‘ఓం’.. మంత్రం జపించడం వల్ల జరిగే అద్భుతాలివే...
మానసిక ప్రశాంతతకు, ఏకాగ్రతకు ‘ఓం’ జపించడం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మనసును ఒకదాని మీద లగ్నం చేయడానికి ఇబ్బంది పడేవారికి ‘ఓం’ జపం బాగా పనిచేస్తుంది.
మానసిక ప్రశాంతతకు, ఏకాగ్రతకు ‘ఓం’ జపించడం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మనసును ఒకదాని మీద లగ్నం చేయడానికి ఇబ్బంది పడేవారికి ‘ఓం’ జపం బాగా పనిచేస్తుంది.
జపం వల్ల యోగా, ధ్యానాలు మరింత మెరుగైన ఫలితాలనిస్తాయి. జపం వల్ల మీలో చైతన్యం, స్పృహ పెరుగుతాయి.
ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. జపం చేస్తున్న సమయంలో వచ్చే ఆల్ఫా శబ్ద తరంగాలు.. మీ మనసును ప్రశాంతంగా చేసి ఆందోళనను తగ్గిస్తుంది.
‘ఓం’ మంత్రం జపించడం వల్ల కడుపులోని కండరాలు రిలాక్స్ అవుతాయి. దీనివల్ల కడుపునొప్పి లక్షణాలను తగ్గించి, జీర్ణవ్యవస్థను బాగు చేస్తుంది.
‘ఓం’ మంత్రాన్ని ధ్యానం చేయడం వల్ల మెదడు ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది. మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది.
మీ మూడ్ బాగు చేసి, ఏకాగ్రతను పెంచుతుంది. నిత్యం ‘ఓం’ ను జపించడం వల్ల మానసికప్రశాంతత కలుగుతుంది.
లయ బద్ధంగా ‘ఓం’ ను జపించడం వల్ల మీ ఊపిరి తిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. దీనివల్ల శ్వాస సంబంధమైన ఇబ్బందులు తొలిగి మరింత రిలాక్స్ అవుతారు.
చంచలమైన మనసుకు ఒకదానిమీద కేంద్రీకరించడానికి బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ధ్యానం ను కొత్తగా ప్రారంభిస్తున్న వారికి చాలా ఉపయోగంగా ఉంటుంది.
ఉచ్ఛ్వాస, నిశ్వాసలను గమనిస్తూ ‘ఓం’ జపించాలి. గాలి లోపలికి పీల్చుకునేప్పుడు గట్టిగా చెబుతూ, బైటికి వదిలేప్పుడు నెమ్మదిగా చెబుతూ ఓంను పలకాలి. అలా మీ ఉచ్ఛ్వాస, నిశ్వాసలకు ఓంను అన్వయించాలి.