షాక్: 'బిగ్ బాస్ 4 ' కంటెస్టెంట్స్ లో ఎక్కువ పే చేస్తోంది ఆమెకే!
మా టీవీలో హీరో నాగార్జున హోస్ట్గా ఆదివారం ప్రారంభమైన బిగ్ బాస్ రియాలిటీ షో రాయల్టీగా మొదలైంది. ఈ సీజన్లో మొత్తం 16 మంది కంటెస్టెంట్లు హౌజ్లోకి అడుగుపెట్టారు. వీరందరినీ ముందు 16 రోజులపాటు క్వారంటైన్లో ఉంచి ఆ తరవాత కొవిడ్ టెస్టులు చేసి హౌజ్లోకి పంపినట్టు నాగార్జున చెప్పారు. తాను కూడా కరోనా వైరస్ పరీక్ష చేయించుకున్నానని, నెగిటివ్ అని తేలిన తరవాతే బిగ్ బాస్ వేదికపైకి వచ్చానని నాగార్జున స్పష్టం చేశారు. ఈ షో లో పాల్గొన్నందుకు ...రోజుకు ఇంతని ..టీవి ఛానెల్ వారు పే చేస్తూంటారు. ఈ క్రమంలో ఎవరికి ఎక్కువ పే చేస్తున్నారనేది చర్చనీయాంశంగా ప్రతీ సారి మారుతూనే ఉంటుంది.
అందుతున్న సమాచారం ప్రకారం ఈ సారి ..యాంకర్ లాస్య కు ఎక్కువ రెమ్యునేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెకు రోజుకు లక్ష చొప్పున నిర్వాహకులు పే చేస్తున్నారు. అందుకు కారణం ఆమెకు ఉన్న పాపులారిటనే అని చెప్తున్నారు.
కడప జిల్లాకి చెందిన ప్రముఖ సినీ యాంకర్ లాస్య సినీ, టీవీ షో లతో పాపులర్ అయ్యింది. లాస్యది వైఎస్ఆర్ జిల్లా, వీరబల్లి మండలం గడికోట గ్రామం స్వస్థలం.
లాస్య తండ్రి పేరు వీరబల్లి నరసింహారెడ్డి. జెమిని టీవీలో అంకితం లైవ్ షో ద్వారా కెరీర్ను ప్రారంభించిన లాస్య.. ఆ తరువాత మా టీవీ లో చేసిన సమ్థింగ్ స్పెషల్ అనే ప్రోగ్రాం ద్వారా మంచి పేరు సంపాదించుకుంది.
ఇప్పుడు అదే మాటీవీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షోకి వెళ్లడం నిజంగా విశేషమనే చెప్పుకోవాలి. ఈటీవీ లో ప్రారంభమైన ఢీ షో లాస్య కు మరో మెట్టు పైకి ఎక్కించింది.
అనేక ఈవెంట్లకు యాంకర్గా పనిచేసిన లాస్య పద్ధతిగా తనదైన స్టైల్ లో అభిమానుల ఆదరణతో సినీ, టీవీ ఇండస్ట్రీ లో ఎటువంటి బాక్ గ్రౌండ్ లేకుండా స్వశక్తితో ఎదిగింది. లాస్య ఇప్పుడు బిగ్ బాస్ షో లోకి వెళ్లడం పట్ల వైఎస్ఆర్ జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాగా లాస్య తన జీవితంలో రెండుసార్లు పెళ్లి చేసుకుంది. తాను ప్రేమించిన మంజునాథ్తో 2010లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. తర్వాత పెద్దలను ఒప్పించి 2017లో మరోసారి అందరి సమక్షంలో భర్తతో ఏడడుగులు నడిచింది. పెళ్లి చేసుకున్నాక బుల్లితెరకు దూరమైన లాస్య చాలా సంవత్సరాలకు మళ్లీ ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమైంది.
