- Home
- National
- వివాహితను గర్భవతిని చేసిన బాయ్ ఫ్రెండ్.. పెళ్లి చేసుకోమన్నందుకు ఇటుకలతో దాడి చేసి హత్య..
వివాహితను గర్భవతిని చేసిన బాయ్ ఫ్రెండ్.. పెళ్లి చేసుకోమన్నందుకు ఇటుకలతో దాడి చేసి హత్య..
పెళ్లైన సంవత్సరానికే భర్తనుంచి విడిపోయిన ఓ మహిళ వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. గర్భవతి కావడంతో ప్రియుడు ఆమెను స్నేహితులతో కలిసి హత్య చేశాడు.

ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఊరి చివర ఉన్న పొలాల్లో మూడు రోజుల క్రితం గర్భిణి మృతదేహం లభించింది. మూడు రోజుల తర్వాత, ఆమె హత్యకు సంబంధించిన కేసులో నిందితుడిగా ఆమె ప్రేమికుడిని, మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంబిరి అనే ఆ మహిళ తలపై రాయితో కొట్టి తన స్నేహితులతో కలిసి హత్య చేసినట్లు నిందితుడు ఆదేశ్ తెలిపాడు. ఆమెను హత్య చేసిన తర్వాత, ఆమె మృతదేహాన్ని పొలంలో వదిలి అక్కడి నుండి పారిపోయారని పోలీసులు తెలిపారు.
రాంబిరిని హత్య చేశారంటూ బాధిత కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఆదేశ్, అతని స్నేహితులను పోలీసులు అరెస్టు చేశారు
దీనిపై జరిపిన విచారణలో రాంబిరికి వినోద్తో 2015లో వివాహం జరిగిందని.. ఏడాది తర్వాత ఇద్దరూ విడిపోయారని తేలింది. రాంబిరి తన తండ్రి ఇంట్లో ఉండడం ప్రారంభించింది, అక్కడ ఆమె ఆదేశ్ తో పరిచయం అయ్యింది. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.
ఈ క్రమంలో రాంబిరి గర్భవతి అయిందని, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడం ప్రారంభించిందని పోలీసులు తెలిపారు. తనను పెళ్లి చేసుకోవాలని రాంబిరి నిరంతరం డిమాండ్ చేస్తుండడంతో విసిగిపోయిన ఆదేశ్ తన స్నేహితులతో కలిసి ఆమెను చంపేందుకు కుట్ర పన్నాడు.
జూలై 2న ఆదేశ్ రాంబిరిని తన ఇంటికి కలుద్దామని పిలిచాడు. ఆమె రాగానే అతని స్నేహితులతో కలిసి ఆమెను ఇటుకలతో కొట్టి చంపి, మృతదేహాన్ని పొలంలో పడేశారు. జూలై 2న మహిళ హత్యకు గురైందని, ఒక రోజు తర్వాత ఆమె మృతదేహం పొలంలో లభ్యమైందని పోలీసులు ధృవీకరించారు.
మహిళకు, నిందితులకు మధ్య సంబంధాలు ఉన్నాయని కూడా పోలీసులు తెలిపారు. ఈ కేసులో మిగిలిన నలుగురు నిందితులు దీపక్, ఆర్యన్, సందీప్, రోహిత్లు కూడా పోలీసుల అదుపులో ఉన్నారని, తదుపరి విచారణ కొనసాగుతోంది.