MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • International
  • కాందహార్ మసీదుపై దాడి: ఆఫ్ఘనిస్తాన్‌లో సామూహిక అంత్యక్రియలు.. చిత్రాలివే

కాందహార్ మసీదుపై దాడి: ఆఫ్ఘనిస్తాన్‌లో సామూహిక అంత్యక్రియలు.. చిత్రాలివే

ఆఫ్ఘనిస్తాన్‌లో శుక్రవారం షియాలు ప్రార్థన చేసే మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో అనధికారికంగా 67 మంది మరణించినట్టు తెలిసింది. ఈ దాడిలో మరణించినవారికి కుటుంబ సభ్యులు శనివారం సామూహికంగా అంత్యక్రియలు నిర్వహించారు. 

1 Min read
Author : pratap reddy
| Updated : Oct 17 2021, 06:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
afghanistan, mass funeral

afghanistan, mass funeral

న్యూఢిల్లీ: Afghanistanలోని కాందహార్ నగరంలో షియాలు ప్రార్థనలు చేసే mosqueపై ఆత్మాహుతి దాడి జరిగింది.శుక్రవారం జరిగిన ఈ దాడిలో 47 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని తాలిబాన్ ప్రభుత్వం  తెలిపింది. అయితే,స్థానికులు ఈ సంఖ్య 63గా చెబుతున్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో  చాలా మంది చికిత్స పొందుతున్నారని, ఆరోగ్యం విషమంగా ఉన్నావారూ ఉన్నారని వివరించారు. 

24
afghanistan, mass funeral

afghanistan, mass funeral

శుక్రవారం ఈ దాడిలో మరణించినవారి మృతదేహాలకు కుటుంబీకులు శనివారం last rites నిర్వహించారు. పదుల సంఖ్యలో ఉండటంతో వారందరినీ సామూహికంగా ఖననం చేశారు. తమ ప్రాణాలను రక్షించాలని ఆ  కుటుంబ సభ్యులు తాలిబాన్లను అభ్యర్థించారు.
 

34
afghanistan, mass funeral

afghanistan, mass funeral

ఆఫ్ఘనిస్తాన్‌ చరిత్ర పొడుగునా రక్తమోడుతూనే ఉన్నది. వలసవాదానికి ముందు నుంచే ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు దుస్థితిని
ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది ఆగస్టులో అమెరికా మద్దతులో అధికారంలో ఉన్న అష్రఫ్ ఘనీ ప్రభుత్వాన్ని కూలదోసి Talibanలు అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. 20ఏళ్ల యుద్ధం కొంతకాలమైనా సద్దుమణుగుతుందని భావిస్తున్న తరుణంలో మరో ఉగ్రముప్పు ఇప్పుడు ఆ దేశాన్ని వణికిస్తున్నది. ఐఎస్‌కేపీ 
రూపంలో తాలిబాన్లకు ముప్పు ఎదురవుతున్నది.

44
afghanistan, mass funeral

afghanistan, mass funeral

కాందహార్ ప్రావిన్స్‌లోని ఫాతిమియా మసీదులో ఆత్మాహుతి దాడికి పాల్పడినట్టు ఐఎస్‌కేపీ ఓ ప్రకటన చేసింది. తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరిగిన అతి పెద్ద దాడిగా దీన్ని పేర్కొంటున్నారు.

ఐఎస్‌కేపీ క్రమంగా దాని ప్రాబల్యాన్ని పెంచుకుంటున్నది. ఇప్పుడు నార్త్, కాబూల్‌లోనూ పట్టు సంపాదించుకుంటున్నది. అయితే, ఈ ముప్పును తాలిబాన్లు ఎదుర్కొనగలరా? లేదా? అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న.

About the Author

PR
pratap reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Iran Israel War లోకి ఇండియా ఇండైరెక్ట్ ఎంట్రీ..? ట్రంప్ కు స్ట్రాంగ్ వార్నింగ్..?
Recommended image2
Israel Iran War : 50 ఫైటర్ జెట్స్.. 100 బాంబులు.. ఇరాన్ సుప్రీం లీడర్ బంకర్ విధ్వంసం వీడియో వైరల్
Recommended image3
ఇరాన్ తో యుద్దంలో ట్రంప్ గెలిచినట్లా.. ఓడినట్లా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved