రజనీకాంత్ పేరుతో దారుణమైన చీటింగ్..యువతి వద్ద ఏకంగా 4 లక్షల దోపిడీ, ఎలా జరిగిందంటే
సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ చిత్రంతో ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేశారు. రజనీ స్టయిల్ లో ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్న అభిమానులకు జైలర్ చిత్రం ఫుల్ మీల్స్ లా అనిపించింది.
Lokesh Kanagaraj
సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ చిత్రంతో ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేశారు. రజనీ స్టయిల్ లో ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్న అభిమానులకు జైలర్ చిత్రం ఫుల్ మీల్స్ లా అనిపించింది. ఆ తర్వాత వచ్చిన లాల్ సలామ్ దారుణమైన ఫ్లాప్ గా నిలిచినప్పటికీ అది పూర్తి స్థాయి రజనీకాంత్ చిత్రం కాకపోవడంతో ఫ్యాన్స్ లైట్ తీసుకున్నారు.
Lokesh Kanagaraj
ఇప్పుడు తలైవర్ ఫ్యాన్స్ ఫోకస్ మొత్తం లోకేష్ కనకరాజ్ చిత్రంపైనే ఉంది. లోకేష్ కనకరాజ్ తలుచుకుంటే రజనితో వండర్స్ క్రియేట్ చేయొచ్చు. దీనితో ఈ ప్రాజెక్టు పై కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి. ఆల్రెడీ అఫీషియల్ అనౌన్సమెంట్ వచ్చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్లు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ క్రేజీ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ ని వాడుకుంటూ కొందరు సైబర్ నేరగాళ్లు ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా బెంగుళూరులో సంచలన సంఘటన వెలుగులోకి వచ్చింది. రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ చిత్రంలో ఎలాగైనా అవకాశం దక్కించుకోవాలని చాలా మంది వర్తమాన నటీనటులు ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వారిని టార్గెట్ చేస్తూ కొందరు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు.
తలైవర్ 171 చిత్రంలో నటించేందుకు నటీనటులు కావాలంటూ ఒక ఆడిషన్ పోస్ట్ బెంగుళూరులో వైరల్ అయింది. రజనీకాంత్ సినిమా కావడంతో చాలా మంది ఆ పోస్ట్ లో ఉన్న అడ్రెస్ కి వెళ్లారు. అక్కడ వారికి కాస్టింగ్ డైరెక్టర్స్ పేరుతో కొందరు వ్యక్తులు పరిచయం అయ్యారు. ఆడిషన్స్ కి వెళ్లిన వారి దగ్గర భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నారు.
మృదుల అనే యువతి నుంచి సురేష్ కుమార్ అనే వ్యక్తి ఏకంగా 4 లక్షలు తీసుకున్నాడట. డబ్బు ఇచ్చిన తర్వాత తాను మోసపోయినట్లు మృదుల గ్రహించింది. వెంటనే పోలీసులని ఆశ్రయించింది. రజనీకాంత్ సినిమా అనే సరికి తాను మోసపోయినట్లు పోలీసుల వద్ద మొరపెట్టుకుంది. దీనితో బెంగుళూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అధికారికంగా ప్రకటన వస్తేనే స్పందించండి అని నిర్మాతలు తరచుగా హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ ఎలాగైనా సినిమా ఆఫర్ పొందాలనే ఉద్దేశంతో కొందరు ఇలా కేటుగాళ్ల చేతిలో మోసపోతున్నారు.