మోదీకి సామాన్యుడి కానుక.. వారణాసి వీధుల్లో కారు ఆపించి మరీ స్వీకరించిన ప్రధాని..
కాషాయ వస్త్రాల్లో ఉన్న ఓ వ్యక్తి తాను తెచ్చిన Giftలు ప్రధాని మోదీకి అందించేందుకు ప్రయత్నించారు. For security reasons దృష్ట్యా సిబ్బంది అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వాటిని తనకు అందించాలని వారికి చెప్పారు. అక్కడే కారు ఆపించి.. ఆ వ్యక్తి తెచ్చిన తలపాగా, కాషాయ వస్త్రం స్వీకరించారు. భద్రతా వలయం లోపలికి వచ్చి ఆ వ్యక్తే స్వయంగా వాటిని మోదీకి అందించారు.
వారణాసి : ప్రధాని Narendra Modi సోమవారం సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటిస్తున్నారు. మరి కాసేపట్లో కాశీవిశ్వనాథ్ కారిడార్ ను ప్రజలకు అంకితం చేయనున్నారు. Varanasi సుందరీకరణ పనులు, గంగానదిని కలుపుతూ ఈ కారిడార్ ను నిర్మించారు. ఈ సందర్భంగా భారీ భద్రత నడుమ ప్రధాన దేవాలయానికి Modi convoy వెళుతుండగా.. ఒక అనూహ్య సంఘటన చోటు చేసుకుంది.
సామాన్యుడి కానుక స్వీకరించిన మోదీ...
కాషాయ వస్త్రాల్లో ఉన్న ఓ వ్యక్తి తాను తెచ్చిన Giftలు ప్రధాని మోదీకి అందించేందుకు ప్రయత్నించారు. For security reasons దృష్ట్యా సిబ్బంది అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వాటిని తనకు అందించాలని వారికి చెప్పారు. అక్కడే కారు ఆపించి.. ఆ వ్యక్తి తెచ్చిన తలపాగా, కాషాయ వస్త్రం స్వీకరించారు. భద్రతా వలయం లోపలికి వచ్చి ఆ వ్యక్తే స్వయంగా వాటిని మోదీకి అందించారు. దీనిపై భాజాపా నేత ఒకరు స్పందిస్తూ ఆయన సామాన్యుడి ప్రధాని అంటూ కొనియాడారు. దానికి సంబంధించిన వీడియో షేర్ చేశారు.
కాషాయ వస్త్రాలు ధరించి.. గంగానదిలో స్నానం..
వారణాసి పర్యటనలో భాగంగా యూపీ చేరుకున్న మోడీకి ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. కాలభైరవ ఆలయానికి చేరుకుని ప్రధాని పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో కాశీ వీధుల వెంబడి వెళ్తున్న ఆయనపై అక్కడి ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. పూలు చల్లుతూ, కరతాళ ధ్వనులు చేస్తూ ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత ప్రధాని గంగానదిలో స్నానమాచరించారు. కాషాయ వస్త్రాలు లో ఉన్న ఆయన కలశంతో గంగానదిలో పుష్పాలను వదిలారు.
ఇదిలా ఉండగా, సోమవారం PM Narendra Modi తన సొంత నియోజకవర్గం ఉత్తరప్రదేశ్లోని Modi in Varanasi లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మోదీ వారణాసి కాశీలోని లలితా ఘాట్కు కు చేరుకుని గంగా నదిలో పుణ్య స్నానం ఆచరించారు. కాషాయ వస్త్రాలు ధరించిన మోదీ.. గంగా నదిలో కలశంతో పుష్పాలు వదిలారు. గంగానదిలో పుణ్య స్నానం ఆచరించారు. ఆ తరువాత ప్రధాని మోదీ శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్ను సందర్శించారు. అక్కడ రూ.339 కోట్ల వ్యయంతో పూర్తిచేసిన కాశీ విశ్వనాథ్ ధామ్ మొదటి దశను ప్రారంభించనున్నారు.
అంతకుమందుకు ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి వారణాసి చేరుకున్న ప్రధాని మోదీకి.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్ స్వాగతం పలికారు. ప్రజలు కూడా పూల వర్షం కురిపిస్తూ మోదీకి ఘన స్వాగతం చెప్పారు. మోదీ మోదీ, హర్ హర్ మహాదేవ్ అంటూ నినాదాలు చేశారు. తొలుత ప్రధాని మోదీ కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆ తర్వాత గంగానదిలో డబుల్ డెక్కర్ షిప్పై ప్రయాణించారు. తర్వాత ఉత్తరప్రదేశ్ CM యోగి ఆదిత్యానాథ్ దాస్తో కలిసి మోదీ.. డబుల్ డెక్కర్ బోట్లో ఖిర్కియా ఘాట్ నుండి లలితా ఘాట్ వరకు ప్రయాణించారు. అనంతం గంగానదిలో పుణ్య స్నానం ఆచరించారు. కాశీ విశ్వనాథ ఆలయంలో కూడా ప్రధాని మోదీ.. ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.