Dead Person Things: చనిపోయిన వాళ్ల బంగారం, మంచం, దుస్తులు మనం తిరిగి వాడుకోవచ్చా?
Dead Person Things: భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. అయితే, బతికున్నంత కాలం మనిషి తమ వస్తువులపై చాలా ప్రేమ పెంచుకుంటారు. మరి, వారు చనిపోయిన తర్వాత వారి వస్తువులను ఏం చేయాలి?

చనిపోయిన వారి వస్తువులు ఏం చేయాలి?
మనిషి వస్తు ప్రేమికుడు. చుట్టూ ఉన్న మనుషులను ప్రేమించినా ప్రేమించకపోయినా.. తమ వస్తువులపై మాత్రం అమితమైన ప్రేమ పెంచుకుంటాడు. తమ వస్తువులను మరొకరితో పంచుకోవడానికి కూడా ఇష్టపడరు. కానీ.. మనిషి చనిపోయిన తర్వాత.. ఏదీ తీసుకొని వెళ్లలేడు. చాలా మంది.. తమ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే.. వారికి సంబంధించిన వస్తువులను గుర్తుగా దాచుకుంటారు. అది మంచి పద్దతేనా? గరుడ పురాణం ప్రకారం… చనిపోయిన వ్యక్తి కి సంబంధించిన వస్తువులను ఏం చేయాలి? కుటుంబ సభ్యులు వాడుకోవచ్చా? లేక ఎవరికైనా దానం చేయాలా?
గరుడ పురాణం ఏం చెబుతోంది..?
హిందూ ధర్మంలో మరణం అంటే ఆత్మకు ముగింపు కాదు.. కేవలం శరీరానికి మాత్రమే అంతం. గరుడ పురాణం ప్రకారం… చనిపోయిన తర్వాత కూడా వారి ఆత్మ కొంత కాలం భూమిపై తిరుగుతుంది. ముఖ్యంగా వారికి ఇష్టమైన వస్తువుల చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. వారు రోజూ వాడే వస్తువులపై కూడా ఆత్మ ప్రభావం ఉంటుంది. అందుకే.. వాటిని ఎక్కువ సేపు ఇంట్లో ఉంచుకోవడం వల్ల నెగిటివ్ ఎఫెక్ట్ పెరిగే అవకాశం ఉంది.
ఆ వస్తువులను ఏం చేయాలి?
చనిపోయిన వ్యక్తి ఆత్మ ప్రభావం.. దుస్తులు, పరుపు, బెడ్, దుప్పటి పై ఎక్కువగా ఉంటాయి. అందుకే.. వాటిని వెంటనే ఉపయోగించకూడదు. వెంటనే వాడటం వల్ల మానసిక ఆందోళన, పీడకలలు, భావోద్వేగ ఒత్తిడి వంటివి పెరుగుతాయి. అయితే.. మనం వాటిని ఉపయోగించకూడదు కానీ.. వాటిని శుభ్రం చేసి.. అవసరం అయిన వారికి దానం చేయాలి. ఇలా చేయడం వల్ల చనిపోయిన వ్యక్తి ఆత్మ కూడా శాంతిస్తుంది.
బంగారం ఏం చేయాలి?
బంగారం చాలా విలువైనది. ఇలాంటి వాటిని దానం చేయలేం. కాబట్టి… వాటిని పవిత్ర జలంతో శుద్ధి చేసి తిరిగి వాడుకోవచ్చు. అలా కాకుండా.. పరుపు, దుస్తులు లాంటి వాటిని అయితే.. అవసరంలో ఉన్న వారికి దానం చేయడం మంచిదని గరుడ పురాణం చెబుతోంది.
ఆర్థిక పరిస్థితి సరిగా లేని వాళ్లు.. తాము దానం చేసే పరిస్థితుల్లో లేము అనుకునేవారు.. పరుపు, దుస్తులు లాంటి వాటిని కూడా గంగా జలంతో శుద్ధి చేసి తిరిగి వాడుకోవచ్చు.

