సమంతనే నాగచైతన్య ఎందుకు ప్రేమించాడు?.. సమంత ఆన్సర్కి చైతూకి మైండ్ బ్లాంక్ !
నాగచైతన్య, సమంత ప్రేమించుకుని పెళ్లి చేసుకుని విడిపోయారు. దాదాపు ఏడేళ్ల ప్రేమ, నాలుగేండ్ల వైవాహిక జీవితం అనంతరం వీరిద్దరు తమ బంధానికి బ్రేక్ చెప్పారు. మరి చైతూ, సమంతనే ఎందుకు ప్రేమించాడంటే.. వారి సమాధానం ఏంటో తెలిస్తే పిచ్చెక్కిపోవాల్సిందే.

సమంత, నాగచైతన్య విడిపోయి రెండేళ్లు అవుతుంది. ఇప్పుడు ఎవరికి వారు కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. అనేక స్ట్రగుల్స్ అనంతరం సమంత కూడా ఇప్పుడు మామూలుగా మారిపోయింది. వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే నాగచైతన్య.. సమంతనే ఎందుకు ప్రేమించాడనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీనికి చైతూ ప్రశ్న, సమంత ఆన్సర్, దీనికి చైతూ రియాక్షన్ హైలైట్గా, హాట్ టాపిక్ గా మారింది. ఓ టీవీ షోస్లో నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ కలిసి పాల్గొన్నారు. ప్రదీప్ యాంకర్గా ఉన్నారు.
ఇందులో షో మధ్యలోనే సమంతకి ఫోన్ చేశాడు చైతూ. లౌడ్ స్పీకర్ పెట్టి మరీ.. `ప్రపంచంలో ఇంత మంది అందమైన అమ్మాయిలు ఉండగా నేను సమంతనే ఎందుకు ప్రేమించాను` అని తన లవర్(అప్పుడికి ఇంకా పెళ్లి కాలేదు)ని ప్రశ్నించాడు నాగచైతన్య. దీనికి సమాధానంగా సామ్ స్పందిస్తూ, `ఎందుకంటే నేను నీకు ఆప్షన్ ఇవ్వలేదు` అంటూ క్రేజీ ఆన్సర్ ఇచ్చింది సమంత. దీనికి నాగచైతన్య స్పందిస్తూ, నాకు ఇంకో ఆప్షన్ కూడా వద్దులే అని చెప్పడంతో `ఐ లవ్యూ` అని చెప్పింది సామ్. దీంతో అంతా హోరెత్తిపోయింది. ఇది `రారండోయ్ వేడుక చూద్దాం` సినిమా టైమ్లో జరిగిన కన్వర్జేషన్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ అవుతుంది. చైతూ ఫ్యాన్స్ దీన్ని ట్రెండ్ చేస్తున్నారు. దీంతో నెట్టింట హల్చల్ చేస్తుంది.
నాగచైతన్య, సమంత కలిసి మొదట `ఏం మాయ చేశావే` చిత్రంతో మొదట కలిసి నటించారు. వీరిద్దరు కలిసినప్పుడు పెద్దగా ఒపీనియన్ ఏం లేదు. కానీ ఓ హెయిర్ సెలూన్ షాప్లో చూసినప్పుడు మాత్రం ఈ ఇద్దరు మధ్య ఓ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయ్యిందట. ఆ తర్వాత క్రమంగా సినిమా చేసే క్రమంలో ఆ పరిచయం ఫీలింగ్లా మారి, ప్రేమకి దారి తీసిందట. వెంటనే వీళ్లేం కలిసి తిరగలేదు. ఘాటు ప్రేమలో మునిగిపోలేదు. క్రమంగా వీరి ప్రేమ బలపడింది. అయితే ఇది చైతూకి రెండో సినిమా కాగా, సమంతకి తొలి చిత్రం. దీంతో ఆ ప్రభావం సమంతపై చాలా ఉందని చెప్పొచ్చు.
ఈ ఇద్దరు కలిసి `ఏమాయ చేశావే` చిత్రం తర్వాత `మనం`, `ఆటోనగర్ సూర్య`, చిత్రాల్లో నటించారు. `మనం` అక్కినేని ఫ్యామిలీ కలిసి నటించింది. ఇది ఓ క్లాసిక్ మూవీగా నిలిచింది. ఇందులో చైతూకి వైఫ్గా నటించింది. ఈ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ మరింత పెరిగింది. రాను రాను పీక్లోకి వెళ్లింది. అయితే మధ్యలో సమంత.. సిద్ధార్థ్తోనూ ప్రేమలో పడిందని, కొన్నాళ్లపాటు డేటింగ్ అనంతరం బ్రేకప్ చెప్పారనే వార్తలొచ్చాయి.
కానీ ఆ తర్వాతనే చైతూతో సమంత ప్రేమ పడిందనే వార్తలు స్టార్ట్ అయ్యింది. దానికి తగ్గట్టే ఈ ఇద్దరు కలిసి తిరిగారు. తమ ప్రేమని పెద్దల వరకు తీసుకెళ్లారు. అనేక సంఘర్షణ అనంతరం ఈ ఇద్దరి ప్రేమకి నాగార్జున ఫ్యామిలీ ఓకే చెప్పింది. దీంతో 2017 అక్టోబర్6,7 తేదీలో గ్రాండ్గా వీరిద్దరి వివాహం జరిగింది. ఇటు హిందూ సాంప్రదాయం ప్రకారం, అటు క్రిస్టియన్ ట్రెడిషన్లోనూ వీరు పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఈ ఇద్దరు అన్యోన్య దంపతులుగా రాణించారు. ఆదర్శ జంటగానూ పేరు తెచ్చుకున్నారు.
ఊహించని విధంగా ఈ ఇద్దరి మధ్య భేదాభిప్రాయలు ప్రారంభమయ్యాయి. ఫ్యామిలీ విలువలు, ఫ్యాషన్కి మధ్య చోటు చేసుకున్న సంఘర్షణ ఫలితంగా చైతూ, సమంత విడిపోవాల్సి వచ్చిందని తెలిసిన సమాచారం. సమంతపై అక్కినేని ఫ్యామిలీ పెట్టిన కొన్ని ఫ్యామిలీ నిబంధనలే దీనికి కారణమనే వాదన వినిపిస్తుంది. ఇది మనకు అందిన సమాచారం. కానీ వీరి డైవర్స్ కి కారణమేంటనేది మాత్రం వారికే తెలియాలి.