మురళీ మోహన్ చెప్పిన కోతి-వ్యాపారి కథ విన్నారా.? వ్యాపారం అంటే ఇలా ఉంటుందా.?
మురళీ మోహన్ ఈ పేరు వినగానే కొందరికీ సినిమాలు గుర్తొస్తే మరికొందరరికి మాత్రం రియల్ ఎస్టేట్ గుర్తొస్తుంది. జయభేరి పేరుతో మురళీ మోహన్ ఎన్నో వెంచర్స్, అపర్ట్మెంట్స్ను నిర్మించారు. మంచి నటుడిగానే కాకుండా గొప్ప వ్యాపారవేత్తగా కూడా ఆయనకు మంచి పేరుంది. అయితే ఆయన ఫిలాసఫి కూడా విభిన్నంగా ఉంటుంది..
- FB
- TW
- Linkdin
Follow Us
)
స్టాక్ మార్కెట్.. చాలా మందికి తెలియని, నచ్చని సబ్జెక్ట్. కానీ ఇందులో మెలుకువలు తెలిసిన వారు మాత్రం భారీగా లాభాలు ఆర్జిస్తుంటారు. మార్కెట్ స్థితిగతులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి? అనే వాటిపై క్లారిటీతో ఉంటారు. కానీ ఇందులో నష్టపోయిన వారు కూడా చాలా మంది ఉన్నారు.
అయితే రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా రాణించి మురళీ మోహన్ స్టాక్మార్కెట్లో మాత్రం ఎప్పుడూ పెట్టుబడి పెట్టలేదంటా. దీనికి గల కారణాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆయన స్పష్టంగా తెలిపారు. స్టాక్మార్కెట్లో ఎందుకు డబ్బులు వస్తాయో ఎందుకు పోతాయో ఎవరికీ తెలియదని. దీనికి సరిగ్గా సరిపోయే ఓ కథను పంచుకున్నారు. ఇంతకీ ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
monkey
ఓ పల్లెటూరులోకి ఓ వ్యాపారి వచ్చి ఊరిలో ఉన్న వారికి ఒక ఆఫర్ ఇస్తాడు. తనకు కోతులను ఇస్తే ఒక్కో కోతికి రూ. 10వేలు ఇస్తానని చెప్తాడు. దీంతో చాలా మంది అతని మాటలు నమ్మరు. అయితే ఓ నలుగురు మాత్రం వ్యాపారి చెప్పినట్లు కోతులు తెస్తారు. దీంతో ఆ వ్యాపారి తలా రూ. 10 వేలు ఇచ్చి వెళ్లిపోతాడు. దీంతో గ్రామప్రజలంతా అరే.. మనం కూడా ఇస్తే బాగుండేది అని తెగ ఫీలవుతారు.
మరో నెల రోజుల తర్వాత మళ్లీ వచ్చిన వ్యాపారి ఈసారి ఏకంగా రూ. 15 వేలు ఆఫర్ చేస్తారు. దీంతో ఊరిలో ఉన్న వారంతా తెగ కష్టపడి పెద్ద మొత్తంలో కోతులను పట్టుకొస్తారు. వారందరికీ రూ. 15 వేలు ఇచ్చేసి వెళ్లిపోతాడు.
ఇక మూడోసారి వచ్చిన వ్యాపారి 'నాకు కోతులు ఇంకా కావాలి. ఈసారి రూ. 25వేలు ఇస్తా అంటాడు'. అయితే అప్పటికే ఊరిలో ఉన్న కోతులన్నాయి అయిపోతాయి. కోతుల కోసం తెగ వెతుకుతుంటారు. పక్కనే ఉన్న ఊరిలో ఓ వ్యక్తి కోతులు అమ్ముతున్నారన్న విషయాన్ని తెలుసుకున్న గ్రామస్థులు అక్కడికి వెళ్తారు. అక్కడ ఒక్కో కోతి రూ. 23 వేలకు విక్రయిస్తుంటాడు. రూ. 2 వేలు లాభం వస్తుంది కదా అని మొత్తం కోతులను కొనుగోలు చేస్తారు. ట్విస్ట్ ఏంటంటే అక్కడ ఆ కోతులను విక్రయిస్తున్న వ్యక్తి గ్రామంలోకి వచ్చిన ఆ వ్యాపారి మనిషే.
ఇలా గ్రామస్థుల దగ్గర రూ. 10, రూ. 15 వేలకు కొనుగోలు చేసిన కోతులనే మళ్లీ తిరిగి అదే గ్రామస్థులతో రూ. 23 వేలకు కొనుగోలు చేయించాడు. ఇదిగో స్టాక్ మార్కెట్ వ్యవహారం కూడా ఇలాగే అస్సలు అర్థం కాకుండా ఉంటుందని అందుకే తానెప్పుడు వాటి జోలికి వెళ్లనని మురళీ మోహన్ చెప్పుకొచ్చాడు.