MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • కేజ్రీవాల్ ఒక్కరే కాదు ఈ ముఖ్యమంత్రులు కూడా ఓటమిని చూశారు.. వారెవరంటే.

కేజ్రీవాల్ ఒక్కరే కాదు ఈ ముఖ్యమంత్రులు కూడా ఓటమిని చూశారు.. వారెవరంటే.

శనివారం వెల్లడించిన ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. సుమారు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బిజీపే అధికారంలోకి వచ్చింది. ఇదిలా ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌ అరవింద్ కేజ్రీవాల్‌ కూడా ఓటమి పాలవ్వడం మరింత ఆశ్చర్యానికి గురి చేసింది.  

2 Min read
Author : Narender Vaitla
Published : Feb 09 2025, 04:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌ పార్టీ ఓటమి చవి చూడడం ఒకెత్తయితే, మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఓటమి పాలవ్వడం మరో ఎత్తు. ఢిల్లీని సుదీర్ఘంగా పాలించిన షీలా దీక్షిత్‌ను ఓడించిన కేజ్రీవాల్‌ ఇప్పుడు స్వయంగా ఆయనే ఓటమి చవిచూడడం రాజకీయాల్లో ఏదైనా జరుగుతందని చెప్పడానికి సాక్ష్యంగా నిలిచింది.

న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేజ్రీవాల్ ను బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ ఓడించారు. 3 వేల పైచిలుకు ఓట్లతో పర్వేశ్ గెలుపొందారు. అవినీతి ఆరోపణలు, జైలుకు వెళ్లిరావడం, ఎన్నికల ముందు కేజ్రీవాల్‌ రాజీనామా చేయడం ఇలా ఎన్నో అంశాలు ఆయన ఓటమికి కారణాలయ్యాయి. 
 

24

అయితే కేజ్రీవాల్‌ టెక్నికల్‌గా ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఓడిపోలేదు. ఎన్నికలకు కొన్ని నెలల ముందే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన స్థానంలో  ఆతిశీని ముఖ్యమంత్రిగా నియమించారు. అయితే ముఖ్యమంత్రిగా పనిచేసిన కేజ్రీవాల్‌ ఓడిపోవడం ఒకింత అందరినీ షాక్‌కి గురి చేసిందనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఇలా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తులు ఓడిపోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఓటమిని చవి చూశారు. ఆ జాబితాలో ఉన్న వారెవరో ఇప్పుడు చూద్దాం.. 

34

* 2013లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న షీలా దీక్షిత్ న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ చేతిలో ఓడిపోయారు.

* 2021లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు.

* 1989లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత బోడినాయకనూర్ నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు.
 

44

* 2007లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి అక్బర్‌పూర్ నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు.

* 2005లో బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో, రబ్రీ దేవి రఘోపూర్ నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు.

* 2005 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓం ప్రకాష్ చౌతాలా నర్వానా నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. 

About the Author

NV
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Recommended image2
Now Playing
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu
Recommended image3
100 కాదు 132 శాతం లక్ష్యం... యువతకు ఉపాధిలో ఈ ప్రాంతం రికార్డు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved