MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Maha Shivaratri: సాక్షాత్తు భోళాశంకరుడి విశిష్ట మహాశివరాత్రి కథ ఇది..

Maha Shivaratri: సాక్షాత్తు భోళాశంకరుడి విశిష్ట మహాశివరాత్రి కథ ఇది..

Maha Shivaratri 2022: ఈ జగత్తును పాలించే పరమేశ్వరుడికి ఎంతో పీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి. నీలకంఠుడిగా, భోళాశంకరుడిగా, ఈశ్వరుడిగా, అభిషేక ప్రియుడిగా, రాజేశ్వరుడిగా భక్తులచే పిలవబడుతూ.. ఎన్నో పూజలు అందుకుంటున్నాడు. మరి ఈ పరమేశ్వరుడికి ఇష్టమైన మహా శివరాత్రి వెనకున్న అంతర్యం గురించి ఎంత మందికి తెలుసు. 

3 Min read
Mahesh Rajamoni
Published : Feb 24 2022, 10:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

Maha Shivaratri 2022: అభిషేక ప్రియుడు, రాజేశ్వరుడు, భోళా శంకరుడు, నీలకంఠుడు, ఈశ్వరుడు.. ఇలా ఎన్నో పేర్లతో పిలిపించుకుంటూ ఈ సమస్త జగత్తును పాలిస్తున్నాడు ఆ పరమేశ్వరు. కోరిన వరాలను ప్రసాదిస్తూ.. ఈ జగత్తుచే ఎన్నో పూజలు అందుకుంటున్నాడు. మహాశివరాత్రి మార్చి 1 తారీఖున వచ్చింది.  ఆ రోజున శివుడికి ఎంతో ఇష్టమైన రుద్రాక్ష మాలలు, బిల్వపత్రాలు, రుద్రుభిషేకాలతో, విభూతి ధారణలతో ఆ శివుడిని పూజిస్తాం. అయితే ఈ మహశివరాత్రి జరుపుకోవడానికి అసలు కారణాలు ఏంటో పురాణాల్లో ఎన్నో కథలున్నాయి. అయితే లింగపురాణంలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతిమాతకు ఈ మహాశివరాత్రి కథ చెప్పినట్టుగా మనకు తెలుస్తోంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

26

పూర్వం ఓ బోయవాడు పర్వత ప్రాంతాల్లో నివసించే వాడు. ఈ బోయవాడు తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఉదయాన్నే లేచి వేటకు వెళ్లి జంతువులను చంపి తెచ్చేవాడు. కానీ ఒకరోజు మాత్రం అతనికి వేటలో ఏ జంతుకు లభించలేదు. దాంతో అతను నిరశగా అతని ఇంటి వైపు బయలుదేరగా.. అతనికి మార్గం మధ్యలో ఒక మంచి నీటి సరస్సు కనిపించింది. దాంతో అతని ఆనందానికి అవదులు లేకుండా పోయింది. ఎందుకంటే ఆ సరస్సు దగ్గరకి రాత్రి సమయంలో జంతువులు వస్తాయని, అప్పుడు దాన్ని పట్టుకోవచ్చని భావిస్తాడు. కాగా ఆ రాత్రి ఆ భోయవాడు ఆ సరస్సు పక్కనుండే ఒక చెట్టుపై జంతువులకోసం కాచుకుని కూర్చుంటాడు.

36

అయితే అతనికి శివ శివ అంటూ శివుడి పేరును పలకడం బాగా అలవాటు. ఆ రాత్రంగా ఆ చెట్టుపై కూర్చొని అతను శివుడి నామాన్ని జపిస్తూనే ఉన్నాడు. అయితే ఆ రోజే శివరాత్రి. అది ఆ బోయవాడికి తెలియదు. ఇక ఆ సమయంలోనే ఆ సరస్సు దగ్గరికి నీళ్లు తాగేందుకు ఒక జింక వస్తుంది. దాన్ని చూసిన ఆ భోయవాడు దానికి బాణాన్ని ఎక్కుపెడతాడు. ఆ విషయాన్ని గమనించిన జింక ‘నేను గర్భంతో  ఉన్నానని.. నన్ను చంపడం ఆధర్మమంటూ’ అతన్ని వేడుకుంది. ఒక జింక మనిషిలా మాట్లాడటం ఏంటని ఆ భోయవాడు ఆ జింకు చంపకుండా వదిలేసాడు. అది వెళ్లిపోగానే ఆ సరస్సు దగ్గరికి మరో ఆడ జింక వచ్చింది. ఈ సారి దీన్ని చంపాలనుకున్న భోయవాడు దానిపై బాణాన్ని ఎక్కుపెట్టాడు. దాన్ని గమనించిన ఆ జింక ‘నేను నా భర్తను వెతకాడానికి ఇటుగా వచ్చాను, అయినా నేను బక్క చిక్కిన శరీరంతో ఉన్నాను.. నన్ను చంపినా నీ కుటుంబం ఆకలి తీరదు’అని అది కూడా మనిషి మాట్లాడినట్టుగానే మాట్లాడింది. అంతేకాదు అతనికి కొంతసేపటి తర్వాత ఏ జంతువు కనిపించకపోతే తిరిగి తనే వస్తానని చెప్పింది. దాంతో అతను ఆశ్చర్యపోయి దాన్ని కూడా వదిలేశాడు. 

