రిలయన్స్ జియో రికార్డ్ ... ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్దభూమిలో 5G సేవలు
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్ లో 4G, 5G కనెక్టివిటీని అందించడానికి రిలయన్స్ జియో భారత సైన్యంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ చర్యలతో రిలయన్స్ మరోసారి దేశభక్తిని చాటుకుంది.

Reliance Jio
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్లో 5G బేస్ స్టేషన్లను ఏర్పాటు చేసిన మొదటి టెలికాం ప్రొవైడర్ గా రిలయన్స్ జియో నిలిచింది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో మొత్తం ఇన్-హౌస్ 5G సాంకేతికతను మోహరించిన మొదటి ఆపరేటర్ గా జియో నిలిచింది.
జియో ఎంట్రీతో ఇకపై సియాచిన్ హిమానీనద ప్రాంతంలో భారత సైన్యానికి 4G, 5G సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ మైలురాయిని చేరుకోవడానికి జియో భారత సైన్యంతో కలిసి పనిచేసింది.
Reliance Jio
సియాచిన్ హిమానీనదంలో 4G, 5G కనెక్టివిటీని ఏర్పాటు చేయడం అనేది ఒక క్లిష్టమైన పని. సైన్య బృందంతో సమన్వయం లేకుండా ఇది సాధ్యం కాదు.
కారకోరం ప్రాంతంలో ఉష్ణోగ్రతలు -50 డిగ్రీల సెల్సియస్కు పడిపోయే పరిస్థితుల్లో, 16,000 అడుగుల ఎత్తులో కనెక్టివిటీని అందించగలుగుతోంది. భారత సైన్యం భారీ 5G పరికరాలను సియాచిన్ హిమానీనదానికి ఎయిర్లిఫ్ట్ చేయడంలో సహాయం చేసింది.
దేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాలను అనుసంధానించడానికి మరియు సైన్యం మరియు ఇతర స్థానిక నివాసితులకు హై-స్పీడ్ యాక్సెస్ను అందించడానికి జియో చేస్తున్న ప్రయత్నాలను సియాచిన్లో 5G నెట్వర్క్ విస్తరణ ద్వారా మరింతగా చూపిస్తుంది.
Reliance Jio
రిలయన్స్ జియో దేశ సేవ చేస్తున్న ఆర్మీ జవాన్లకోసం ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఇలా నెట్ వర్క్ అందుబాటులోకి రావడంతో ఇకపై సియాచిన్ లో విధులు నిర్వర్తించే జవాన్లు తమ కుటుంబసభ్యులతో కనెక్ట్ కావచ్చు. వారికి కుటుంబసభ్యులను దగ్గరచేయడంలో రిలయన్స్ జియో సక్సెస్ అయ్యింది.