MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • International
  • ఎంతకు తెగించ్చార్రా .. ఆన్లైన్ టెర్రరిస్ట్ కోర్సులా..! అదీ అమ్మాయిలకా..!!

ఎంతకు తెగించ్చార్రా .. ఆన్లైన్ టెర్రరిస్ట్ కోర్సులా..! అదీ అమ్మాయిలకా..!!

Tufat al Mominat : భారతదేశంలో విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం ఆన్లైన్ లో రకరకాల కోర్సులు, ప్రత్యేక క్లాసులు అందించడం చూస్తుంటాం. కానీ పక్కదేశం పాకిస్థాన్ లో ఆన్లైన్ టెర్రరిస్ట్ కోర్సులు అందిస్తున్నారట.  

2 Min read
Author : Arun Kumar P
Published : Oct 22 2025, 05:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మరింత దిగజారిన పాకిస్థాన్
Image Credit : Asianet News

మరింత దిగజారిన పాకిస్థాన్

Online Terrorist Course : ఇంతకు మించి దిగజారరు అనుకున్న ప్రతిసారి పాకిస్థాన్ మన ఆలోచనే తప్పని నిరూపిస్తోంది... మరింత దిగజారిపోతోంది. ఈ దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ప్రతి ఒక్కరికి తెలుసు... కానీ ప్రపంచ వేదికలపై ఉగ్రవాదానికి తాము వ్యతిరేకమని సిగ్గులేకుండా చెప్పుకుంటుంది. దొంగే వేరేవారిని దొంగ అన్నట్లుగా చుట్టపక్కల దేశాలే తమదేశంలో హింసను ప్రేరేపిస్తున్నాయని ఇంతకాలం భారత్, ఇప్పుడు అప్ఘానిస్తాన్ పై ఆరోపణలు చేస్తూ వస్తోంది పాక్. అయితే తాజాగా పాకిస్థాన్ లో ఉగ్రవాద కార్యకలాపాలు ఏ స్థాయికి చేరుకున్నాయో తెలియజేసే ఆసక్తికర వ్యవహారం ఒకటి వెలుగుచూసింది.

25
పాక్ లో ఆన్లైన్ జిహాద్ కోర్సులు
Image Credit : Jaish e mohammed

పాక్ లో ఆన్లైన్ జిహాద్ కోర్సులు

జమ్మూ కాశ్మీర్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పహల్గాంలో ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ 'ఆపరేషన్ సిందూర్' చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది ఇండియన్ ఆర్మీ. ఇలా ధ్వంసంచేసిన 9 స్థావరాలలో కరుడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజార్‌కు చెందిన జైష్-ఎ-మొహమ్మద్ స్థావరం కూడా ఉంది. ఈ దాడిలో మసూద్ అజార్ కుటుంబ సభ్యులు చాలామంది చనిపోయారు.

అయితే ఈ జైష్-ఎ-మొహమ్మద్ మహిళా విభాగాన్ని కలిగివుందన్న విషయం ఈ సమయంలోనే బైటపడింది... మసూద్ అజార్ సోదరీమణులు నేతృత్వంలోనే ఈ ‘జమాత్ ఉల్ ముమినాత్’ నడుస్తోంది. ఇప్పుడు ఈ మహిళా ఉగ్రవాదుల విభాగం ఆసక్తికర ప్రకటన చేసింది. తమ సంస్థలో చేరేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు... ఇందుకోసం మహిళలకు ఆన్‌లైన్ జిహాదీ కోర్సును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. దీనికి పాకిస్థానీ కరెన్సీలో 500 రూపాయల ఫీజు కూడా నిర్ణయించారు. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి చాలామంది మహిళలు ఈ కోర్సులో చేరినట్లు సమాచారం.

Related Articles

Related image1
సరిహద్దుల్లో పాకిస్థాన్ ఫైటర్ జెట్స్ దాడులు.. ముగ్గురు యంగ్ క్రికెటర్లు మృతి
Related image2
బ్రహ్మోస్ గాల్లోకి లేస్తే.. పాకిస్థాన్ పచ్చడి పచ్చడే..: రాజ్ నాథ్ మాస్ వార్నింగ్
35
 తుఫత్ అల్ మోమినత్ కోర్సు
Image Credit : google

తుఫత్ అల్ మోమినత్ కోర్సు

మహిళా ఉగ్ర విభాగం ప్రారంభించిన ఈ ఆన్‌లైన్ జిహాదీ కోర్సును 'తుఫత్ అల్ మోమినత్' పేరుతో నడుపుతున్నారు. 500 పాకిస్థానీ రూపాయలు చెల్లించి చాలామంది ఇందులో చేరారు. ఇప్పుడు ఈ మహిళా విభాగం ఈ కోర్సు ద్వారా డబ్బుతో పాటు తమ కార్యకలాపాలను విస్తరించుకోవాలని చూస్తోంది. ఉగ్రవాద వర్గాల్లో ఈ ఆన్‌లైన్ కోర్సుకు మంచి ఆదరణ లభిస్తోంది.

45
నవంబర్ 8 నుంచి కోర్సు ప్రారంభం
Image Credit : Getty

నవంబర్ 8 నుంచి కోర్సు ప్రారంభం

జైష్-ఎ-మొహమ్మద్ మహిళా ఉగ్ర విభాగం ప్రారంభించిన ఈ జిహాదీ ఆన్‌లైన్ కోర్సు నవంబర్ 8 నుంచి మొదలవుతుంది. ప్రతిరోజూ 40 నిమిషాల పాటు కోర్సు ఉంటుంది. మసూద్ అజార్ సోదరీమణులు సాదియా అజార్, సమైరా అజార్ శిక్షణ ఇస్తారు. సాదియా అజార్ భర్త యూసుఫ్ అజార్ భారత్ జరిపిన 'ఆపరేషన్ సిందూర్' వైమానిక దాడిలో చనిపోయాడు.

55
జైష్-ఎ-మొహమ్మద్‌కు ఆర్థిక కష్టాలు
Image Credit : freepik

జైష్-ఎ-మొహమ్మద్‌కు ఆర్థిక కష్టాలు

జైష్-ఎ-మొహమ్మద్ స్థావరాలపై భారత సైన్యం దాడుల తర్వాత ఆ సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఉగ్ర స్థావరాలపై దాడుల్లో జైష్-ఎ-మొహమ్మద్ అగ్రనేత కుటుంబ సభ్యులు చనిపోయారు… వీరంతా ఈ సంస్థలో కీలక సభ్యులు. వీరి మరణానికి పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం కూడా అందలేదని సమాచారం.

అయితే తమ ఉగ్రవాద కార్యకలాపాలను ఎలాగైనా తిరిగి ప్రారంభించాలని జైష్-ఎ-మొహమ్మద్ కష్టపడుతోంది. అందుకే వివిధ మార్గాల ద్వారా నిధులు సేకరించాలని చూస్తోంది. ఇప్పుడు మహిళా విభాగం ఈ కొత్త పథకం ద్వారా డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
పాకిస్తాన్
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్
భారత దేశం
రక్షణ (Rakshana)
ఏషియానెట్ న్యూస్
వైరల్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Benjamin Netanyahu : ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు ఏం చదువుకున్నారో తెలుసా?
Recommended image2
Iran Israel War : దుబాయ్ లో 19 మంది భారతీయులు అరెస్ట్.. అసలేం జరుగుతోంది?
Recommended image3
Iran Israel War: ఇజ్రాయెల్ ప్ర‌ధాని బ‌తికే ఉన్నారా.? అస‌లేం జ‌రుగుతోంది.?
Related Stories
Recommended image1
సరిహద్దుల్లో పాకిస్థాన్ ఫైటర్ జెట్స్ దాడులు.. ముగ్గురు యంగ్ క్రికెటర్లు మృతి
Recommended image2
బ్రహ్మోస్ గాల్లోకి లేస్తే.. పాకిస్థాన్ పచ్చడి పచ్చడే..: రాజ్ నాథ్ మాస్ వార్నింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved