సివియర్ గ్యాస్ట్రిటిస్ తో అల్లు అర్జున్ ఇబ్బందిపడుతున్నారు
అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి నటించిన 'తండేల్' ప్రీ-రిలీజ్ ఈవెంట్కు అల్లు అర్జున్ హాజరు కాలేకపోవడానికి గల కారణాన్ని అల్లు అరవింద్ వివరించారు. బన్నీకి అనారోగ్యం కారణంగా ఈవెంట్కు దూరంగా ఉన్నట్లు తెలిపారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
‘తండేల్ జాతర ఈవెంట్కి బన్నీ గెస్టుగా రావాల్సి ఉంది. కానీ ఫారెన్ నుంచి వచ్చాడు. చాలా సివియర్గా గ్యాస్ట్రిటిస్ వచ్చింది.. అందుకే రాలేకపోయాడు.. మీ అందరికీ ఈ విషయం చెప్పమన్నాడు.. దయచేసి ఎవరూ అపార్థం చేసుకోకండి’ అని అల్లు అరవింద్ చెప్పారు.
అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. చందు మొండేటి దర్శకుడు. ఈ నెల 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించింది.
తండేల్ జాతర ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రానున్నాడని చిత్ర టీమ్ అధికారికంగా ప్రకటించింది. దీంతో అభిమానులు కూడా తండేల్ ఈవెంట్ పై బాగా ఆసక్తి చూపించారు.
పుష్ప 2 లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ వస్తున్న తొలి మూవీ ఈవెంట్ కావడంతో బన్నీ ఏం మాట్లాడుతాడోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే చివరి నిమిషంలో తండేల్ జాతర నుంచి తప్పుకున్నాడు బన్నీ. దీనికి గల కారణాన్ని నిర్మాత అల్లు అరవింద్ వివరించారు.
Allu Arjun
అరవింద్ మాట్లాడుతూ.. ‘తండేల్’ సినిమా చాలా గొప్పగా ఉంటుంది. ఏడో తారీఖున అందరూ థియేటర్లకు రండి. దుల్లగొట్టేద్దాం. సినిమా గురించి చాలా మాట్లాడనుకున్నాను. సక్సెస్ మీట్లో మాట్లాడతాను’ అని అల్లు అరవింద్ తెలిపారు.
నాగచైతన్య మాట్లాడుతూ ‘నా మనసులో గీతా ఆర్ట్స్కు ప్రతే ్యక స్థానం ఉంది. ఈసినిమా పూర్తయ్యే సమయానికి వాసు, అరవింద్ గారు లేకుండా మరో సినిమా ఎలా చేయాలా అనే భయం నాలో మొదలైంది. వారు అంతలా సపోర్ట్ చేశారు. నా మంచి కోరే వ్యక్తి చందు. సినిమాలో శ్రీకాకుళం యాసలో మాట్లాడడం సవాల్గా అనిపించింది. సాయిపల్లవి వ్యక్తిత్వం గొప్పది. తండేల్ సినిమా కోసం మత్స్యకార గ్రామాలకు వెళ్లి అధ్యయనం చేశాను. వాళ్లు లేకుండా ‘తండేల్’ సినిమా లేదు. థియేటర్స్లో దుల్లగొట్టేద్దాం’ అన్నారు.