MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • విశాఖలో సముద్రం అంతలా వెనక్కు వెళ్లడానికి కారణం ఇదే..

విశాఖలో సముద్రం అంతలా వెనక్కు వెళ్లడానికి కారణం ఇదే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుందర నగరమైన విశాఖపట్నంలో ఇటీవల సముద్రం ఒక్కసారిగా వెనక్కు వెళ్లింది. దీంతో ప్రజలంతా షాక్‌ గురయ్యారు. సునామీ వస్తుందేమోనన్న అనుమానంతో ప్రజలు ఆందోళన చెందారు. అయితే చాలా మంది ఈ సంఘటనను ఎంజాయ్‌ చేస్తున్నారు. బయట పడిన రాళ్లపైకి వెళ్లి సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. అసలు సముద్రం నీరు ఎందుకు వెనక్కు వెళ్లింది. మళ్లీ ఇంతకుముందులా బీచ్‌ మారుతుందా.. ఇలాంటి మరిన్ని వివరాలు ఇప్పడు తెలుసుకుందాం. 

3 Min read
Naga Surya Phani Kumar
Published : Sep 01 2024, 06:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

అసలు విశాఖ పట్టణానికి ఏం జరుగుతోంది. 2014 అక్టోబర్‌ 8న వచ్చిన హుద్‌హుద్‌ తుపాను అందమైన విశాఖ పట్టణాన్ని నామ రూపాలు లేకుండా చేసింది. సుమారు 185 km/h (115 mph) వేగంతో తుపాను తీరాన్ని తాకింది. దాని ధాటికి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 66 మంది మరణించారని అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. విశాఖలో ముగ్గురు చనిపోయారని సమాచారం. అప్పుడు అధికారంలో ఉన్న తెలుగు దేశం ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన నగరానికి మళ్లీ ఊపిరి పోసింది. చెట్లు తొలగించి, విద్యుత్తు సౌకర్యాన్ని వెంటనే పునరుద్ధరింపజేశారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విశాఖలోనే ఉండి నగరం మళ్లీ కోలుకొనేలా వేగంగా చర్యలు చేపట్టేలా చేయగలిగారు. 
 

25

సముద్రం నాలుగు అడుగులు వెనక్కు వెళ్లడం సహజం
సాధారణంగా సునామీ వచ్చే ముందు సముద్రం ఒక్కసారిగా వెనక్కు వెళుతుందని ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఒకరు తెలిపారు. ఆయన మరిన్ని వివరాలు వెల్లడించారు. అవేంటంటే.. సూర్యుడు, చంద్రుడి అట్రాక్షన్‌ వల్ల కూడా ప్రతి రోజు హై టైడ్‌, లోటైడ్‌లు వస్తుంటాయి. అందుకే ప్రతి రోజు ఏదో ఒక సమయంలో ఇలా సముద్రం ఇలా 4 అడుగులు వెనక్కు వెళుతుందట.  అది సాధారణమేనని ఇంతలా వెనక్కు వెళ్లడం మాత్రం గతంలో ఎప్పుడు జరగలేదన్నారు. 
 

35

పౌర్ణమి, అమావాస్యకు కూడా ఇలా..
ప్రకృతి నిబంధనల ప్రకారం ప్రతి పౌర్ణమి, అమావాస్యకు సముద్రం ముందుకు, వెనక్కు వెళ్లడం సహజమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్యుడు, చంద్రుడు ఆకర్షణల వల్ల ప్రతి పౌర్ణమికి, అమావాస్యకు ఇలా జరుగుతుంది. అమావాస్య, పౌర్ణమికి వచ్చే కెరటాలను స్ప్రింగ్‌ టైడ్స్‌ అంటారు. ఆ సమయంలో సుమారు 6 అడుగుల వరకు సముద్రం వెనక్కు వెళుతుందట. అయితే మళ్లీ మరుసటి రోజే సముద్రం సాధారణంగా మారిపోతుంది. అయితే ఇలా రాళ్లు బయట పడేంతలా వెనక్కు వెళ్లడం చాలా అరుదు. 

