Beauty Tips: కాంతివంతమైన ముఖం కావాలా.. అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి?
Beauty Tips: ముఖం కాంతివంతంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ శరీరం డిహైడ్రేట్ అయిపోతే చర్మం మెరిసే తత్వాన్ని కోల్పోతుంది అయితే ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో మెరిసే చర్మాన్ని పొందవచ్చు. అదెలాగో చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
కాంతివంతమైన చర్మం, అందమైన ముఖం కావాలని అందరూ కోరుకుంటారు. కానీ శరీరం డిహైడ్రేట్ అయిపోతున్నట్లయితే చర్మం కాంతి తత్వాన్ని కోల్పోతుంది. ప్రస్తుత జీవనశైలిలో చాలామంది ముఖంపై ఉండే మెరుపుని కాపాడుకోవడం కోసం చాలా ప్రయోగాలు చేస్తున్నారు.
అలాగే ఖరీదైన సౌందర్య సాధనాలను కూడా వాడుతున్నారు. అయితే ముఖం యొక్క చర్మ సౌందర్యం కోసం అంత ఖరీదైన కాస్మెటిక్స్ కన్నా మన ఇంట్లో ఉండే వస్తువులతో సహజ పద్ధతులతో వాడే పేస్ క్రీముల వల్ల ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయంట అవి ఎలాగో చూద్దాం.
పెరుగు ఆహారానికే కాదు అందానికి కూడా ఉపయోగించుకోవచ్చు. అవును పెరుగు మొఖం యొక్క చర్మం యొక్క సౌందర్యం కోసం వినియోగించవచ్చు అంటున్నారు నిపుణులు. ఇది చర్మంపై తేమను పెంచేందుకు కృషి చేయడమే కాకుండా ఆ ముఖంపై ఉండే చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.
రాత్రిపూట పెరుగుని ముఖానికి అప్లై చేసుకొని ఒక పావుగంట తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడగటం వలన ముఖంపై ఉండే నలుపు తగ్గిపోవటమే కాకుండా ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది. అలాగే ముల్తాని మిట్టి కూడా చర్మ సౌందర్యాన్ని పెంపొందించడం కోసం ఎన్నో శతాబ్దాల నుంచి వినియోగిస్తున్నారు.
ముల్తానీ మిట్టి లో రోజ్ వాటర్ మిక్స్ చేసి కళ్ళ కింద నల్లని వలయాలు ఉన్నచోట అప్లై చేయడం వల్ల కళ్ళ కింద నలుపు త్వరగా నయమవుతుంది. అంతేకాకుండా ముఖంపై ఉండే మొటిమలను కూడా నియంత్రిస్తుంది. ముల్తానీ మిట్టి లో ఉండే గుణాలు చర్మాన్ని మెరుగుపరచడమే కాకుండా కాంతివంతంగా కూడా చేస్తాయి.
అలాగే రోజ్ వాటర్ కూడా మంచి సౌందర్య సాధనంగా వాడుకోవచ్చు. రోజ్ వాటర్ ని రాత్రిపూట ప్రతిరోజు ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం పొడిబారి పోకుండా ఉంటుంది. అంతేకాదు చర్మం చాలా సాఫ్ట్ గా తయారవుతుంది. ఇలాంటి న్యాచురల్ ప్రొడక్ట్స్ ముఖానికి అప్లై చేయడం వలన రిజల్ట్స్ త్వరగా రావటమే కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పైగా ఖర్చు కూడా తక్కువ.