ప్రతిరోజూ 20నిమిషాలు ఇలా చేస్తే.. ఆరోగ్యం మీ వెంటే..!
వారానికి కనీసం రెండు గంటలు నడిచేవారిలో బుర్ర పనితీరు బాగుంటుందట. కనీసం 30శాతం బ్రెయిన్ స్ట్రోక్ సమస్య రాకుండా ఆపగలదట.
ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం చాలా అవసరం. కరోనా వచ్చిన తర్వాత.. ఆరోగ్యంపై అందరికీ దృష్టి పెరిగిందనే చెప్పాలి. ఈ ఆరోగ్యాన్ని కాపాడుకునే క్రమంలో.. మంచి ఆహారం తీసుకోవడంతోపాటు.. శరీరానికి అంతో ఇంతో వ్యాయామం కూడా చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు.
అన్ని వ్యాయామాలలో కెల్లా.. నడక చాలా మంచిది. ఏ వయసువారికైనా నడక శరీరానికి చాలా మంచిది. ప్రతిరోజూ కనీసం 20 నిమిషాలు నడవాలట. దాని వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
నడక వల్ల శరీరం ఫిట్ గా ఉండటంతోపాటు.. ఎన్నో రకాల వ్యాధుల నుంచి తట్టుకునేలా చేస్తుందట. ప్రతిరోజూ నడవడం వల్ల కలిగే లాభాలేంటో ఒకసారి చూస్తే..
ప్రతిరోజూ 20 నిమిషాల నుంచి అరగంట సేపు నడవడం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయట. దాదాపు 19శాతం గుండె సమస్యలు రాకుండా ఆపగలదట.
వారానికి కనీసం రెండు గంటలు నడిచేవారిలో బుర్ర పనితీరు బాగుంటుందట. కనీసం 30శాతం బ్రెయిన్ స్ట్రోక్ సమస్య రాకుండా ఆపగలదట.
ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత కాసేపు నడవడం వల్ల రక్తంలోని షుగర్ రెగ్యులేట్ అవుతుంది. కనీసం భోజనం తర్వాత 15 నిమిషాలు నడవాలట.
ప్రతిరోజూ నడవడం వల్ల జాయింట్ పెయిన్స్ సమస్యతో బాధపడేవారికి ఆ సమస్య తగ్గుముఖం పడుతుందట. మజిల్స్ గట్టిపడటానికి ఇది సహాయం చేస్తుంది.
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతిరోజూ 45 నిమిషాల పాటు నడిచేవారు.. చాలా తక్కువగా రోగాల బారినపడుతుంటారట. నడక కారణంగా వారిలో రోగనిరోధక శక్తి తగ్గుముఖం పడుతుందట.
ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడిచేవారిలో ఓబేసిటీ వచ్చే అవకాశం దాదాపు 50శాతం తక్కువగా ఉంటుందట. అంతేకాదు... ప్రతిరోజూ నడిచేవారిలో బద్దకం అనేది ఉండదట. చాలా చురుకుగా ఉంటారట.
స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ.. ప్రతిరోజూ ఉదయాన్నే నడిచేవారిలో.. ఊపిరితిత్తుల సమస్య కూడా ఉండదట. ఆరోగ్యంగా ఉంటారట.