మధ్యాహ్నం పూట వీటిని మాత్రం అస్సలు తినకండి.. తిన్నారో అంతే సంగతులు..
మధ్యాహ్నం పూట కొన్ని రకాల ఆహారాలను తినకపోవడమే ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే వీటి వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.
ఆరోగ్యంగా ఉండాలంటే మూడు పూటలా తినాలంటారు ఆరోగ్య నిపుణులు. నిజమే కానీ గజిబిజీ లైఫ్ కారణంగా కొంతమంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తే.. మరికొంత మంది రాత్రిపూట తినడం మానేస్తుంటారు. కానీ అందరూ మధ్యాహ్నం పూట ఖచ్చితంగా తింటుంటారు. అయితే ఉదయం, రాత్రి కంటే మధ్యాహ్నం పూటే ఎక్కువగా ఫుడ్ ను తింటారట. దీనివల్ల బరువు పెరగడంతో పాటుగా నిద్రమత్తుగా కూడా ఉంటుంది. అందులోనూ మధ్యాహ్నం పూట కొన్ని రకాల ఆహారాలను అసలే తినకూడదు. ఒకవేళ తింటే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలతో పాటుగా ఎన్నో సమస్యలు వస్తాయి. మధ్యాహ్నం పూట ఎలాంటి ఆహారాలను తినకూడదో తెలుసుకుందాం పదండి..
నూడుల్స్, పాస్తా
మధ్యాహ్నం పూట కూడా పాస్తా, నూడుల్స్ మొదలైనవి తినే వారు చాలా మందే ఉన్నారు. కానీ ఈ టైంలో వీటిని అస్సలు తినకూడదు. నోటికి రుచిగా అనిపించినా వీటిలో కార్పస్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇవి బరువు పెరగడానికి దారితీస్తుంది. అలాగే ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. వీటిని తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి.
జ్యూస్
జ్యూస్ లు మన ఆరోగ్యానికి చాలా మంచివి. అయినప్పటికీ వీటిని మధ్యాహ్నం పూట తాగడం అస్సలు మంచిది కాదు. లంచ్ టైంలో జ్యూస్ లను తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే ఈ జ్యూస్ లు ఆకలిని పెంచుతాయి. అందులోనూ వేయించిన ఆహారాలనే తినాలన్న కోరిక పుడుతుంది. ఇది కొన్నిసార్లు జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలను కూడా కలిగిస్తుంది.
బర్గర్
బర్గర్లు, పిజ్జాలు, శాండ్ విచ్ లు మొదలైన ఫాస్ట్ ఫుడ్ ఫుడ్స్ ను మధ్యాహ్నం పూట అస్సలు తినకూడదు. ఒకవేళ తింటే మీ శరీరంలో కొవ్వు విపరీతంగా పెరుగుతుంది. ఇది మలబద్ధకానికి దారితీస్తుంది. అంతేకాదు ఊబకాయం కూడా పెరుగుతుంది. కాబట్టి కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు లైంచ్ టైం లో ఎట్టిపరిస్థితిలో తినకండి. వీలైనంత ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాన్నే తినండి. ఆరోగ్యంగా ఉంటారు.
soup
సూప్
కాఫీ, టీ లు తాగిన తర్వాత చాలా మంది సూప్ లను తాగుతుంటారు. నిజానికి ఆరోగ్యకరమైన సూప్ లు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే భోజనానికి ముందు సూప్ ను తాగుతుంటారు. సూప్ తాగడం వల్ల ఆకలి పెరుగుతుంది. ఇక సాయంత్రం పూట కూడా సూప్ ను తాగేవారున్నారు. అయితే సూప్ లను మధ్యాహ్నం పూట తాగడం మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఈ సమయంలో సూప్ తాగితే ఆకలి పెరుగుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారు మధ్యాహ్నం పూట సూప్ తాగకపోవడమే మంచిది.