దేశంలోనే తొలిసారి:హైద్రాబాద్లో గోల్డ్ ఏటీఎం
బంగారం ఏటీఎంలో లభ్యం కానుంది. హైద్రాబాద్ లో బంగారం ఏటీఎం ప్రారంభమైంది. వినియోగదారులు తమకు అవసరమైన బంగారాన్ని ఈ ఏటీఎం ద్వారా కొనుగోలు చేసుకొనే వెసులుబాటు లభించింది.
11

cartoon punch on gold atm
హైద్రాబాద్ లో గోల్డ్ ఏటీఎం ప్రారంభమైంది.ఈ ఏటీఎంలో ఐదు కిలోల బంగారం ఈ ఏటీఎంలో ఉంటుంది.0.5 గ్రాముల నుండి 100 గ్రాముల వరకు ఈ ఏటీఎం నుండి కొనుగోలు చేయవచ్చు,గోల్డ్ సిక్కా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ గోల్డ్ ఏటీఎంను ప్రారంభించింది. ఓపెన్ క్యూబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టెక్నాలజీ సపోర్టు అందించింది.దేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎంగా ఈ ఏటీఎం చరిత్ర సృష్టించింది.ఈ ఏటీఎంల నుండి 24 క్యారెట్ బంగారం కాయిన్స్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి.
Latest Videos