వామ్మో పసుపు నీళ్లను రోజూ తాగితే ఇలా అవుతుందా?
పసుపులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీని రంగు, ప్రయోజనాల వల్ల దీన్ని గోల్డెన్ స్పైస్ అని కూడా అంటుంటారు. అయితే పసుపు నీళ్లను అతిగా తాగడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
పసుపు నీళ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దగ్గు, జలుబు నుంచి జ్వరం వరకు ఎన్నో అనారోగ్య సమస్యలను పసుపు నీళ్లు తగ్గిస్తాయి. కానీ ఈ నీళ్లను అతిగా తాగడం అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది ఎన్నో రోగాల ముప్పును పెంచుతుంది. పసుపు నీళ్లను ఎంత తాగాలి? రోజూ తాగొచ్చా? రోజూ తాగితే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
)
Image: Getty
పసుపు వాటర్ మన శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించడానికి సహాయపడుతుంది. శరీరాన్ని నిర్విషీకరణ చేసేటప్పుడు, చర్మం, జీర్ణక్రియతో సహా వివిధ రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. కానీ ఈ వాటర్ ను ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.
)
Image: Getty Images
మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది
ఎంతో ప్రయోజనకరమైన ఈ మసాలా దినుసు గురించి గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం.. ఇది మూత్ర ఆక్సలేట్ స్థాయిని పెంచుతుంది. పసుపులో కరిగే ఆక్సలేట్ ఎక్కువగా ఉండే కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఈ ఆక్సలేట్లు కాల్షియంతో కలిసిపోతాయి. అలాగే కరగని కాల్షియం ఆక్సలేట్ ను ఏర్పరుస్తాయి. ఇది మూత్రపిండాల్లో రాళ్లకు కారణమవుతుంది. కాల్షియం ఆక్సలేట్ 75% మూత్రపిండాల్లో రాళ్లకు కారణం.
turmeric
పసుపు నీటిని డిటాక్స్ పానీయంగా తీసుకోవడం మంచిది. కానీ దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల సమస్యలు వస్తాయి. ఇవి ఎక్కువగా ఉండటం వల్ల మూత్ర ఆక్సలేట్ స్థాయిలు చాలా ప్రభావితం అవుతాయి. అలాగే సున్నితమైన వ్యక్తులలో మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. మీరు లిమిట్ లో ఈ వాటర్ ను తాగినప్పటికీ.. పసుపు అప్పటికీ తేలికపాటి దుష్ప్రభావాలను కలిగిస్తుంది. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం.. పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, విరేచనాలు, మైకము, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి.
ఇనుము శోషణ పరిమితం
మీ శరీరంలో ఇనుము లోపం ఉంటే.. పసుపును ఎక్కువగా తీసుకోకండి. ఎందుకంటే పసుపు ఈ పోషకం శోషణను మరింత తగ్గిస్తుంది. పబ్ మెడ్ సెంట్రల్ ప్రకారం.. ఎక్కువ మొత్తంలో మిరప, మిరియాలు, వెల్లుల్లి, ఆకు కూరలకు పసుపు జోడించడం వల్ల వాటి ఇనుము లభ్యత తగ్గుతుంది. లేదా మీ శరీరంలో ఉన్న ఇనుము మొత్తంలో 20 నుంచి 90 శాతం గ్రహిస్తుంది.
turmeric water health benefits
ఇనుము శోషణ పరిమితం
మీ శరీరంలో ఇనుము లోపం ఉంటే.. పసుపును ఎక్కువగా తీసుకోకండి. ఎందుకంటే పసుపు ఈ పోషకం శోషణను మరింత తగ్గిస్తుంది. పబ్ మెడ్ సెంట్రల్ ప్రకారం.. ఎక్కువ మొత్తంలో మిరప, మిరియాలు, వెల్లుల్లి, ఆకు కూరలకు పసుపు జోడించడం వల్ల వాటి ఇనుము లభ్యత తగ్గుతుంది. లేదా మీ శరీరంలో ఉన్న ఇనుము మొత్తంలో 20 నుంచి 90 శాతం గ్రహిస్తుంది.
