కారణం ఆమె కాదు.. విడాకులపై స్పందించిన స్టార్ హీరో
మలయాళ స్టార్ హీరో దిలీప్, సీనియర్ నటి మంజు వారియర్లు సుధీర్ఘ వివాహ బంధాన్ని 2015లో తెగదెంపులు చేసుకున్నారు. అప్పట్లో వీరి విడిపోవటానికి అనేక కారణాలు తెర మీదకు వచ్చాయి. అయితే ఆ వార్తలపై హీరో దిలీప్ క్లారిటీ ఇచ్చాడు.
మలయాళ ఇండస్ట్రీ స్టార్ హీరో దిలీప్, మంజు వారియర్ నుంచి విడాకులు తీసుకోవటం గురించి ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు.
మేం ఇద్దరు విడిపోయాం.. ప్రస్తుతం ఎవరి జీవితం వాళ్లు గడుపుతున్నాం అంటూ చెప్పాడు.
దాదాపు 16 ఏళ్ల పాటు వివాహ బంధంలో కలిసున్నారు దిలీప్, మంజు. 1998 అక్టోబర్ 20 పెళ్లి చేసుకున్న ఈ జంట 2015 జనవరిలో అధికారికంగా విడిపోయారు.
అయితే వీరిద్దరు విడిపోవడానికి కావ్యా మాధవన్ కారణం అన్న ప్రచారం జరిగింది.
ఈ వార్తలపై స్పందించిన దిలీప్, తాను మంజు వారియర్తో విడిపోవడానికి కావ్య మాధవన్ కారణం కాదని వెల్లడించాడు దిలీప్. మరి వ్యక్తిగత సమస్యల కారణంగానే విడిపోయానని తెలిపాడు.
అంతేకాదు తాను మంజు వారియర్ నుంచి విడాకులు తీసుకున్నా.. ఇప్పటికీ మా ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఉందని తెలిపాడు.
అయితే మంజే వారియర్తో విడిపోయిన తరువాత కావ్యనే వివాహం చేసుకున్నాడు దిలీప్. 2016 నవంబర్ 25న ఓ ప్రైవేట్ హోటల్ వీరి వివాహం జరిగింది.