- Home
- Entertainment
- ప్రభాస్ తో సినిమా, క్లైమాక్స్ లో ఆ డైలాగ్ లేకుంటే మూవీ చేయను అని చెప్పిన విలన్..రిజల్ట్ ఏంటో తెలుసా ?
ప్రభాస్ తో సినిమా, క్లైమాక్స్ లో ఆ డైలాగ్ లేకుంటే మూవీ చేయను అని చెప్పిన విలన్..రిజల్ట్ ఏంటో తెలుసా ?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఓ సినిమాపై క్రేజీ విలన్ ఒకరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్లైమాక్స్ సీన్ మార్చకుండా ఉంటేనే తాను నటిస్తాను అని దర్శకుడికి విలన్ తేల్చి చెప్పారు.

ప్రభాస్ సినిమాలు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సినిమా అంటే సెట్స్ లో పండగ వాతావరణం ఉంటుంది. కో ఆర్టిస్ట్ లకు ప్రభాస్ స్వయంగా తన ఇంటి నుంచి విందు భోజనం తెప్పిస్తారు. కృష్ణం రాజు నుంచి ప్రభాస్ కి అదే అలవాటు వచ్చింది. సెలెబ్రిటీలు ఎవరైనా ప్రభాస్ గురించి మాట్లాడితే.. ఫుడ్ గురించి తప్పకుండా ప్రస్తావన ఉంటుంది.
క్రేజీ విలన్ గా సంపత్ రాజ్
ఓ క్రేజీ విలన్ ప్రభాస్ పెట్టే ఫుడ్ గురించి, ఓ బ్లాక్ బస్టర్ మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ విలన్ ఎవరో కాదు సంపత్ రాజ్. మిర్చి చిత్రంలో సంపత్ రాజ్ విలన్ గా నటించారు. ఆ తర్వాత శ్రీమంతుడు మూవీలో కూడా మెప్పించారు. ప్రస్తుతం టాలీవుడ్ లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సంపత్ రాజ్ కి వరుసగా అవకాశాలు వస్తున్నాయి.
కొరటాల శివ మిర్చి మూవీ
సంపత్ రాజ్ మిర్చి మూవీ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొరటాల శివ నాకు కథ చెప్పినప్పుడు ఆయన్ని నేను అడిగిన ప్రశ్న ఒక్కటే. కొరటాల శివ గారు క్లైమాక్స్ ని నాకు డైలాగ్స్ తో సహా వివరించారు. ప్రభాస్ ఎమోషనల్ డైలాగ్ చెప్పిన తర్వాత.. ఈ ఊర్లో కూడా ఒక మగాడు ఉన్నాడు అంటూ సంపత్ రాజ్ కత్తి కింద పడేస్తారు. ప్రభాస్ ని హగ్ చేసుకోవడంతో సినిమా పూర్తవుతుంది.
దర్శకుడికి సంపత్ రాజ్ కండిషన్
శివ గారు క్లైమాక్స్ లో ఈ డైలాగ్స్ ఇలాగే ఉండాలి. అస్సలు మార్చకూడదు. అలా అయితేనే నేను ఈ సినిమా చేస్తాను అని చెప్పా. ఈ డైలాగ్స్ మార్చితే విలన్ క్యారెక్టర్ పడిపోతుంది..అస్సలు మార్చను అని హామీ ఇచ్చారు. అందుకే తాను మిర్చి మూవీ చేసినట్లు సంపత్ రాజ్ తెలిపారు.
మిర్చి మూవీ క్లైమాక్స్
మిర్చి మూవీలో సంపత్ రాజ్ పవర్ ఫుల్ విలన్ గా కనిపించారు. క్లైమాక్స్ సన్నివేశంలో ప్రభాస్, సంపత్ రాజ్ పెర్ఫార్మెన్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది.

