- Home
- Entertainment
- శ్రీదేవికి , చిరంజీవికి మధ్య గొడవ, మధ్యలో ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా? అసలేం జరిగింది.
శ్రీదేవికి , చిరంజీవికి మధ్య గొడవ, మధ్యలో ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా? అసలేం జరిగింది.
Chiranjeevi , Sridevi: శ్రీదేవి చిరంజీవి జంటగా వచ్చిన సినిమాలు చాలా తక్కువ. కాని ఇద్దరి కాంబోకు మంచి క్రేజ్ మాత్రం ఉండేది. వీరిద్దరు కలిసి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈమూవీ అంటే ఇప్పటికీ క్రేజ్ పోలేదు జనాల్లలో . టీవీల్లో ప్లే అయితే వందలకుండా చూస్తుంటారు అభిమానులు. ఇలాంటి బ్లాక్ బస్టర్ కాంబో మధ్య ఓ సందర్భంలో గొడవలు వచ్చాయంటే ఎవరైనా నమ్ముతారా? అవును చిరంజీవి, శ్రీదేవి మధ్య మనస్పర్ధలు రావడం వల్ల ఓ సినిమానే ఆగిపోయిందట. ఇంతకీ ఆ సినిమా ఏంటి? అసలు విషయం ఏంటి?
- FB
- TW
- Linkdin
Follow Us
)
Chiranjeevi, Sridevi
Chiranjeevi , Sridevi: మెగాస్టార్ చిరంజీవి , శ్రీదేవి ఈ ఇద్దరి కాంబినేషన్ లో కొన్ని సినిమాలు వచ్చినా...అందులో అందరు గుర్తుపెట్టుకునేది, ఎప్పటికీ మర్చిపోలేని సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈసినిమా తరువాతే శ్రీదేవికి అతిలోక సుందరి అనే బిరుదు కూడా వచ్చింది. టాలీవుడ్ లో చిరంజీవి కంటేముందే స్టార్ డమ్ సాధించింది హీరోయిన్ శ్రీదేవి. ఆమె సినిమాల్లో విలన్ పాత్రలు కూడా చేశారు చిరంజీవి. ఆతరువాత జోడీగా వీరి కాంబో సూపర్ హిట్ అయ్యింది. ఎస్ పి పరశురామ్, జగదేక వీరుడు లాంటి సినిమాలు ఈ ఇద్దరు స్టార్స్ ను సూపర్ పెయిర్ గా మార్చాయి.
Also Read: 8000 కోట్లకు అధిపతి, 300 కోట్ల ఇంటిని రోజుకు 2 లక్షలకు అద్దెకిస్తున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లాంటి హీరోల జోడీగా నటించిన శ్రీదేవి ఆతరువాత చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లతో కూడా జతకట్టింది. ఇక వెంటనే బాలీవుడ్ లో అడుగు పెట్టి అక్కడ కూడా వెలుగు వెలిగింది సీనియర్ తార.ఇది ఇలా ఉంటే ఓ సందర్భాంలో మెగాస్టార్ చిరంజీవికి, శ్రీదేవికి మధ్య గొడవలు జరిగి.. ఓ సినిమానే ఆగిపోయిందట. ఇంతకీ ఆ సినిమా ఏదో తెలుసా? ఆ సినిమా పేరు వజ్రాల దొంగ. ఈ సినిమాను శ్రీదేవి స్వయంగా నిర్మించాలని ప్లాన్ చేసుకున్నారట.
Also Read: 5000 పాటల షూటింగ్ జరిగిన గ్రామం, రామోజీ ఫిల్మ్ సిటీని మించిన లొకేషన్, ఎక్కడుందో తెలుసా?
Chiranjeevi, Sridevi
స్టార్ హీరోయిన్ గా మంచి పేరు రావడం... చేతి నిండా డబ్బులు ఉండటంతో నిర్మాత అవతారం ఎత్తింది శ్రీదేవి. తనకు ఎంతో ఇష్టమైన తెలుగు సినీపరిశ్రమలో ఓ మంచి సినిమా చేయాలి అని అనుకుంది. చిరంజీవి హీరోగా సినిమా స్టార్ట్ అయ్యింది కూడా. వజ్రాల దొంగ టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. కాని నిర్మాతగా ఉన్న శ్రీదేవి హీరోయిన్ పాత్రను హైలెట్ చేస్తూ సినిమాను డిజైన్ చేశారట. అయితే హీరోగా ఉన్న చిరంజీవి కూడా తన పాత్ర ఇంపార్టెన్స్ తగ్గకుండా జాత్రత్తగా అడుగులు వేశార. ఇక ఈ విషయంలోనే ఇద్దరి మధ్యమాటటింపులు వచ్చినట్టు తెలుస్తోంది.
Chiranjeevi, Sridevi
దాంతో ఈ విషయంలో ఇద్దరు తగ్గలేదట. ప్రత్యక్ష్యంగా ఎదురుపడి తిట్టుకున్నది లేదు కాని.. సినిమా విషయంలో నేనుప్రొడ్యూసర్ ని అని ఆమె.. స్టార్ హీరోను కదా అని చిరంజీవి ఎవరు తగ్గలేదు. దాంతో ఓ పాట షూటింగ్ కూడా జరిగిన తరువాత వజ్రాల దొంగ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇక ఆసినిమా ఆతరువాత మళ్లీ పట్టాలెక్కలేదు. అంతే కాదు శ్రీదేవి కూడా మళ్లీ ప్రొడ్యూసర్ గా సినిమాలు కూడా చేయలేదు. ఇలా చిరంజీవి, శ్రీదేవి మధ్య జరిగిన ఓ గొడవల వల్ల ఓ సినిమా ఆగిపోయిందని ఓ సీనియర్ సినిమా జర్నలిస్ట్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.