ఉదయాన్నే పసుపు నీటిని తాగడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సరే కాదు.. మరెన్నో రోగాలు తగ్గిపోతాయి తెలుసా..
పసుపులో ఉండే ఔషదగుణాలు ఎన్నో వ్యాధులను తగ్గించగలవు. పసుపును తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే విషపదార్థాలు తొలగిపోతాయి.
పసుపు నీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. కాస్త పసుపును గోరువెచ్చని నీళ్లకు కలిపితే .. పసుపులో ఉండే కర్కుమిన్ చురుగ్గా పనిచేస్తుంది. ఈ కర్కుమిన్ ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
turmeric water
రెగ్యలర్ గా గ్లాస్ పసుపు కలిపిన నీటిని తాగడం వల్ల మన శరీరానికి ఎన్నో రకాల వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. ఈ పసుపు శరీరంలో ఉండే విషపదార్థాలను కూడా తొలగించగలదు. ఇది సహజ డిటాక్స్ లా పనిచేస్తుంది.
యూరోపియన్ రిఫ్యూ ఫర్ మెడికల్ అండ్ ఫార్మకోలాజికల్ సైన్స్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. 95 శాతం కర్కుమిన్ ఉన్న 800 మి.గ్రా సప్లిమెంట్ తీసుకున్న వారు సులువుగా బరువును తగ్గారట.
సాధారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం వల్లే గుండె జబ్బులు ఎక్కువగా వస్తుంటాయి. అయితే పసుపు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. గ్లాస్ గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా పసుపు వేసుకుని తాగడం వల్ల శరీర మంట తగ్గుతుంది. ఇక దీనిలో ఉండే శోథ నిరోధక లక్షణాలు దీర్ఘకాలిక తాపజనక వ్యాధి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధి లక్షణాలను తగ్గించడానికి సహాయపడతాయి.
పసుపులో పుష్కలంగా ఉండే కర్కుమిన్ కు క్యాన్సర్ తో పోరాడే సామర్థ్యం ఉంటుందని ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. పసుపు క్యాన్సర్ కణాలను ఇతర భాగాలకు వ్యాపించకుండా చేయడానికి, కణితిని తొలగించడానికి సహాయపుతుంది.
పసుపు రక్తాన్ని శుద్ధి చేస్తుందని పలు పరిశోధనలు వెల్లడించాయి. ఎందుకంటే పసుపు శరీరంలో ఉండే విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది కాబట్టి. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ రంగును పెంపొందిస్తాయి. అలాగే కణాలు దెబ్బతినకుండా రక్షిస్తాయి. వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేయడానికి కూడా సహాయపడతాయి. పసుపు నీరు చర్మాన్ని మరింత ప్రకాశవంతంగా చేయడంతో పాటుగా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
అల్జీమర్స్ వ్యాధిని నియంత్రిస్తుంది
అల్జీమర్స్ వ్యాధిని పూర్తిగా తగ్గించుకోవడానికి నేటికి కూడా సరైన చికిత్స లేదు. అందుకే దీన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అయితే పసుపులో ఉండే కర్కుమిన్ ఆక్సీకరణ నష్టాన్ని, వాపును తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది.
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది
పుసుపులో ఉండే ఔషదగుణాలు రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. పుసుపులో యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ తో పాటుగా యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉన్నాయి. కొద్ది మొత్తంలో రోజూ పసుపు నీళ్లను తాగడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలంగా తయారవుతుంది.
పసుపు నీటిని ఎలా తయారుచేసుకోవాలి
గ్లాస్ గోరువెచ్చని నీళ్లను తీసుకుని అందులో కొద్దిగా పసుపును కలపండి. ఇలా తాగలేం అనుకుంటే ఈ నీటికి టీస్పూన్ తేనెను కలపండి. దీన్ని ఉదయం పరిగడుపున తాగండి. అయితే ఈ నీటిని రాత్రి పడుకునేటప్పుడు కూడా తాగొచ్చు.