సీఎం యడ్యూరప్ప కొడుకు నిర్వాకం.. లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేసి గుడికి..
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘించారు. ఇది ఇప్పుడు కర్ణాటకలో దుమారం రేపుతోంది. గుడికి వెళ్లడం కోసం లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘించి ఓ జిల్లానుంచి మరో జిల్లకు ప్రయాణం చేశారు.
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘించారు. ఇది ఇప్పుడు కర్ణాటకలో దుమారం రేపుతోంది. గుడికి వెళ్లడం కోసం లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘించి ఓ జిల్లానుంచి మరో జిల్లకు ప్రయాణం చేశారు.
విజయేంద్ర కర్ణాటక బీజేపీ వైస్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేస్తున్నారు. మైసూర్ , నంజగడ్ లోని శ్రీ కటకేశ్వర్ గుడికి మంగళవారం ఆయన సతీసమేతంగా వెళ్లారు. ఈ విషయాన్ని మైసూరు బీజేపీ జిల్లా అధ్యక్షుడు మంగళ సోమశేఖర్ ధృవీకరించారు.
ఆయన మాట్లాడుతూ.. విజయేంద్ర, భార్యతో కలిసి సోమవారం నాడు బెంగళూరు నుంచి వచ్చారని, ఆ రోజు నంజగఢ్ తాలూకాలోని సంగమలోని మహాదేవ టాటా గద్దేకిని సందర్శించారని తెలిపారు. మంగళవారం ఆయన నంజగఢ్ దేవాలయాన్ని దర్శించుకున్నారని తెలిపారు.
బీజేపీ కార్యకర్తలు చెప్పిన వివరాల ప్రకారం ఆయన పోలీస్ ఎస్టార్ట్ తో దేవాలయంలోకి ప్రవేశించారు. ఆయన రాకకు ముందే ఆలయ అధికారులు అక్కడికి చేరుకున్నారు. వారు ఆయనకు స్వాగతం పలికారు. పూజారులు ఆయనపేరుతో పూజలు చేయించారు.
దేవాలయంలో ఆయన అరగంటపాటు ఉన్నారని వారు తెలిపారు. దీనిమీద ఆలయ పూజారి ఒకరు మాట్లాడుతూ అధికారంలో ఉన్నవారిని గుడికి రాకుండా ఆపలేమని.. ఆ అధికారం తమకు లేదని.. జిల్లా అధికారుల ఆదేశాలు తాము అనుసరించాల్సిందేనని తెలిపారు.
అయితే దీనిమీద విజయేంద్రకానీ, మైసూరు డీజీ కానీ ఏమీ స్పందించలేదు. ఆలయ ప్రధానార్చకుడు నాగేంద్ర దీక్షిత్ దీనిమీద మాట్లాడుతూ తాను వ్యక్తిగత పనుల వల్ల ఆ రోజు గుడికి వెళ్లలేదని.. ఎవరు వచ్చారో తనకు తెలియదని అన్నారు.
జిల్లా సూపరింటిండెంట్ పోలీస్ సిబి రష్యంత్ మాట్లాడుతూ దేవాలయం మైసూరు జిల్లా అడ్మినిస్ట్రేషన్ కిందికి వస్తుందని.. కాబట్టి నాయకులు వచ్చేముందు డిసి కి తప్పనిసరిగా సమాచారం ఉంటుందని తెలిపారు.
బీజేపీ ఎంఎల్ సీ ఏహెచ్ దీన్ని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కొడుకు అయి విజయేంద్ర ఇలా రూల్స్ బ్రేక్ చేయడం సరికాదని.. ఆయనే ముందు పాటించి చూపించాలని అన్నారు.
కేపీసీసీ స్పోక్స్ పర్సన్ ఎం. లక్ష్మన దీనిమీద విరుచుకుపడ్డారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సామాన్యులకే కాదు నాయకులకు కూడా అని గుర్తుంచుకోవలి. వాటిని వాళ్లూ ఫాలో అవ్వాలి. అప్పుడే జనానికి రోల్ మాడల్స్ అవుతారు. ముఖ్యమంత్రి కొడుకు లాంటివారిని ఆపే అధికారం అధికారులకు ఉండదు అన్నారు.