ఇంజనీరింగ్ అయ్యాక ఏదైనా సాధించాలని కలలు గనేది లాస్య. అలా అనుకోకుండా బుల్లితెరపై యాంకర్గా ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే పక్కింటి అమ్మాయిగా స్థిరపడిపోయింది. పెళ్లి చేసుకున్నాక టీవీకి దూరమైన లాస్య చాలా సంవత్సరాలకు మళ్లీ ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమైంది.
కానీ మళ్లీ చీమ ఏనుగు జోక్స్ చెప్తూ అందరినీ భయపెట్టిస్తోంది. తానేంటో చూపించడానికి బిగ్బాస్ హౌస్కు వచ్చానంటోంది. ఇలాగే చలాకీగా ఉంటూ కంటెస్టెంట్లను తనవైపు తిప్పుకుని బిగ్బాస్లో ఎలా ప్రయాణం సాగిస్తుందో చూడాలంటున్నారు ఆమె ఫ్యాన్స్.
గత మూడు సీజన్లతో పోలిస్తే ఈసారి ‘బిగ్ బాస్’కు అంత హైప్ కనిపించట్లేదనే సంగతి తెలిసిందే. కరోనా విపత్తుతో సహా ఇందుకు కారణాలు అనేకం. వాస్తవానికి గత ఏడాది నాగ్ హోస్టింగ్ స్కిల్స్ విషయంలో డివైడ్ రెస్పాన్స్ వచ్చింది.
మళ్లీ ఈ ఏడాది కూడా ఆయనే కొనసాగడంతో కొంత ఇంట్రస్ట్ ని తగ్గించింది. ఎవరైనా మరో స్టార్ కొత్త హోస్ట్ గా వస్తాడా.. పోనీ మళ్లీ ఎన్టీఆర్ను ఏమైనా చూస్తామా అని చూసిన ఫ్యాన్స్ కు నిరాశ తప్పలేదు.
దీనికి తోడు బిగ్ బాస్’ షోలో పాల్గొన్న వాళ్లలో చాలామంది అందులోకి రావాల్సింది కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ సారి షాలో పాల్గొంటున్న వారి పేర్లలో ఎగ్జైట్ చేస్తున్నవి తక్కువే.
కరోనా తాలూకు భయాలు, ఆందోళనలు, బాధల్లో మునిగిపోయి ఉన్న జనాలు ఈ షో పట్ల ఇప్పటికైతే అంత ఆసక్తిని ప్రదర్శించట్లేదు. సరే ఈ విషయాలన్నీ బిగ్ బాస్ టీమ్ కు తెలియనవి కాదు. దాంతో వాళ్లు వాటిని అధిగమించేందుకు రకరకాల స్కెచ్ లు వేస్తున్నారు. రకరకాల ఎత్తుగడలు, గేమ్లు, మలుపులతో షోను ఎగ్జైటింగ్గా మార్చేందుకు ప్లాన్స్ తొలి రోజు నుంచే మొదలెట్టారు.
కరోనా లాక్ డౌన్ వల్ల షూటింగ్స్ ఆగిపోయి,టీవి పరిశ్రమ సైతం తీవ్ర నష్టాలు చవిచూస్తోంది. స్టార్ మా పరిస్దితి అదే. టీవి సీరియల్స్ లేక, మిగతా షో లు లేక పాత వాటినే ప్రసారం చేస్తూ కాలక్షేపం చేసి, ఇప్పుడిప్పుడే మళ్లీ ట్రాక్ లో పడుతోంది.
దాంతో ఆ నష్టాలను పూడ్చుకోవటానికి తన ప్రతిష్టాత్మకమైన షో ..బిగ్ బాస్ పైనే ఆశలు పెట్టుకుంది. మిగతా ఛానెల్స్ సరైన పోగ్రామ్ లు లేని ఈ సమయంలో ఈసారి బిగ్ బాస్ కి మాములుగా కంటే ఎక్కువ వ్యూయర్షిప్ ఉంటుందని ఛానెల్ యాజమాన్యం ఆశిస్తోంది. అందుకే ఎంత ఖర్చు అయినా...ఈ షోను హై సక్సెస్ చేయాలని డిసైడ్ అయ్యింది.