MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • International
  • పెరూలో విషాదం.. బంగారు గనిలో అగ్ని ప్రమాదం.. 27మంది మృతి..

పెరూలో విషాదం.. బంగారు గనిలో అగ్ని ప్రమాదం.. 27మంది మృతి..

అరేక్విపా ప్రాంతంలోని లా ఎస్పెరాంజా గనిలోని సొరంగంలో మంటలు చెలరేగడంతో షార్ట్ సర్క్యూట్ కారణంగా, మంటలు చెలరేగి 27మంది కార్మికులు మృతి చెందారు. 

2 Min read
Author : Bukka Sumabala
Published : May 08 2023, 08:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

పెరూ : దక్షిణ పెరూలోని మారుమూల ప్రాంతంలోని బంగారు గనిలో జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం 27 మంది కార్మికులు మరణించారని ఆదివారం అధికారులు తెలిపారు. ఇది ఆ దేశ చరిత్రలో ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత ఘోరమైన మైనింగ్ విషాదాలలో ఒకటి. ప్రమాదంలో మరణించిన వారికోసం వారి బంధువుల ఆందోళన కలిచి వేస్తోంది. తమవారికోసం పెద్ద ఎత్తున బంధువులు గని దగ్గర గుమిగూడారు.

28

ఒకరు మాట్లాడుతూ "షార్ట్ సర్క్యూట్ జరిగిందని, దాని వల్ల పేలుడు సంభవించిందని మాకు తెలుసు. ఇది మమ్మల్ని షాక్ కు గురి చేసింది. " అని ఈ ప్రమాదంలోని ఓ బాధితుడి సోదరుడు ఫ్రాన్సిస్కో జోడించారు.

38

అరేక్విపా ప్రాంతంలోని లా ఎస్పెరాంజా 1 గనిలోని సొరంగంలో మంటలు చెలరేగడంతో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం ధృవీకరించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జియోవన్నీ మాటోస్  "గనిలో 27 మంది చనిపోయారు" అని చెప్పారు.

48

ప్రాంతీయ రాజధాని అరేక్విపా నగరం నుండి 10 గంటల ప్రయాణంలో రిమోట్ కాండెసుయోస్ ప్రావిన్స్‌లోని గనిలో పేలుడు సంభవించిన తర్వాత మంటలు చెలరేగినట్లు స్థానిక మీడియా ముందుగా తెలిపింది. పేలుడు ధాటికి యానాక్విహువా పట్టణంలోని గనిలోని చెక్క సపోర్టులకు మంటలు అంటుకున్నాయి. ప్రమాద సమయంలో బాధితులు భూమికి 100 మీటర్ల దిగువన ఉన్నారని స్థానిక మీడియా తెలిపింది.

58

పోలీసులు మరణించిన వారి వివరాలను సేకరించిన తర్వాత ఆదివారం నాడు అగ్నిప్రమాద వార్త ప్రచురించబడింది. బాధితుల మృతదేహాలను బయటకు తీయడానికి రెస్క్యూ బృందాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికోసం గనిలో రాకపోకలు.. అనవసరపు ఆందోళనలేకుండా ప్రయత్నిస్తున్నాయి. "చనిపోయినవారు ఉన్న స్థలాన్ని మేము సురక్షితంగా ఉంచాలి, తద్వారా  అందులోకి ప్రవేశించి మృతదేహాలను తీయగలుగుతాం" అని మాటోస్ చెప్పారు.

68

మంటలు చెలరేగిన సమయంలో గనిలో ఎంత మంది ఉన్నారనే దాని గురించి ఎటువంటి నిర్ధారణ లేదు. ఆ సమయంలో అక్కడున్న వారు ప్రాణాలతో బయటపడినట్లు ఎటువంటి నివేదికలు లేవు. చాలా మంది మైనర్లు ఊపిరాడక, కాలిన గాయాలతో చనిపోయారని చెప్పారు.

78

2022లో మైనింగ్ ఘటనల్లో 39 మంది చనిపోయారు. లాటిన్ అమెరికాలో అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారు పెరూలో ఇటీవలి సంవత్సరాలలో జరిగిన ఘోరమైన మైనింగ్ ప్రమాదాలలో ఈ సంఘటన ఒకటి. "మృతదేహాలను వెలికితీసి, వాటిని బైటికి తీసుకురావడం కోసం.. ఈ విషాదం సంభవించినప్పటి నుండి ఇంటర్నల్, రక్షణ మంత్రిత్వ శాఖలు పని చేస్తున్నాయి" అని ప్రెసిడెన్సీ ఒక ట్వీట్‌లో పేర్కొంది.

88

తమ బంధువుల సమాచారం కోసం కుటుంబ సభ్యులు సమీపంలోని పోలీస్ స్టేషన్‌ ను సంప్రదిస్తున్నారు. గని వద్దకు అనుమతిని నిరాకరించారు. మినేరా యానాకిహువా అనే కంపెనీ 23 ఏళ్లుగా పెరూలో గనులను నిర్వహిస్తోంది. ఈ గని కూడా అదే కంపెనీ నిర్వహిస్తోంది. 
ఈ గని చట్టపరమైన సంస్థ. అయితే, ఈ ప్రాంతంలో చాలా అక్రమ గనులు కూడా ఉన్నాయి.

About the Author

BS
Bukka Sumabala
Latest Videos
Recommended Stories
Recommended image1
Layoffs : టెక్ ఉద్యోగులకు ఏఐ గండం.. ఒక్క కంపెనీ నుండే 11,000 మంది ఔట్
Recommended image2
LPG: అమెరికాలో కూడా ఇంటికి గ్యాస్ సిలిండ‌ర్లు డెలివ‌రీ చేస్తారా.? అక్క‌డి వ్య‌వ‌స్థ ఎలా ఉంటుంది
Recommended image3
Oil Crisis: ప్రపంచమంతా ఆయిల్ కొరత వచ్చినా.. ఈ దేశానికి మాత్రం ఏం కాదు. ఏందుకంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved