- Home
- Entertainment
- Krishnam Raju: స్టార్ డైరెక్టర్ ఫ్యామిలీకి 3000 ఎకరాలు రాసిచ్చిన కృష్ణంరాజు తాత.. కారణం తెలిస్తే ఫ్యూజులు ఔట్
Krishnam Raju: స్టార్ డైరెక్టర్ ఫ్యామిలీకి 3000 ఎకరాలు రాసిచ్చిన కృష్ణంరాజు తాత.. కారణం తెలిస్తే ఫ్యూజులు ఔట్
రెబల్ స్టార్ కృష్ణంరాజుది రాజుల ఫ్యామిలీ. మొగల్తూరు మహారాజా వారు.. తెలుగు స్టార్ దర్శకుడికి ఫ్యామిలీకి ఏకంగా మూడు వేల ఎకరాలు రాసిచ్చాడట. అందుకు కారణం తెలిస్తే మాత్రం ఫ్యూజుల్ ఎగిరిపోవాల్సిందే.

మొగల్తూరు మహారాజులు కృష్ణంరాజు ఫ్యామిలీ
కృష్ణంరాజు.. రాజుల ఫ్యామిలీ. ఆయనకు ముందు పది తరాలు రాజులుగా ఉన్నారు. దాదాపు తొమ్మిది సంస్థాలను పరిపాలించారు. నిజాం నవాబ్ ఆధీనంలో ఈ సంస్థానాలు పనిచేసేవి. ఆ తర్వాత క్రమంగా రాజుల కాలం పోయింది. కృష్ణంరాజు ఫ్యామిలీ అంతా సోషలైజ్ అయ్యింది. అందరిలో కలిసిపోయారు. ఇప్పుడు అందరిలాగానే ఉన్నారు. కానీ వారి వ్యక్తిత్వం విషయంలో మాత్రం రాజుల మనస్తత్వం పోలేదు. ఎవరికైనా సహాయం చేయడంలో, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో, అడిగిన వారికి కాదనకుండా ఇచ్చే విషయంలో వారు ముందుంటారు.
సహాయం చేయడంలో ముందుండే కృష్ణంరాజు ఫ్యామిలీ
కృష్ణంరాజు అంటే, ఆ తర్వాత ప్రభాస్ కూడా అంతే. తన ఇంటికి వచ్చినవారికి పసందైన విందు భోజనం పెట్టకుండా పంపించరు. ప్రభాస్ విషయంలో ఆయనతో సినిమాలు చేసిన ప్రతి ఒక్కరు ఈ మాట చెబుతారు. వారసత్వంగా ఆ లక్షణాలు వచ్చాయి. జీన్స్ లోనే ఆ మంచి లక్షణాలున్నాయని చెప్పొచ్చు. అయితే స్టార్ డైరెక్టర్కి కృష్ణంరాజు తాత వేల ఎకరాలు రాసిచ్చాడట. ఆ విషయాన్ని దర్శకుడు రాజా వన్నెంరెడ్డి తెలిపారు. ఐడ్రీమ్కిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
మొగల్తూరు రాజుకి మజ్జిక ఇచ్చిన దర్శకుడి ఫ్యామిలీ
కృష్ణంరాజు తాతలు మొగల్తూరు మహారాజులు. రాజా వన్నెంరెడ్డికి పది తరాల తాతలు.. మొగల్తూరు మహారాజుకి స్నేహితులు. అది ఎలా అంటే వాళ్లు గేదెలు, ఆవులు కాస్తూ ఊరూర తిరిగేవారట. ఓ సారి మొగల్తూరు వచ్చినప్పుడు రాజుకి చల్లని మజ్జిక కాచి ఇచ్చారు. అందులో తమ స్టయిల్లో కొన్ని దినుజులు యాడ్ చేశారు. ఆ మజ్జిక తాగిన రాజు ఫిదా అయ్యాడట. రోజూ వచ్చి తాగిపోయేవాడట. అలా వారి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అయితే కొన్ని రోజుల తర్వాత వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు బయలు దేరారు. ఈ విషయం రాజుకి తెలిసింది.
మజ్జిక ఇచ్చినందుకు 3000 ఎకరాలు రాసిచ్చిన కృష్ణంరాజు తాత
దీంతో వారు వెళ్లిపోతే అంతటి మజ్జిక తాను తాగలేనని చెప్పి అక్కడే స్థిరపడేలా వారికి ఏకంగా 3000 ఎకరాలు రాసిచ్చాడట. అలా కృష్ణంరాజు తాతల నుంచి రాజా వన్నెంరెడ్డి తాతలకు మూడు వేల ఎకరాలు భూమి వచ్చింది. కానీ వాళ్లు దాన్ని నిలుపుకోలేకపోయారు. అమ్ముకుంటూ వచ్చారని, ఇప్పుడు కొంత వరకే మిగిలిందని, ఆస్తులన్నీ పోయాయని దర్శకుడు తెలిపారు. మజ్జిక కోసం రాజా వన్నెంరెడ్డి తాతలకు మొగల్తూరు మహారాజా ఏకంగా మూడు వేల ఎకరాలు రాసివ్వడం విశేషం. ఈ విషయం కృష్ణంరాజుతో తాను చాలాసార్లు మాట్లాడుకున్నట్టు తెలిపారు రాజా వన్నెంరెడ్డి.

