నీటి కుండను ముట్టుకున్న దళిత విద్యార్ధిపై టీచర్ దాడి:విద్యార్ధి మృతి
రాజస్థాన్ రాష్ట్రంలోని జలోర్ జిల్లాలోని మంచి నీటి కుండను తాకాడని దళిత విద్యార్ధిని కొట్టడంతో ఆ బాలుడు మరణించాడు. అయితే ఈ ఘటనకు కారణమైన టీచర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
cartoon punch
రాజస్థాన్ రాష్ట్రంలోని జలోర్ జిల్లాలో నీటి కుండను ముట్టుకున్నారనే నెపంతో తొమ్మిదేళ్ల బాలుడిని టీచర్ కొట్టడంతో మృతి చెందాడు. 9 ఏళ్ల విద్యార్ధి మరణించడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జూలై 20వ తేదీన ఉపాధ్యాయుడి కోసం ఏర్పాటు చేసిన కుండలోని నీరు తాగారనే నెపంతో ఆ విద్యార్ధిని టీచర్ కొట్టడంతో ఆ విద్యార్ధి మృతి చెందినట్టుగా బాధిత కుటుంబం ఆరోపించింది.
ఆరోపణలు ఎదుర్కొంటున్న టీచర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం రూ. 5 లక్షల సహాయం అందిస్తామని ప్రకటించింది.