Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • International
  • పెరూలో విషాదం.. బంగారు గనిలో అగ్ని ప్రమాదం.. 27మంది మృతి..

పెరూలో విషాదం.. బంగారు గనిలో అగ్ని ప్రమాదం.. 27మంది మృతి..

అరేక్విపా ప్రాంతంలోని లా ఎస్పెరాంజా గనిలోని సొరంగంలో మంటలు చెలరేగడంతో షార్ట్ సర్క్యూట్ కారణంగా, మంటలు చెలరేగి 27మంది కార్మికులు మృతి చెందారు. 

SumaBala Bukka | Published : May 08 2023, 08:55 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Asianet Image

పెరూ : దక్షిణ పెరూలోని మారుమూల ప్రాంతంలోని బంగారు గనిలో జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం 27 మంది కార్మికులు మరణించారని ఆదివారం అధికారులు తెలిపారు. ఇది ఆ దేశ చరిత్రలో ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత ఘోరమైన మైనింగ్ విషాదాలలో ఒకటి. ప్రమాదంలో మరణించిన వారికోసం వారి బంధువుల ఆందోళన కలిచి వేస్తోంది. తమవారికోసం పెద్ద ఎత్తున బంధువులు గని దగ్గర గుమిగూడారు.

28
Asianet Image

ఒకరు మాట్లాడుతూ "షార్ట్ సర్క్యూట్ జరిగిందని, దాని వల్ల పేలుడు సంభవించిందని మాకు తెలుసు. ఇది మమ్మల్ని షాక్ కు గురి చేసింది. " అని ఈ ప్రమాదంలోని ఓ బాధితుడి సోదరుడు ఫ్రాన్సిస్కో జోడించారు.

38
Asianet Image

అరేక్విపా ప్రాంతంలోని లా ఎస్పెరాంజా 1 గనిలోని సొరంగంలో మంటలు చెలరేగడంతో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం ధృవీకరించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జియోవన్నీ మాటోస్  "గనిలో 27 మంది చనిపోయారు" అని చెప్పారు.

48
Asianet Image

ప్రాంతీయ రాజధాని అరేక్విపా నగరం నుండి 10 గంటల ప్రయాణంలో రిమోట్ కాండెసుయోస్ ప్రావిన్స్‌లోని గనిలో పేలుడు సంభవించిన తర్వాత మంటలు చెలరేగినట్లు స్థానిక మీడియా ముందుగా తెలిపింది. పేలుడు ధాటికి యానాక్విహువా పట్టణంలోని గనిలోని చెక్క సపోర్టులకు మంటలు అంటుకున్నాయి. ప్రమాద సమయంలో బాధితులు భూమికి 100 మీటర్ల దిగువన ఉన్నారని స్థానిక మీడియా తెలిపింది.

58
Asianet Image

పోలీసులు మరణించిన వారి వివరాలను సేకరించిన తర్వాత ఆదివారం నాడు అగ్నిప్రమాద వార్త ప్రచురించబడింది. బాధితుల మృతదేహాలను బయటకు తీయడానికి రెస్క్యూ బృందాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికోసం గనిలో రాకపోకలు.. అనవసరపు ఆందోళనలేకుండా ప్రయత్నిస్తున్నాయి. "చనిపోయినవారు ఉన్న స్థలాన్ని మేము సురక్షితంగా ఉంచాలి, తద్వారా  అందులోకి ప్రవేశించి మృతదేహాలను తీయగలుగుతాం" అని మాటోస్ చెప్పారు.

68
Asianet Image

మంటలు చెలరేగిన సమయంలో గనిలో ఎంత మంది ఉన్నారనే దాని గురించి ఎటువంటి నిర్ధారణ లేదు. ఆ సమయంలో అక్కడున్న వారు ప్రాణాలతో బయటపడినట్లు ఎటువంటి నివేదికలు లేవు. చాలా మంది మైనర్లు ఊపిరాడక, కాలిన గాయాలతో చనిపోయారని చెప్పారు.

78
Asianet Image

2022లో మైనింగ్ ఘటనల్లో 39 మంది చనిపోయారు. లాటిన్ అమెరికాలో అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారు పెరూలో ఇటీవలి సంవత్సరాలలో జరిగిన ఘోరమైన మైనింగ్ ప్రమాదాలలో ఈ సంఘటన ఒకటి. "మృతదేహాలను వెలికితీసి, వాటిని బైటికి తీసుకురావడం కోసం.. ఈ విషాదం సంభవించినప్పటి నుండి ఇంటర్నల్, రక్షణ మంత్రిత్వ శాఖలు పని చేస్తున్నాయి" అని ప్రెసిడెన్సీ ఒక ట్వీట్‌లో పేర్కొంది.

88
Asianet Image

తమ బంధువుల సమాచారం కోసం కుటుంబ సభ్యులు సమీపంలోని పోలీస్ స్టేషన్‌ ను సంప్రదిస్తున్నారు. గని వద్దకు అనుమతిని నిరాకరించారు. మినేరా యానాకిహువా అనే కంపెనీ 23 ఏళ్లుగా పెరూలో గనులను నిర్వహిస్తోంది. ఈ గని కూడా అదే కంపెనీ నిర్వహిస్తోంది. 
ఈ గని చట్టపరమైన సంస్థ. అయితే, ఈ ప్రాంతంలో చాలా అక్రమ గనులు కూడా ఉన్నాయి.

Bukka Sumabala
About the Author
Bukka Sumabala
 
Recommended Stories
Top Stories