పౌర్ణమి కూడా ఓ కారణమే..
పౌర్ణమి దగ్గరలో ఉండటంతో ఈ విధంగా సముద్రం వెనక్కు వెళ్లింది. అయితే 6 అడుగులకు పైగా వెళ్లడం వెనుక ఇతర కారణాలున్నాయి. వాటిల్లో ఒకటి సునామీ. అయితే వాతావరణ శాఖ అధికారులు మాత్రం సునామీ వచ్చే అవకాశాలు లేవని చెబుతున్నారు. 
 

45

మరో కారణం అప్‌ వెల్లింగ్‌. 
అప్‌ వెల్లింగ్‌ అంటే గాలుల తీవ్రత వల్ల సముద్రం ఇలా వెనక్కు వెళుతుందట. ఇలా జరిగినప్పుడు సముద్రం అడుగున ఉన్న నీరు ఆటోమెటిక్‌గా సముద్రం పైకి వస్తుందట. అలా వచ్చిన నీటిలో కొంత చల్లగా ఉంటుందట. మరికొంత సాంద్రత(డెన్సిటీ) ఎక్కువ ఉంటుందట. అందులో చల్లగా ఉన్న నీరు ఏ బీచ్‌ వద్దకు వస్తుందో అక్కడ సముద్రం ముందుకు వెళుతుందని, డెన్సిటీ ఉన్న నీరు వెళ్లిన చోట వెనక్కు వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రకారం వైజాగ్‌ బీచ్‌కు వచ్చిన నీరు డెన్సిటీ ఎక్కువగా ఉండటం వల్ల సముద్రపు నీరు వెనక్కు వెళ్లిందని అధికారులు భావిస్తున్నారు. 
 

ఇంకో కారణం ఏంటంటే..
తుఫాను సమయంలోనూ ఇలా సముద్రపు నీరు వెనక్కు, ముందుకు వస్తుందట. అయితే ఆ తుఫాను ఇక్కడే రావాల్సిన అవసరం లేదని, బంగాళాఖాతంలో ఏ ప్రాంతంలో తుపాను వచ్చినా ఆ ప్రభావం కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఇలా సముద్రపు నీరు వెనక్కు వెళ్లడం, ముందుకు రావడం జరుతుందని అధికారులు చెబుతున్నారు. 
 

55

అసలు వైజాగ్‌లో సముద్రం వెనక్కు ఎందుకు వెళ్లింది..
పైన తెలిపిన కారణాలన్నీ కలిసి రావడంతో సముద్రం ఇలా ఒక్కసారిగా వెనక్కు వెళ్లిందని అయితే కొన్ని రోజుల్లోనే సాధారణ స్థితికి వచ్చేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇది ఆందోళన చెందాల్సిన సందర్భం కాదని, భయపడాల్సింది ఏమీ లేదంటున్నారు. 

సెల్ఫీలు తీసుకోవడం ప్రమాదం
సముద్రం 4 అడుగులు వెనక్కు వెళ్లడం సహజమే. కాని 400 మీటర్లు వెనక్కు వెళ్లింది. దీంతో అందులో ఉన్న రాళ్లు బయట పడ్డాయి. బాగా నాచు పట్టి ఉన్న ఆ రాళ్లపై సందర్శకులు సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమని అధికారులు చెబుతున్నారు. రాళ్లు ఇప్పటికే నాచు పట్టి ఉండటంతో జారి పడే ప్రమాదం ఉంటుందని, సముద్రంలో నీరు కూడా సడన్‌గా ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. అలాంటి సమయంలో రాళ్ల మధ్య ఇరుక్కొనే ప్రమాదం ఉంటుందని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
కళ్లు జిగేల్‌మనేలా పచ్చల గాజులు
Recommended image2
కూరల్లో పచ్చిమిర్చి పడేయకుండా తినేయండి
Recommended image3
Bad Breath: ఇలా చేస్తే నోటి నుంచి దుర్వాసన రాదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved