పీరియడ్స్ నొప్పిని తగ్గించేందుకు పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లను వాడితే ఏమౌతుందో తెలుసా..?
పీరియడ్స్ నొప్పి భరించలేనిది. అందుకే ఈ నొప్పిని తగ్గించుకునేందుకు పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లను వేసుకుంటారు. అయితే వీటిని వేసుకోవడం మంచిది కాదని కొంతమంది అటుంటారు. మరి దానిలో నిజమెంతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
periods pain
ఆడవాళ్లకు నెలకు మూడు రోజులు అతికష్టం మీద గడుస్తాయి. అదె పీరియడ్స్ సమయంలో. ఈ సమయంలో చాలా మంది ఆడవారికి విపరీతమైన నొప్పి ఉంటుంది. ఇక నొప్పి కారణంగా ఆఫీసులు, కాలేజీలకు సెలవులు పెట్టకోవాల్సి ఉంటుంది. అయితే చాలా మంది ఈ నొప్పిని భరించలేక పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లను వేసుకుంటుంటారు. ఇది కాస్త నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
పెయిన్ కిల్లర్స్ ను తీసుకోవడం సురక్షితమేనా..?
విపరీతమైన నెలసరి నొప్పిని తట్టుకోలేని చాలా మంది ఆడవారు పెయిన్ కిల్లర్ ట్యాబెట్లను వేసుకుంటుంటారు. లేకపోతే ఈ నొప్పి వారిని కుదురుగా ఉండనీయదు. ఈ నొప్పి వల్ల తమ పనులను కూడా చేసుకోలేకపోతుటారు. అయితే కొంతమంది ఎంత నొప్పి వచ్చినా.. అలాగే భరిస్తారు. కానీ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లను మాత్రం వేసుకోరు. ఎందుకంటే దీనివల్ల గర్భాశయంపై చెడు ప్రభావం పడుతుంది. ఇతర సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని. నిజానికి పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లను వేసుకోవడం వల్ల ఎలాంటి హాని జరగదని ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ ను షేర్ చేశారు డాక్టర్ తానాయా..
మన శరీరం ప్రోస్టాంగ్లాండిన్స్ అనే పదార్థాలను స్రవించడం వల్ల నెలసరి నొప్పి వస్తుంది. ఇది గర్భాశయంపై ఒత్తిడి తెచ్చి రుతుస్రావ రక్తాన్ని బయటకు పంపడానికి సహాయపడుతుందని డాక్టర్ తానాయా అన్నారు. ఇక ఈ పీరియడ్స్ స్టార్ట్ అయిన 12 గంటల వ్యవధిలో పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లను వేసుకోవచ్చని ప్రసూతి, గైనకాలజీ విభాగం అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ సుమన్ లాల్ అన్నారు.
పీరియడ్స్ నొప్పిని తగ్గించి గర్భాశయాన్ని సడలిండానికి పెయిన్ కిల్లర్స్ సహాయపడతాయి. అయినప్పటికీ అనాల్జెసిక్స్ ( ఇబుఫ్రోఫెన్, ఆస్పిరన్, డైక్లోఫెనాల్) ప్రోస్టాగ్లాండిన్ చర్యను పరోక్షంగా తగ్గిస్తాయి. అందుకే వీటిని వేసుకోవడం వల్ల నొప్పి తగ్గుతుంది.
అయితే డాక్టర్ల అభిప్రాయం ప్రకారం.. నెలసరి సమయంలో మాత్రలను అతిగా తీసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లను అతిగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలు, పొట్ట దెబ్బతింటాయి. అయితే ప్రతినెలా ఒకటి లేదా రెండు వేసుకోవడం వల్ల ఎలాంటి హాని జరగదు. అయితే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లను వేసుకున్నా.. నొప్పి తగ్గకపోతే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లండి.
పీరియడ్స్ నొప్పిని తగ్గించేందుకు ఇంకేం చేయొచ్చు..
ఈ పీరియడ్స్ సమయంలో వేయించిన ఆహారాలను తినకపోవడే మంచిది. పాలు, పాల ఉత్పత్తులను, కెఫిన్ , కొవ్వు ఆహారాలను తినకూడదు. వీటిని తీసుకుంటే మలబద్దకం సమస్య బారిన పడతారు. ముఖ్యంగా పొట్టపై వేడి కాపడం పెడితే నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. అలాగే పుదీనా టీ తాగినా నొప్పి కాస్త తగ్గుతుంది. హీటింగ్ ప్యాడ్ ను ఉపయోగించడం వల్ల ఈ నొప్పి చాలా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.