మరిదితో మూడేళ్లుగా వదిన రాసలీలలు.. అతడితో కలిసి బతకాలని ఆశపడింది.. కానీ చివరకు..
ఓ మహిళ వయసులో తనకంటే 8 ఏళ్లు చిన్నవాడైన మరిదితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. అతడి పెళ్లి కూడా చేసుకోవాలని ఆశపడింది. అయితే ఇది చివరకు తీవ్ర విషాదానికి దారి తీసింది.
ఓ మహిళ వయసులో తనకంటే 8 ఏళ్లు చిన్నవాడైన మరిదితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. అతడి పెళ్లి కూడా చేసుకోవాలని ఆశపడింది. అయితే ఇది చివరకు తీవ్ర విషాదానికి దారి తీసింది.
వివరాలు.. రాజస్థాన్లోని భిల్వారా జిల్లాలో తన బంధువు పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చిన మైనా కన్వర్ అనే మహిళ హత్యకు గురైంది. మే 23వ తేదీన ఇంట్లో నుంచి కనిపించకుండా పోయిన మైనా కన్వర్.. మరుసటి రోజు రోడ్డు పక్క పొదల్లో శవమై కనిపించింది.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మైనాను అక్కడే హత్య చేసినట్టుగా గుర్తించారు. అలాగే ఘటన స్థలానికి బైక్ వచ్చివెళ్లినట్టుగా కూడా ఆనవాళ్లను కూడా కనుగొన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలోనే మైనా కన్వర్ కాల్ డేటా వివరాలను పోలీసులు బయటకు తీశారు. అయితే అందులో ఆమె మే 23వ తేదీ రాత్రి ఫోన్ మాట్లాడినట్టుగా గుర్తించారు. ఆ తర్వాత ఇంటి నుంచి వెళ్లిపోయినట్టుగా నిర్దారణకు వచ్చారు. మైనా కాల్ వివరాల ఆధారంగా ఆమె మరిది దీపక్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అలాగే షాకింగ్ విషయాలు కూడా బయటపడ్డాయి.
మైనా కన్వర్కు ఇద్దరు పిల్లలు ఉన్నారని.. ఆమె భర్త ముంబైలో పనిచేస్తున్నాడని తేలింది. పిల్లలు చదువుల కోసం తల్లి ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే మైనాకు, తనకు మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. గత మూడేళ్లుగా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని దీపక్ అంగీకరించారు.
మైనా కంటే దీపక్ 8 ఏళ్లు చిన్నవాడు. అయితే మైనా కన్వర్ ఆమెను పెళ్లి చేసుకోవాలని దీపక్పై చాలా కాలంగా ఒత్తిడి తెస్తుంది. ఈ విషయమై మే 23వ తేదీ రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అనంతరం దీపక్ గొంతు నులిమి హత్య చేశాడు.