మౌనంగా ఉంటే జీవిత లక్ష్యం అంత ఈజీగా సాధించవచ్చా? నిపుణులు ఏమంటున్నారంటే..
మౌనంగా ఉండటం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. సైలెంట్ గా ఉండే వ్యక్తులు కష్టమైన పరిస్థితులను ఎలా ఈజీగా పరిష్కరించుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
సైలెంట్ విజయం
మౌనంగా ఉండటం అంటే ఏమీ తెలియక, అమాయకంగా ఉండటం అని చాలా మంది అనుకుంటారు. కాని పరిస్థితులకు తగ్గట్టుగా తనని తాను కంట్రోల్ చేసుకుంటూ సమస్యను పరిష్కరించే శక్తి మౌనంగా ఉండే వ్యక్తులకే సాధ్యమని నిపుణులు చెబుతున్నారు. సైలెంట్ వ్యక్తులు పెద్ద విజయాలను కూడా సైలెంట్ గా సాధిస్తారట.
ప్రశాంతమైన జీవనం
మౌనం అనేది సాధారణంగా సాదా మాటలా అనిపించినా దానికి ఉన్న శక్తి అపారమని నిపుణులు చెబుతున్నారు. అనవసర మాటలతో వ్యక్తిత్వాన్ని దిగజార్చుకునే బదులు మౌనం పాటిస్తే జీవితం శాంతియుతంగా మారుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. మౌనం వల్ల వ్యక్తికి అంతర్గత శక్తి పెరుగుతుందట. పరిస్థితులను మెరుగుగా అర్థం చేసుకునే సామర్థ్యం ఏర్పడుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.
జీవితంపై పట్టు సాధించవచ్చు
సమాజంలో జరిగే అనేక సంఘటనల ప్రభావం తమపై పడకుండా ఉండాలంటే మౌనమే సరైన మార్గమని ఆధ్యాత్మికవేత్తలు కూడా సూచిస్తున్నారు. మానసిక ప్రశాంతతను పొందాలంటే మాటలకు మితిమీరిన ప్రాముఖ్యత ఇవ్వకూడదని చెబుతున్నారు. వాటికి బదులుగా మౌనాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. మౌనం సాధనతో సంకల్పబలం పెరిగి, జీవితం మీద నియంత్రణ సాధించవచ్చని తెలిపారు.
విమర్శలకు స్పందించొద్దు
విమర్శలు ఎదురయ్యే సందర్భాల్లో తక్షణమే స్పందించకుండా మౌనం పాటిస్తే విమర్శించే వారే తగ్గి మాట్లాడతారు. అలాంటి వారికి మౌనమే దీటైన సమాధానంగా నిలుస్తుంది. అలాగే ప్రతికూల పరిస్థితుల్లో ఎవరి పైనా నింద వేయకుండా మౌనంగా ఉంటే సమస్య దానికదే పరిష్కారం అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నిందలు వేయడం వల్ల గొడవలు తప్ప ఎలాంటి ప్రయోజనం కలగదు.
మౌనంతో లక్ష్యం చేరుకోవడం సులభం
అనుకున్న లక్ష్యం సాధించడానికి మౌనం చక్కటి మార్గమని నిపుణులు అంటున్నారు. సైలెంట్ గా ఉండే వాళ్ల ఆలోచనలు ఎప్పుడూ లక్ష్యం పైనే ఉంటాయని, ఎటువంటి గొడవలు, విమర్శలు పట్టించుకోకుండా ఉంటారని తెలిపారు. వీరి మాటల కంటే చేతలే ఎక్కువ మాట్లాడతాయి. అందుకే అలాంటి వారు తమ లక్ష్యాలను త్వరగా, ఈజీగా చేరుకుంటారు. ఎవరైనా రెచ్చగొట్టేలా ప్రవర్తించినా, మౌనంగా ఉండటం వల్ల సమస్యలు పెద్దవి కాకుండా నివారించవచ్చు.