రక్తంలో చక్కెర తక్కువగా ఉంటుంది
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. పసుపు డయాబెటిస్ ను నియంత్రించడానికి సహాయపడుతుంది. పసుపును మోతాదులో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం తగ్గుతుంది. ఇది మీ డయాబెటిస్ ను సమతుల్యంగా ఉంచుతుంది. కానీ పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ చాలా పడిపోతాయి. దీనివల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
వికారం, విరేచనాలు, తలనొప్పి
కొన్ని అధ్యయనాలు పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల దుష్ప్రభావాల గురించి చెబుతున్నాయి. ఒక వ్యక్తి క్రమం తప్పకుండా సూచించిన మొత్తం కంటే ఎక్కువ పసుపును తీసుకుంటుంటే వారు ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల విరేచనాలు, తలనొప్పి, చర్మ దద్దుర్లు వంటి సమస్యలు వస్తాయి.
పసుపు ఎంత సురక్షితం?
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. రోజుకు మీ శరీర బరువులో పౌండ్ కు 0.3 మి.గ్రా (కిలోకు 1–4 మి.గ్రా) పసుపు తీసుకోవడం సురక్షితం. మీరు పసుపు నీటిని డిటాక్స్ డ్రింక్ గా తీసుకుంటుంటే పసుపును ఎంత తీసుకుంటున్నారో తెలుసుకోండి.
ఇలా చేస్తే చంకల్లో చెమట అస్సలు పట్టదు
ఎండాకాలంలో కొద్దిసేపు బయట ఉన్నా చంకలు చెమటతో తడిసిపోతాయి. దీనివల్ల డ్రస్ పై మరకలు కూడా ఏర్పడతాయి. ముఖ్యంగా దుర్వాసన వస్తుంది. దీనివల్ల నలుగురిలోకి వెళ్లడానికి ఎంతో ఇబ్బంది పడతారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఎండాకాలంలో చంకల్లో చెమటలు పట్టడం చాలా సాధారణం. తక్కువ చెమట సర్వ సాధారణమే. కానీ చెమట ఎక్కువగా పట్టడమే ఆందోళన కలిగించే విషయం. చెమట దుస్తులపై మరకలు అయ్యేలా చేస్తుంది. చికాకు కలిగిస్తుంది. ముఖ్యంగా దుర్వాసన వచ్చేలా చేస్తుంది. అయితే కొన్ని చిట్కాలు చంకల్లో చెమటను తగ్గిస్తాయి.
)
sweating
చెమటను ఎలా ఆపాలి?
చంకల్లో చెమట శారీరక పని వల్ల వస్తుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సహాయపడుతుంది. శరీరం చాలా వేడిగా అయినప్పుడు శరీరాన్ని చల్లబరుస్తుంది. అయినప్పటికీ కొంతమందికి ఎక్కువ చెమట ఇబ్బందికరంగా ఉంటుంది. చంకల్లో ఎక్కువ చెమట పట్టకుండా ఉండేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
)
మంచి పరిశుభ్రత
అండర్ ఆర్మ్ చెమటను నియంత్రించడానికి సరైన పరిశుభ్రతను పాటించడం చాలా చాలా అవసరం. దుర్వాసనను కలిగించే బ్యాక్టీరియా పెరుగుదలను నివారించడానికి మీ అండర్ ఆర్మ్స్ ను యాంటీ బ్యాక్టీరియల్ సబ్బుతో క్రమం తప్పకుండా కడగండి. స్నానం చేసిన తర్వాత మీ చంకలను ను బాగా ఆరబెట్టండి.
యాంటీ పెర్స్పిరెంట్లను ఉపయోగించండి
డియోడరెంట్ల కంటే యాంటిపెర్స్పిరెంట్లను ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే ఇవి చెమట ఉత్పత్తిని తగ్గించడానికి సహాయపడతాయి. అల్యూమినియం క్లోరైడ్ కలిగి ఉన్న యాంటీ పెర్స్పిరెంట్లను వాడండి. ఇది చెమట గ్రంథులను నిరోధించడానికి సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు వీటిని పెట్టండి.
sweating
శ్వాసించే బట్టలు
చంకలకు గాలి చేరేలా, తేమను గ్రహించడానికి సహాయపడే పత్తి, నార లేదా వెదురు వంటి సహజ వస్త్రాలను వేసుకోండి. వేడి, తేమను ట్రాప్ చేసే నైలాన్ లేదా పాలిస్టర్ వంటి సింథటిక్ దుస్తులను వాడకండి. ఎందుకంటే ఇవి చెమట ఎక్కువ పట్టేలా చేస్తాయి.
summer sweat
ఒత్తిడిని తగ్గించండి
ఒత్తిడి, ఆందోళనలు కూడా చెమట ఎక్కువగా పట్టేలా చేస్తాయి. యోగా, ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు ఒత్తిడిని తగ్గిస్తాయి. అలాగే మీకు ఇష్టమైన పనులను చేసినా ఒత్తిడి తగ్గిపోతుంది.
ట్రిగ్గర్లను నివారించండి
మీ అండర్ ఆర్మ్స్ లో చెమట ఎక్కువగా పట్టడానికి కొన్ని రకాల ఆహారాలు కూడా కారణమవుతాయి. కారంగా ఉండే ఆహారాలు, కెఫిన్, ఆల్కహాల్, వేడి పానీయాలను తీసుకుంటే మీకు చంకల్లో చెమట ఎక్కువగా పడుతుంది. చెమటను తగ్గించడానికి వీటిని తీసుకోవడం తగ్గించండి. లేదా మొత్తమే తీసుకోకండి.
హైడ్రేట్ గా ఉండండి
పుష్కలంగా నీటిని తాగితే మీ శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. చెమటను కూడా తగ్గిస్తుంది. హైడ్రేట్ గా ఉండటానికి, మొత్తం శారీరక విధులను నిర్వహించడానికి రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీటిని తాగండి.
చెమట ప్యాడ్లు లేదా లైనర్లు
చెమటను గ్రహించడానికి, మీ బట్టలపై మరకలు కాకుండా ఉండేందుకు అబ్జార్బెంట్ ప్యాడ్లను మీ అండర్ ఆర్మ్ లో పెట్టండి. రోజంతా మిమ్మల్ని పొడిగా ఉంచడానికి ఇవి సహాయపడతాయి.
ఆరోగ్యకరమైన బరువును నిర్వహించండి
బరువు ఎక్కువగా ఉండటం వల్ల కూడా చెమట ఎక్కువగా పడుతుంది. సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మీ బరువు నియంత్రణలో ఉంటుంది. ఇది మీ అండర్ ఆర్మ్ చెమటతో సహా మొత్తం చెమటను తగ్గిస్తుంది.
బ్రెయిన్ ట్యూమర్ గురించి వీటిని అస్సలు నమ్మకండి
బ్రెయిన్ ట్యూమర్ గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి. దీనివల్ల ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
బ్రెయిన్ ట్యూమర్ గురించి అవగాహన పెంచడానికి, దీని చికిత్సలో పురోగతిని పెంచడానికి, వ్యాధితో సంబంధం ఉన్న భయాల్ని తొలగించడానికి ప్రతి సంవత్సరం జూన్ 8 న ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మెదడు కణితులను తేలిగ్గా తీసిపారేయడానికి లేదు. కానీ మెదడు కణితుల గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి. ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా.. బ్రెయిన్ ట్యూమర్స్ విషయంలో ఎలాంటి విషయాలను నమ్మకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
)
అపోహ 1: బ్రెయిన్ ట్యూమర్ పెద్దలను మాత్రమే వస్తుంది
వాస్తవం: బ్రెయిన్ ట్యూమర్ కేవలం పెద్దలకే కాదు పిల్లలకు కూడా వస్తుంది. నిర్ధారణ అయిన మొత్తం మెదడు కణితి కేసులలో సుమారు 3.9 శాతం 0-14 సంవత్సరాల పిల్లలలో సంభవిస్తాయి. అన్ని వయస్సుల వారు మెదడు కణితి సంకేతాలు, లక్షణాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలాగే వీలైనంత త్వరగా చికిత్స తీసుకోవాలి.
)
అపోహ 2: మొబైల్ ఫోన్లు బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశాన్ని పెంచుతాయి
వాస్తవం: మొబైల్ ఫోన్లను వాడితే మెదడు కణితుల ప్రమాదం పెరుగుతుందనడానికి సరైన శాస్త్రీయ ఆధారాలు లేవు. అయినప్పటికీ రేడియేషన్ కు ఎక్కువ కాలం గురికావడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి సెల్ ఫోన్ వాడకం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
అపోహ 3: ప్రతి బ్రెయిన్ ట్యూమర్ రోగికి ఇలాంటి లక్షణాలే ఉంటాయి
వాస్తవం: బ్రెయిన్ ట్యూమర్ రోగులందరికీ ఒకే రకమైన సంకేతాలు, లక్షణాలు ఉంటాయని చాలా మంది నమ్ముతారు. కానీ అది నిజం కాదు. కణితి పరిమాణం, సైట్, గ్రేడ్ ను బట్టి లక్షణాలు వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటాయి. అయితే, కొన్ని సాధారణ లక్షణాలు తలనొప్పి, వికారం, అలసట మొదలైనవి ఉన్నాయి.
<p>brain tumor</p>
అపోహ 4: మెదడు కణితి జన్యుపరమైనది
వాస్తవం: కుటుంబంలో ఎవరికైనా బ్రెయిన్ ట్యూమర్ ఉంటే మిగతా వాళ్లకు కూడా బ్రెయిన్ ట్యూమర్ వస్తుందని చాలా మంది నమ్ముతారు. కానీ దీనికి సరైన ఆధారాలు లేవు. పర్యావరణ లేదా జీవనశైలి కారకాలే మెదడు కణితికి ప్రధాన కారణాలు. కానీ ఇది వ్యాధి అభివృద్ధి చెందే ప్రమాదాన్ని పెంచుతుందని కనుగొన్నారు. అందుకే ఇలాంటి వారు మెదడు ఎంఆర్ఐ, బయాప్సీ, కొన్ని ఇతర ప్రత్యేక పరీక్షలు చేయించుకోవాలి.
అపోహ 5: మెదడు కణితులు క్యాన్సర్
వాస్తవం: బ్రెయిన్ ట్యూమర్స్ అన్నీ క్యాన్సర్ అని చాలా మంది నమ్ముతారు. కానీ ఇది నిజం కాదు. మెదడు కణితులలో మూడింట ఒక వంతు మాత్రమే క్యాన్సర్ బారిన పడుతున్నారు. సకాలంలో ఇది నిర్ధారణ అయితే మెదడు కణితులను సరైన చికిత్సతో నయం చేయొచ్చు. క్యాన్సర్ లేని మెదడు కణితులు శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే ప్రమాదం తక్కువగా ఉన్నప్పటికీ.. ఇవి కూడా లక్షణాలను కలిగిస్తాయి
అపోహ 6: మెదడు కణితులు ప్రాణాంతకం
వాస్తవం: మెదడు కణితులు తీవ్రంగా ఉంటాయి. కానీ అవన్నీ ప్రాణాంతకం కాదు. రోగ నిరూపణ కణితి రకం, స్థానం, పరిమాణం, వ్యక్తి మొత్తం ఆరోగ్యం వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. కొన్ని మెదడు కణితులు నెమ్మదిగా పెరుగుతాయి. వీటికి చికిత్స చేయొచ్చు.
అపోహ 7: మెదడు కణితులు అంటువ్యాధి
వాస్తవం: మెదడు కణితులు అంటువ్యాధులు కావు. అవి ఏ రకమైన పరిచయం లేదా ముట్టుకోవడం వల్ల వ్యక్తి నుంచి వ్యక్తికి అస్సలు వ్యాప్తి చెందవు.