వెండితో రూపొందించిన ఓ రైలు నమూనాను బహూకరించారు. ఇది భారతీయ హస్త కళకు దక్కిన అపూర్వ గౌరవమని చెప్పుకోవచ్చు. మహారాష్ట్రకు చెందిన కొందరు కళాకారులు వెండితో అద్భుతమైన కళాఖండాలను రూపొందిస్తారు. తాతముత్తాతల నుండి అనాదిగా వస్తున్న ఈ కళను ఇప్పటికీ కొందరు కొనసాగిస్తున్నారు... అలాంటి కళాకారులు ఎంతో కష్టపడి స్వయంగా తమ చేతులతో తయారుచేసిందే బైడెన్ కు మోదీ అందించిన రైలు నమూనా. 
 

34
Narendra Modi

Narendra Modi

ఇలా స్వచ్చమైన వెండితో తయారుచేసిన ఈ జ్ఞాపికను అమెరికా అధ్యక్షుడికి బహూకరించడం వెనక మరో కారణం దాగివుంది. మన రైల్వే వ్యవస్థ గొప్పతనాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించే ప్రయత్నం చేసారు. ఇలా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఒకే గిప్ట్ తో మన హస్తకళలను, భారతీయ రైల్వేకు ప్రచారం కల్పించారు మోదీ. 

అంతేకాకుండా ఈ వెండి రైలు ఇంజన్ జ్ఞాపిక ద్వారా భారత్-అమెరికా సంబంధాలను కూడా గుర్తుచేసారు. ఈ రైలు జ్ఞాపికకు ఓవైపు 'న్యూడిల్లీ - డెలావేర్' అని రాసి వుంది. ఇందులోని న్యూడిల్లీ భారత రాజధాని కాగా డెలావేర్ అనేది అమెరికాలోని ఓ రాష్ట్రం. ఇక ఈ రైలు జ్ఞాపికకు మరోవైపు ఇండియన్ రైల్వే అని రాసివుంది.  
 

44
Narendra Modi

Narendra Modi

బైడెన్ భార్యకు మోదీ కానుక :  

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కే కాదు ఆయన సతీమణికి జిల్ బైడెన్ కు కూడా ఓ అరుదైన కానుకను అందించారు ప్రధాని మోదీ. మన దేశంలోని జమ్మూ కాశ్మీర్ లో తయారయ్యే అత్యంత నాణ్యత, అద్భుతమైన చేనేత డిజైన్లతో కూడిన 'పష్మినా'శాలువాను ఆమెకు అందించారు. 

ఈ శాలువాను లదాఖ్ లోని ప్రత్యేకమైన మేక ఉన్నితో తయారుచేస్తారు. సుతిమెత్తగా వుండే ఈ ఉన్ని చాలా అరుదుగా లభిస్తుంది. కాబట్టి దీంతో తయారుచేసే పష్మినా శాలువాలకు చాలా డిమాండ్ వుంది. దీనికి తోడు ఈ ఉన్నిని దారంగా మలచడం, దాన్ని నైపుణ్యం కలిగిన కళాకారులు చేతితో నేయడం వరకు అంతా ప్రత్యేకమే. వివిధ కళాత్మక డిజైన్లతో ఈ శాలువాలు చూసేందుకు చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి... అలాగే చలినుండి రక్షణ కల్పిస్తాయి. 

ఈ పష్మినా శాలువాలు ఇప్పుడు భారతదేశంలో స్టేటస్ సింబల్ గా మారిపోయాయి. చాలా ఖరీదైన ఈ శాలువాలను ధనవంతులు మాత్రమే ఉపయోగిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ కళా వైభవానికి ప్రతీకగా నిలిచే ఈ పష్మినా శాలువాలకు జిల్ బైడెన్ కు బహూకరించడం ద్వారా అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చారు. ఇలా భారతీయ కళలను విదేశాలకు పరిచయం చేసిన ప్రధాని మోదీని భారత ప్రజలు అభినందిస్తున్నారు. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
నరేంద్ర మోదీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
PMAY: తెలుగు ప్ర‌జ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌.. 5 ల‌క్ష‌ల ఇళ్లు కేటాయింపు
Recommended image2
BRICS 2026: గ్లోబల్ సౌత్ బిగ్ బాస్.. బ్రిక్స్ తో భారత్ సాధించిన టాప్ 5 విజయాలు ఏంటో తెలుసా?
Recommended image3
BRICS: స‌వాళ్ల‌ను క‌లిసి ఎదుర్కోవాలి.. బ్రిక్స్ స‌ద‌స్సు ముగింపు వేళ మోదీ కీల‌క ప్ర‌సంగం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved