చింతపండు-వెల్లుల్లి రసం.. యమ్మీ అండ్ హెల్తీ.. కరోనా చింత ఇక దూరం....
చింతపండు, వెల్లుల్లితో తయారయ్యే రుచికరమైన రసం కరోనా వైరస్ తో పోరాడే రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వంటింట్లో నిత్యం లభించే ఈ రెండు పదార్థాలు ఇమ్యూనిటీ బూస్టర్లుగా సూపర్ గా పనిచేస్తాయంటున్నారు.
చింతపండు, వెల్లుల్లితో తయారయ్యే రుచికరమైన రసం కరోనా వైరస్ తో పోరాడే రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వంటింట్లో నిత్యం లభించే ఈ రెండు పదార్థాలు ఇమ్యూనిటీ బూస్టర్లుగా సూపర్ గా పనిచేస్తాయంటున్నారు.
ఈ రుచికరమైన రసం జీర్ణాశయానికి ఎంతో మంచిది. దీంతోపాటు రోగనిరోధక శక్తినీ పెంపొందిస్తుంది. ఇది తయారు చేయడం కూడా సులభం. పెద్దగా వస్తువులు అవసరం లేదు. ముఖ్యంగా పప్పు ధాన్యాలు వాడకుండా చేసే రసం ఇది.
దీన్ని నేరుగా తాగినా, లేదా వేడి వేడి అన్నంలో కలుపుకుని తిన్నా ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు.
చింతపండు-వెల్లుల్లి రసం తయారీకి కావాల్సిన పదార్థాలు...
1 టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు
1 సన్నగా తరిగిన టమోటా
10-12 కరివేపాకులు
1-2 టేబుల్ స్పూన్ల నల్ల మిరియాలు
4-5 వెల్లుల్లి రెబ్బలు
సగం టీస్పూన్ పసుపు
2 ఎండుమిర్చి
రుచికి తగినంత ఉప్పు
1 టీస్పూన్ జీలకర్ర
సగం టీస్పూన్ ఇంగువ
1 టేబుల్ స్పూన్ తరిగిన తాజా కొత్తిమీర
1 టేబుల్ స్పూన్ నూనె
1 టీస్పూన్ ఆవాలు
చింతపండు-వెల్లుల్లి రసం తయారీ విధానం
ముందుగా స్టౌ మీద ఒక పాన్ పెట్టుకుని ఎండుమిర్చి, నల్ల మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి 4-5 కరివేపాకు రెబ్బలు నూనె లేకుండా వేయించాలి. వీటిని మిక్సీలో వేసి కాస్త బరుకుగా రుబ్బుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి, ఒక బాణాలిలో నూనె వేడి చేసి, తరిగిన టమోటాలు, మిగిలిన కరివేపాకు, పసుపు, కొంచెం ఉప్పు వేసి 3-4 నిమిషాలపాటు ఉడికించాలి.
తరువాత దీనికి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసి బాగా కలపాలి. తరువాత చింతపండు గుజ్జు, 2 కప్పుల నీరు పోసి మూత పెట్టేయాలి. చిన్న మంట మీద ఇలా పది నిమిషాల పాటు చారును మరగనివ్వాలి.
ఇప్పుడు మరో పాన్ లో కొంచెం నూనె (లేదా నెయ్యి) వేసి, అది వేడెక్కాక ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ,ఆవాలు, జీలకర్ర వేసి కాస్త చిటపటలాడక.. మరిగిన రసానికి కలపాలి.
ఇప్పుడు మంటను ఆర్పేసి రసానికి తాజా కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. మీదినుంచి మిరియాల పొడి చల్లుకోవాలి.
ఈ రసాన్ని సాదాగా అలాగే తాగొచ్చు లేదా భోజనంలో అన్నంతో పాటు తినొచ్చు.
చింతపండు-వెల్లుల్లి రసం తయారీలో ఉపయోగించే పదార్థాలు రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి. చింతపండు, పసుపు, కరివేపాకు ఫంగల్ ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుంది.
ఇక వెల్లుల్లి విషయానికొస్తే, రోగనిరోధక వ్యవస్థను వృద్ది చేయడంలో దీని లక్సణాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వెల్లుల్లి జలుబుతో సహా అనేక రకాల అనారోగ్యాలతో పోరాడుతుంది.