46

అలా చాలా సేపు సరస్సు దగ్గర కూర్చున్న అతనికి ఒక మగ జింక కనిపించింది. ఆ మగ జింక ఇటేమైన రెండు ఆడ జింకలు వచ్చాయా అని ఆ భోయవాడిని అడిగింది. దాంతో అతను ఆ జింక తనతో చెప్పిన సంభాషణ అంతా వివరిస్తాడు. దానికి ఆ మగజింక వాటిని నేను ఒక సారి చూసుకొని నీ దగ్గరికి నేనొస్తానని చెప్పి వెళ్తుంది. దాంతో ఆ భోయవాడు అక్కడే కాచుకొని చూస్తుంటాడు. తెల్లవారు జామున అటుగా ఒక జింక, దాని పిల్ల రావడాన్ని ఆ భోయవాడు గమనిస్తాడు. దాంతో  ఆ భోయవాడు తెగ సంతోషపడిపోయి.. వాటిని చంపడానికి బాణాన్ని ఎక్కుపెడతాడు. దాన్ని గమనించిన తల్లి జింక తన పిల్లలను వదిలేయమని, నేను దాన్ని ఇంటికాడ వదిలేసి వస్తానని చెప్పి అక్కడినుంచి వెళుతుంది. 
 

56

ఇచ్చిన మాట ప్రకారం ఆ భోయవాడి దగ్గరికి నాలుగు జింకలు ఒకేసారి వచ్చి నిల్చుంటాయి. నన్ను చంపు అంటే ముందుగా నన్ను చంపు అని ఆ నాలుగు జింకలు భోయవాడిని వేడుకుంటాయి. ఆ జింకలు సత్యవర్తనను చూసిన భోయవాడు ఆశ్చర్యపోతాడు. అంతేకాదు అవి అతనిలో మార్పును తీసుకొస్తాయి. జంతువులకోసం కాచుకుని ఉన్న ఆ భోయవాడు ఆ రాత్రంగా మారెడు చెట్టుకిందే కూర్చొని ఉంటాడు. అందులోనూ ఆ రాత్రంతా శివ శివ అంటూ ఆ పరమేశ్వరుడిని స్మరిస్తూనే ఉంటాడు. అందులోనూ తన చూపుకు అడ్డంగా వస్తున్న మారెడు దళాలను కోసి కిందపడేస్తుంటాడు. అతనికి తెలియని విషయం ఏమిటంటే.. ఆ చెట్టు కింద శివలింగం ఉంటుంది. అతడు కిందపోసిన మారెడు దళాలన్నీ శివలింగం పైనే అభిషేకంలా పడుతుంటాయి. 

66

ఆ మారెడు దళం అతనికి శివ పూజా ఫలితాన్ని ఇచ్చింది. ఆ రాత్రంగా భోయవాడు శివ శివ అంటూ మారెడు దళాలతో శివుడిని తలుస్తూ తెల్లవారు నాలుగో జాము వరకు మెలుకువగానే ఉంటాడు. అది అతనికి ఆ జాగరణ ఫలితం దక్కుతుంది. ఆ రోజు శివరాత్రి అని తెలియకపోయినా.. అతను అనుకోకుండా చేసిన ఆ పుణ్యకార్యం.. అతని మార్పుకు నాంది పలుకుతుంది. ఆ పూజా ఫలితంగా అతనిలో మంచి పరివర్తన వస్తుంది. ఇక ఆ జింకలు సత్య నిష్టతో ఉండటంతో అవి ఆ ఈశ్వరుడి అనుగ్రహంతో మృగశిర నక్షత్రంగా ఆకాశంలో చేరిపోయాయి. ఇక భోయవాడు ఈ నక్షత్రానికి వెనుకగా ఎంతో ప్రకాశవంతంగా మెరిసిపోయే లుబ్ధక నక్షత్రం గా నిలిచిపోయాడని పురాణాలు పేర్కొంటున్నాయి.  

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
కళ్లు జిగేల్‌మనేలా పచ్చల గాజులు
Recommended image2
కూరల్లో పచ్చిమిర్చి పడేయకుండా తినేయండి
Recommended image3
Bad Breath: ఇలా చేస్తే నోటి నుంచి దుర్వాసన రాదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved